Andhra Pradesh

News June 10, 2024

పెనుకొండ: ఈతకు వెళ్లి యువకుడి మృతి

image

ఈతకోసం వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పెనుకొండ పట్టణానికి చెందిన సంతోశ్, స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోతున్నా యువకుడిని గమనించి అక్కడి వారు కాపాడటానికి ప్రయత్నించినప్పటికి అప్పటికే మృతి చెందారు. కియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

ప.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

తూ.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

చిత్తూరు: శునకానికి పదవీ విరమణ

image

డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్‌కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

News June 10, 2024

ఏలూరు: గోదావరిలో తల్లీకొడుకు గల్లంతు

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకు చెందిన పదిమంది సోమవారం మండలంలోని కట్కూరు శివాలయ దర్శనానికి వచ్చారు. అనంతరం గోదావరిలో స్నానం చేస్తుండగా తల్లి అల్లంశెట్టి నాగమణి, కొడుకు తేజ శ్రీనివాసులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు సిక్కోలు జట్టు ఎంపిక

image

గుంటూరు జిల్లా బాపట్లలో ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు సోమవారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ పర్యవేక్షణలో ఎంపికలు చేపట్టారు. రగ్బీ జిల్లా జట్టుకు బాలురు, బాలికలు కలిపి 24 మందిని ఎంపిక చేశారు.

News June 10, 2024

చిత్తూరు: ప్రేమజంట సూసైడ్.. పీటీఎంలో కేసు నమోదు

image

బత్తలపల్లె అడవిలో ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన ప్రేమజంట ఘటనపై పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు కేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం, దేవలచెరువు నరేంద్ర(25), రాణి(17) ప్రేమించుకున్నారు. బత్తలాపురం అడవికి వెళ్లి పురుగు తాగిన విషయం తెలిసిందే. ములకళచెరువు ఎస్‌ఐ వారిని మదనపల్లెకు తరలించగా ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పీటీఎం పరిధిలోకి వస్తుందని ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News June 10, 2024

కడప: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సామాజిక, సేవా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం అర్హులైన వారు జూలై 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు https://awards.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 10, 2024

చంద్రబాబు చూపు దామచర్ల వైపేనా ?

image

ఒంగోలు MLA దామచర్ల జనార్దన్‌కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా వచ్చిన జనార్దన్ TDP కష్టకాలంలో దశాబ్దం పాటు జిల్లా అధ్యకుడిగా పార్టీకి సేవలందించారు. అలాగే ఒంగోలులో మహానాడు, యువగళం కార్యక్రమాలు విజయవంతమవటానికి, అభ్యర్థుల గెలుపునకు తెరవెనుక కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమనే చర్చ నడుస్తోంది.

News June 10, 2024

అనంతగిరి: బొర్రా గుహలకు పెరిగిన సందర్శకుల తాకిడి

image

అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం మూడు వేల మంది బొర్రాగుహలను సందర్శించగా రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం నాలుగు వేల మంది బొర్రా గుహలను సందర్శించగా రూ.3.91 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే బొర్రా జిఫ్ లైన్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం రూ.1.16 లక్షల ఆదాయం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.