Andhra Pradesh

News March 28, 2024

సర్వేపల్లిలో మూడో ఛాన్స్ ఎవరికో !

image

సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం రాలేదు. సీవీ శేషారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం 2వసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మరోమారు కాకాణి, సోమిరెడ్డి ముఖాముఖి తలపడబోతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా మూడో ఛాన్స్ కొట్టేసినట్టే .

News March 28, 2024

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదంలో UPDATE

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లె జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో వెహికల్ బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉండగా, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.

News March 28, 2024

గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్‌ పరీక్షలు

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

News March 28, 2024

ఏప్రిల్ 1 నుంచి మెమూ రైళ్ల పునరుద్ధరణ

image

బిట్రగుంట – విజయవాడ, బిట్రగుంట – చెన్నై మధ్య నడిచే మెమూ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు రైళ్లను ఇప్పటికే పునరుద్ధరణ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే అభివృద్ధి కమిటీకి కూడా సమాచారం పంపారు.

News March 28, 2024

కృష్ణా: కేటిఎమ్ పండు అరెస్ట్

image

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన నేరస్థుడిపై పోలీసులు PDయాక్ట్ అమలు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం కొండూరి మణికంఠ అలియాస్ KTM పండు(26) పెనమలూరు మండలం కానూరులోని సనత్‌నగర్ వాసి, హత్యలు, నేరాలకు అలాటుపడి శాంతి బద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. అతని నేర నివేదిక మేజిస్ట్రేట్‌కి సమర్పించగా రాజమండ్రి కారాగారంలో నిర్భంధంలో ఉంచాలని ఉత్తర్వులిచ్చారన్నారు.

News March 28, 2024

నెల్లూరు నగరంలో దారుణ హత్య

image

నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.

News March 28, 2024

పుంగనూరు: 1 నుంచి ఉపాధి కూలీ రూ:300

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

News March 28, 2024

బాపట్లలో గెలుపు ఎవరిది.?

image

బాపట్ల నియోజకవర్గంలో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. 1999లో చివరిగా టీడీపీ నుంచి మంతెన అనంతవర్మ గెలుపొందారు. అప్పటి నుంచి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. 

News March 28, 2024

కోవెలకుంట్ల: ఇద్దరు వాలంటీర్లు రాజీనామా

image

కోవెలకుంట్ల మండలంలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు కోవెలకుంట్ల మండల ఎంపీడీవో సయ్యదున్నిసా ఓ ప్రకటనలో వెల్లడించారు. కోవెలకుంట్ల పట్టణం సచివాలయం-5కు చెందిన మీనా కుమారి, గుళ్లదుర్తి గ్రామానికి చెందిన పాణ్యం మహేష్ కుమార్ రాజీనామా లెటర్ అందించినట్లు తెలిపారు. కాగా సీఎం జగన్ కోసం పని చేయడానికి తమ పదవులు అడ్డుగా ఉన్నాయన్న కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు ప్రకటించారు.

News March 28, 2024

తెలంగాణలో తూ.గో జిల్లావాసి సూసైడ్

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో సామర్లకోటకు చెందిన కొరిపల్లి సంజయ్ (26) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై యాదగిరి బుధవారం తెలిపారు. ఇతను సంజయ్ దివిస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని చెప్పారు. పరిశ్రమ క్వార్టర్స్ లో ఉండే అతను నెల రోజుల క్రితం స్నేహితులు అద్దెకు ఉండే గదికి మారాడన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

error: Content is protected !!