Andhra Pradesh

News April 24, 2024

10Th రిజల్ట్స్: ప.గో@ 23.. ఏలూరు@ 25

image

☞ ‘పది’ ఫలితాలలో 81.82 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. 20,785 మంది పరీక్షలు రాయగా.. 17,007 (BOYS-8,262, GIRLS-8,745) మంది పాసయ్యారు.
☞ ఏలూరు జిల్లాలో 23,163 మంది పరీక్షలు రాశారు. వీరిలో 18,549 (BOYS-8,513, GIRLS-10,036) మంది ఉత్తీర్ణులయ్యారు. 80.08 శాతంతో ఈ జిల్లా 25వ స్థానంలో నిలిచింది.

News April 24, 2024

విశాఖ@8..అల్లూరి@9..అనకాపల్లి@12 స్థానం

image

➤ విశాఖ జిల్లాలో మొత్తం 28,299 మందికి 25,794 మంది పాసయ్యారు. 91.15 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. (గతేడాది 76.66% ఉత్తీర్ణత)
➤ అల్లూరి జిల్లాలో 10,823 మందికి 9,843 మంది పాసయ్యారు. 90.95 ఉత్తీర్ణత %తో 9వ స్థానంలో నిలిచింది. (గతేడాది 61.41% ఉత్తీర్ణత)
➤ అనకాపల్లి జిల్లాలో 21,169 మందికి 18,848 మంది పాసయ్యారు. 89.04 ఉత్తీర్ణత %తో 12వ స్థానంలో నిలిచింది. (గతేడాది 77.74% ఉత్తీర్ణత)

News April 24, 2024

10th RESULTS.. చిత్తూరు జిల్లాకు 6వ స్థానం

image

టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6 స్థానంలో నిలిచింది. 20,939 మందికి 19113 మంది పాసయ్యారు. 10793 మంది బాలురకు 9596 మంది, 10146 మంది బాలికలకు 9517 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాసయ్యారు. 90.71 శాతంతో పదో స్థానంలో నిలిచింది. 13997 మంది బాలురకు 12538 మంది, 12628 మంది బాలికలకు 11613 మంది పాసయ్యారు.

News April 24, 2024

టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్రంలో కర్నూలు జిల్లానే చివరి స్థానం

image

టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మెుత్తం 30802 మందికి 19242 మంది పాసయ్యారు.62.47 ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. బాలురు 16276 మందికిగాను 9313మంది, బాలికలు 14526 మందికిగాను 9929 మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లాలో 23787 మందికి గాను 20367 మంది పాసయ్యారు. 85.62ఉత్తీర్ణత శాతంతో 19వ స్థానంలో నిలిచింది. బాలురు 12283 మందికిగాను 10216.. బాలికలు 11504కు గాను 10151 మంది పాసయ్యారు.

News April 24, 2024

‘పది’ ఫలితాల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 4వ స్థానం

image

☞ ‘పది’లో 91.88 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే 4న స్థానంలో నిలిచింది. 18,787 మంది పరీక్షలు రాయగా.. 17,262 (BOYS-8,551, GIRLS-8,711) మంది పాసయ్యారు.
☞ తూ.గో: 23,367 మందికి గానూ 19,414 (BOYS-9,648, GIRLS-9,793) మంది ఉత్తీర్ణులయ్యారు. 83.2శాతంతో 21వ స్థానం.
☞ కాకినాడ: 27,671 మంది పరీక్షలు రాయగా.. 22,993 (BOYS-10,958, GIRLS-12,035) మంది పాసయ్యారు. 83.09శాతంతో 22వ స్థానంలో ఉంది.

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 15వ స్థానం

image

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో నిలిచింది. 27,788 మంది పరీక్షలు రాయగా 24500 మంది పాస్ అయ్యారు. 13926 మంది బాలురు పరీక్షలు రాయగా 12003 మంది పాస్ అయ్యారు. 13862 మంది
బాలికలు పరీక్ష రాయగా 12497 మంది పాస్ అయ్యారు. అటు తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాస్ అయ్యారు.

News April 24, 2024

టెన్త్ ఫలితాలలో శ్రీకాకుళం జిల్లాకు రెండో స్థానం

image

ఏపీలో విడుదలైన టెన్త్ ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా 93.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. బాలురు 14,712 మంది పరీక్షలు రాయగా 13,489 మంది పాసయ్యారు. బాలికలు 14,033 మంది పరీక్షలు రాయగా 13,344 మంది పాసయ్యారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 28,745 మంది పరీక్షలు రాయగా 26,833 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 91.69 శాతం, బాలికలు 95.09 %మంది ఉత్తీర్ణులయ్యారు.

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం ఫస్ట్

image

➤ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 10,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 96.37%తో 10,064 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 87.47 శాతం మంది పాస్ అయ్యారు.
➤ విజయనగరం జిల్లాలో మొత్తం 23,690 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 91.82 శాతంతో 21,752 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది 76.66% మంది పాసయ్యారు.

News April 24, 2024

పదోతరగతి ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా సత్తా

image

10th ఫలితాల్లో కడప జిల్లా 92.10% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3 స్థానంలో నిలిచింది. 27,729 మందికి 25,538 పాసయ్యారు. 13,515 మంది బాలికలకు 12,609 పాసయ్యారు. బాలురు 14,214 మందికి గానూ 12,929 పాసయ్యారు. బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 79.43% ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.10% సాధించారు. అటు అన్నమయ్య జిల్లా 86.67 ఉత్తీర్ణత శాతంతో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,240 మందికి గానూ 19,276 పాసయ్యారు.

News April 22, 2024

కడప జిల్లాను భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో వారం రోజుల నుంచి రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో సరైన నిద్రలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ఉ.9 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. పగలంతా ఎండతాకిడితో అల్లాడిన జనం రాత్రి పూటైనా కాసింత ప్రశాంతంగా నిద్రపోదామంటే కూడా కుదరని పరిస్థితి నెలకొందని అంటున్నారు.