Andhra Pradesh

News August 29, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(2023-24 విద్యా సంవత్సరం) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. 

News August 29, 2024

సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

సీఎం చంద్రబాబును గురువారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. చంద్రబాబును కలిసినప్పుడల్లా మరింత ఉత్సాహం వస్తుందని సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రి తెలిపారు.

News August 29, 2024

వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు: గంటా

image

వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేటట్లు లేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నివాసంలో గురువారం గంటా మాట్లాడుతూ… వైసీపీలో ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఈ విషయాన్ని ముందే చెప్పానన్నారు. రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.

News August 29, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

VZM: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలం మదనాపురంలో చెట్టు నుంచి జారిపడి ముంత అప్పారావు(50) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి కృష్ణ అందించిన వివరాల ప్రకారం.. మృతుడు మదనాపురంలోని ఓ షాప్ ఓపెనింగ్ కొరకు నేరేడు కొమ్మలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

VZM: పరుగు పందెంలో ట్రాన్స్ జెండర్స్

image

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని విజ్జీ స్టేడియం లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పలువురు ట్రాన్స్ జెండర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. యూత్‌ఫెస్ట్ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన ఈ మార‌థాన్ పోటీల‌ను బాలురు, బాలిక‌లు, ట్రాన్స్ జెండ‌ర్స్ మూడు విభాగాలుగా విభ‌జించి, ఒక్కో విభాగంలో ప్ర‌ధ‌మ బ‌హుమ‌తి క్రింద రూ.7,000, రెండో బ‌హుమ‌తి క్రింద రూ.4,000 అంద‌జేస్తారు.

News August 29, 2024

TDPపై మాజీ మంత్రి కాకాణి ఫైర్

image

టీడీపీపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ బీద మస్తాన్ పార్టీని వీడుతున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో.. టీడీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని విమర్శిచారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇందంతా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ని భూస్థాపితం చేసే కుట్ర జరుగుతోందని , ఎవరో ఒకరు ఇద్దరు ఎంపీలు పార్టీని వీడితే ఒరిగే నష్టం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

News August 29, 2024

విశాఖలో మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యేలు భేటీ

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే పి.శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి తదితరులు లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

News August 29, 2024

ఇసుక బుకింగ్‌కు విశేష స్పందన

image

కర్నూలు జిల్లాలో ఇసుక బుకింగ్‌కు విశేష స్పందన లభించింది. తొలి రోజు 195 బుకింగ్‌లకు గాను 3,312 టన్నులు ఇసుకను వాహనాలకు లోడు చేశారు. సీ.బెళగల్ మండలంలోని రీచ్ నుంచి 80 బుకింగ్‌లకు 1,034 టన్నులు, కర్నూలు మండల రీచ్ నుంచి 115 బుకింగ్స్‌కు 2,278 టన్నులు లోడింగ్ చేశామని మైనింగ్ జిల్లా డీడీ రాజశేఖర్ అన్నారు. ఇందులో 150 టిప్పర్లు, 45 ట్రాక్టర్లు లోడ్ అయ్యాయన్నారు.