India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికి సొంత ఇంటి కలలు నిజం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ పాల్గొన్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం కర్నూలు టీడీపీ కర్నూలు పార్లమెంట్ కార్యలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు తమపై నమ్మకం ఉంచి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను అన్నారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి చంద్రబాబుకు కనుక ఇస్తానన్నారు.
బీజేపీ అనపర్తి MLA అభ్యర్థి శివరామకృష్ణంరాజు బిక్కవోలు మండలం రంగాపురంలో 1986 జులై 22న జన్మించారు. 16 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ స్థాయిలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన రాజు RSSలో ప్రచార ప్రముఖ్గా పని చేశారు. అనంతరం BJPలో చేరి మండల అధ్యక్షుడిగా, జిల్లా మీడియా ప్యానలిస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం అనపర్తి BJP కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి రామరాజు 1982 నుంచి BJP సభ్యుడు.
త్వరలో రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవీ రెడ్డి ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులో ‘అవినీతి చేయడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప జనాలకు ఏమైనా చేశారా… మీ రాక్షస పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును అధిష్ఠానం ఎంపిక చేసింది. నెల రోజుల కిందట టీడీపీ అభ్యర్థి దున్నుదొరని ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ ముందు కేటాయించినా పోటీలో సరైన అభ్యర్థి లేనందున అరకు అసెంబ్లీ సీటుని కోరుకున్నారు. దీంతో అరకు నియోజకవర్గ అభ్యర్థిగా పాంగి రాజారావుకు సీటు కేటాయించారు.
ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన చీరలు, దుస్తులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు గోడౌన్లో సోదాలు చేసి 1000కి పైగా చీరలు, షర్ట్లు, ప్యాంట్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన చెక్పోస్టుల ద్వారా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ గంజాయి, నాటు సారా, మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లా వ్యాప్తంగా 31ప్లయింగ్ సర్వీసెస్ టీమ్లు తిరుగుతున్నాయని అన్నారు.
మండలంలోని మూగిపురం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీ నారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని నరసన్నపేట ఆర్వో జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు సారవకోట ఎంపీడీవో ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు ఉంటాయని అన్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి కూడా నివేదించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ధర్మవరం బీజేపీ MLA అభ్యర్థిగా ఖరారైన వై.సత్యకుమార్.. రాయలసీమలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బళ్లారి, మదనపల్లె, బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీవైపు అడుగులు వేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ABVPలో కీలకంగా వ్యవహరించారు. 6 భాషలు మాట్లాడే సత్య.. BJP జాతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో అధ్వానీ రథయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
Sorry, no posts matched your criteria.