Andhra Pradesh

News March 27, 2024

ఎచ్చెర్ల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వివరాలివే!

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News March 27, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

కొమరాడ: ఐదు కిలోల గంజాయి స్వాధీనం

image

ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కూనేరు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాయగడ వైపు నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు ఒక వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన కూడా మూడు కిలోల గంజాయితో ఇద్దరు మైనర్లు పట్టుబడిన విషయం తెలిసిందే.

News March 27, 2024

నెల్లూరు: ప్రచారంలో నేతల వారసులు 

image

నెల్లూరులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని చోట్ల నేతల వారసులు ప్రచారంలో  మెరుస్తున్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ భార్య, నారాయణ భార్య, కుమార్తెలు, రూరల్‌లో కోటంరెడ్డి కుటుంబసభ్యులు, కోవూరులో ప్రశాంతిరెడ్డి కుమారుడు, కుమార్తె, నల్లపరెడ్డి కుమారుడు, సర్వేపల్లిలో కాకాణి కుమార్తె, సోమిరెడ్డి కుమారుడు, కోడలు, గూడూరులో పాశం భార్య ప్రచారంలో నిమగ్నమయ్యారు.

News March 27, 2024

గాజువాక: ‘హామీని నిలబెట్టుకున్న జగన్’

image

సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికి సొంత ఇంటి కలలు నిజం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ పాల్గొన్నారు.

News March 27, 2024

మచిలీపట్నం: కలెక్టర్‌ను కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారిణి

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్‌కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2024

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది: టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం కర్నూలు టీడీపీ కర్నూలు పార్లమెంట్ కార్యలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు  తమపై నమ్మకం ఉంచి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను అన్నారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి చంద్రబాబుకు కనుక ఇస్తానన్నారు.

News March 27, 2024

మాజీ సైనికుడికి అనపర్తి టికెట్

image

బీజేపీ అనపర్తి MLA అభ్యర్థి శివరామకృష్ణంరాజు బిక్కవోలు మండలం రంగాపురంలో 1986 జులై 22న జన్మించారు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ స్థాయిలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన రాజు RSSలో ప్రచార ప్రముఖ్‌గా పని చేశారు. అనంతరం BJPలో చేరి మండల అధ్యక్షుడిగా, జిల్లా మీడియా ప్యానలిస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం అనపర్తి BJP కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి రామరాజు 1982 నుంచి BJP సభ్యుడు.

News March 27, 2024

రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు: మాధవి రెడ్డి

image

త్వరలో రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవీ రెడ్డి ఎక్స్‌(ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులో ‘అవినీతి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప జనాలకు ఏమైనా చేశారా… మీ రాక్షస పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.

News March 27, 2024

పొత్తులో భాగంగా మారిన అరకు సీటు

image

అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును అధిష్ఠానం ఎంపిక చేసింది. నెల రోజుల కిందట టీడీపీ అభ్యర్థి దున్నుదొరని ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ ముందు కేటాయించినా పోటీలో సరైన అభ్యర్థి లేనందున అరకు అసెంబ్లీ సీటుని కోరుకున్నారు. దీంతో అరకు నియోజకవర్గ అభ్యర్థిగా పాంగి రాజారావుకు సీటు కేటాయించారు.

error: Content is protected !!