Andhra Pradesh

News August 20, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాల కలవరం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, అతిసార కేసుల వివరాలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల DMHOలు ఎం.సుహాసినీ, జి.గీతాబాయి వివరించారు. జూన్, జులై నెలల్లో మలేరియా, డెంగీ- 300,టైఫాయిడ్-800+, అతిసారం కేసులు 208 నమోదయ్యాయన్నారు. విషజ్వరాలు నిర్ధారించిన ప్రాంతాల్లో 50 మీటర్ల పరిధిలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 20, 2024

కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: గొట్టిపాటి లక్ష్మి

image

మాజీ CM జగన్‌పై దర్శి TDP ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గులేదా, సైకో జగన్? శ్రీసిటీ కంపెనీలపై ‘ఫేకు జగన్’ తప్పుడు ప్రచారం’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అదే విధంగా ‘నీ స్థాయి కదిరి గొడ్డలి, పులివెందులకు చేపలు – రొయ్యలు, నీ పర్యటన అప్పుడు కట్టడానికి పరదాలు తప్పించి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా? ఎందుకీ ఫేక్ ప్రచారం సిగ్గు లేకుండా జగన్’ అని ‘X’లో పోస్ట్ చేశారు.

News August 20, 2024

నెల్లూరు: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ ఉపాది హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నల్లబోతుల భాస్కర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. నందిపాడు ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఏపివోఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ లకు మెమోలు ఇస్తూ… ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News August 20, 2024

చిత్తూరు: TDP నేతపై హత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రఘుచంద్ర గుప్తా కారులో ప్రయాణిస్తుండగా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు టెంపోతో ఢీకొని హత్యా ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఈ విషయంపై విచారణ జరపాలని గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 20, 2024

ఏలూరు: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ ఈ నెల 18న పొలంలో పనిచేస్తుండగా మానికల శ్రీను ఆమెను కొట్టి గాయపరిచి అత్యాచారానికి యత్నించాడు. దీంతో మహిళ కేకలు వేడయంతో శ్రీను పారిపోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన MLC నివేదిక ఆధారంగా శ్రీనుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News August 20, 2024

వెలుగోడులో మిద్దె కూలి ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

image

నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో విషాదం జరిగింది. పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో మట్టి మిద్దె కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో రాత్రి హఠాత్తుగా మట్టి మిద్దె కూలి హనుమన్న భార్య కుమ్మరి మద్దమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. హనుమన్న, కొడుకు రామాంజనేయులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News August 20, 2024

నెల్లూరు: వృక్షానికి రాఖీ కట్టిన విద్యార్థులు

image

అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేశ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను సోమవారం సందడిగా జరుపుకున్నారు. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టారు. వృక్షానికి కూడా రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య సోదర భావాన్ని చాటడానికి రక్షాబంధన్ పండుగ ఎంతో దోహదపడుతుందన్నారు.

News August 20, 2024

తేడావస్తే సుప్రీం కోర్టుకు వెళ్తా: బాలినేని

image

ఒంగోలులో సోమవారం జరగాల్సిన మాక్‌పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి బాలినేని స్పందిస్తూ.. తాను వెరిఫికేషన్ ఉంటుందని అనుకున్నానని, మాక్ పోలింగ్ కాదని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌కు లెటర్ ఇచ్చామని అలాగే హైకోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేశారన్నారు. హైకోర్టులో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానని బాలినేని స్పష్టం చేశారు.

News August 20, 2024

వీరులపాడు: పిడుగుపడి ఇద్దరి మృతి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. కుటుంబీకుల వివరాల మేరకు గంపలగూడెంలోని పెనుగొలనుకు చెందిన వెంకటేశ్వరరావు(26) సోమవారం పొలం దున్నేందుకు వెళ్లాడు. వర్షం పడడంతో చెట్టుకిందికి వెళ్లాడు. ఆసమయంలో పిడుగుపడి మృతి చెందాడు. అలాగే దొడ్డదేవర పాడులో వెంకటరమణ(17) పొలంలో పనులు చేస్తుండాగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 20, 2024

తిరుపతి: డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పసల పొన్నారావు

image

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(M) VM పల్లి గ్రామానికి చెందిన పసల మహాలక్ష్మమ్మ, మోహన్‌రావుల కుమారుడు పొన్నారావు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(DSG)గా నియమితులయ్యారు. హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు కేంద్రన్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నారావు మూడేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి DSGగా నియమితులవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.