Andhra Pradesh

News June 11, 2024

ప.గో: అమాత్యయోగం ఎవరికో..?

image

ఉమ్మడి ప.గో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, హ్యాట్రిక్ MLA నిమ్మల రామానాయుడు, ఉండి MLA రఘురామకు అమాత్యయోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఫైర్ బ్రాండ్ MLA చింతమనేని పేరు, BJP కోటాలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్, జనసేన నుంచి బొలిశెట్టి, పులపర్తి రామాంజనేయులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

News June 11, 2024

కుప్పం: స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

image

స్నానం కోసం వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన కుప్పం మండలంలో జరిగింది. బెంగళూరులోని మహాలక్ష్మిపురంలో ఉంటున్న మునిరాజు కుమారుడు మౌనిశ్ (15) తల్లితో కుప్పం మండలం గుట్టపల్లెకాలనీకి వచ్చారు. అక్కడ బంధువుల వివాహం ముగించుకొని పాలారులో స్నానం చేసేందుకు తల్లితో కలిసి వెళ్లాడు. అక్కడ నీటిలో ఈతకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News June 11, 2024

ఒంగోలు: స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలి: కలెక్టర్

image

స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన, సమావేశంలో అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు పొందిన స్కానింగ్ కేంద్రాలు తిరిగి రెన్యువల్ చేసుకున్నారా లేదా కూడా పరిశీలించాలన్నారు. సమావేశంలో ఆరోగ్య శాఖకు చెందిన శ్రీధర్ రావు, డీఎంహెచ్‌వో సురేష్, నాగార్జున తదితర అధికారులు పాల్గొన్నారు.

News June 11, 2024

విశాఖ: పలు రైళ్లును దారి మళ్లించిన రైల్వే అధికారులు

image

సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్-గన్నవరం సెక్షన్ మధ్య భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లును దారి మల్లించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ పేర్కొన్నారు.
ఎర్నాకులం-పాట్నా (22643 ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11, 17, 18, 24, 25 తేదీల్లో, ఎస్‌న్‌వి బెంగళూరు- గువాహటి (125509) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 14, 21, 28 తేదీల్లో దారి మళ్లించనున్నారు.

News June 11, 2024

చంద్రబాబును కలిసిన రాంప్రసాద్ రెడ్డి

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిసి టీడీపీ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు.

News June 11, 2024

పవన్‌కి కన్ఫర్మ్.. ఇంకా ఎవరెవరికో మంత్రి పదవులు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి పదవి ఆశావహులు భారీగానే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌కి దాదాపు కన్ఫర్మ్ కాగా.. జనసేన కోటాలో కందుల దుర్గేశ్‌, BJP కోటాలో నల్లమిల్లికి అమాత్య యోగం ఉన్నట్లు తెలుస్తోంది. యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేర్లు బలంగా వినిపిస్తుండగా.. బుచ్చయ్యచౌదరి, వనమాడి కొండబాబు, సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు సహా తొలిసారి ఎన్నికైన పలువురు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

News June 11, 2024

గుంటూరు జిల్లాలో పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.

News June 11, 2024

నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులపై తీవ్ర ఉత్కంఠ

image

కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్‌ నేతలుగా గుర్తింపు పొందగా.. పొంగూరు నారాయణ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మహిళా కోటలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.

News June 11, 2024

ఉమ్మడి ప్రకాశంలో మంత్రి పదవులపై తీవ్ర ఉత్కంఠ

image

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ సాగుతోంది. ఈరోజు విజయవాడలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు సైతం రేసులో ఉన్నారు

News June 11, 2024

బొబ్బిలి: బైక్‌తో డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి

image

బైక్ అదుపు తప్పి వంతెన డివైడర్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. బొబ్బిలిలోని స్వామివారి వీధికి చెందిన జగదీశ్వరరావు (30) ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా ఫ్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి వంతెన డివైడర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగదీశ్‌‌కు ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.