Andhra Pradesh

News April 24, 2024

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలి: పురంధీశ్వరి

image

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలని రాజమండ్రి లోక్‌సభ కూటమి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. సోమవారం నిడదవోలులో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ MLAగా కూటమి అభ్యర్థి కందుల దుర్గేశ్‌ను, ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.

News April 24, 2024

కర్నూలు: 594 మార్కులు సాధించిన రైతు బిడ్డ

image

రుద్రవరం మండలం బీరవోలుకు చెందిన రైతు పుల్లారెడ్డి, శిరీష దంపతుల కుమార్తె ఎం హర్షిత 594 మార్కులు సాధించి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన బాలికగా నిలిచింది. అలాగే తాను చదివిన నంద్యాలలోని గురురాజ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తమ కూతురు పదో తరగతి పరీక్షల్లో ఇలా మొదటి ర్యాంకు సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 24, 2024

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న యువకుడిని సోమవారం లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. CI దేవ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. ఏటుకూరు రోడ్డులో మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఐ అమర్నాథ్ తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్‌కి చెందిన మహేందర్ సింగ్ తన స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. 11 గ్రాముల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.

News April 24, 2024

భీమిలి: టెన్త్ విద్యార్థినికి 588 మార్కులు

image

భీమిలి ఏపీఆర్ఎస్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం కోడి రాంబాబు తెలిపారు. వారిలో నైమిష 588, ఎల్.దుర్గ 586, వి.జ్యోతి 583, ఎం.త్రిష 580 మార్కులు సాధించారన్నారు. కేజీబీవీ విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. వారిలో ఏడుగురికి 500 మార్కులు దాటాయన్నారు. పండిట్ నెహ్రూ స్కూల్‌లో 72 మంది విద్యార్థులకు 55 మంది పాసయ్యారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు.

News April 24, 2024

కాకినాడ: మహిళను ఢీకొట్టిన కాలేజ్ బస్సు.. మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 24, 2024

అనంత: 594 మార్కులతో సత్తా చాటిన బైనేని జాష్ణవి

image

అనంతపురం నగరానికి చెందిన బైనేని జాష్ణవి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 594 మార్కులతో సత్తా చాటింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. 

News April 24, 2024

గుంటూరు: 29 నుంచి రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ (17243) రైలు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే (17244) ఈనెల 30వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.

News April 24, 2024

పెదపారుపూడి: చెరువులో పడవ బోల్తా పడి.. యువకుడి మృతి

image

మండలంలోని తంబలంపాడు గ్రామంలో నరసింహారావు పొలంలో చేపల చెరువు మేత వేయడానికి వెళ్లిన వల్లూరి విజయబాబు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. బాపులపాడు మండలానికి చెందిన విజయ్ కుమార్ చేపల చెరువు వద్ద కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేత వేసేందుకు పడవలో వెళ్లగా, పడవ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు. 

News April 24, 2024

కురుపాం: స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ నామినేషన్

image

కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ట్రాన్స్ జెండర్ అడ్డాకుల గీతా రాణి సమర్పించారు. సోమవారం కురుపాం తాహశీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ గీతా రాణి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తాము ఎన్నికలలో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నదే లక్ష్యం అన్నారు.

News April 24, 2024

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన జాన్ వెస్లీ 

image

తాడేపల్లిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఉభయగోదావరి జిల్లాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ జోనల్ ఇన్‌ఛార్జి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జాన్ వెస్లీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో రేపు ఎన్నికల్లో వైసీపీ జెండా మరోసారి ఎగిరేందుకు, సీఎం జగన్‌ను రెండోసారి గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.