Andhra Pradesh

News September 6, 2024

ఏలూరు జిల్లాలో కి‘లేడీ’.. విలాసాల కోసం చోరీల బాట

image

ఏలూరు జిల్లా భీమడోలులో ఓ కి‘లేడీ’ని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రావణ్ వివరాల ప్రకారం.. గుండుగొలనులోని YSR కాలనీకి చెందిన శ్రీదేవి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టింది. కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. దీనిపై ఫిర్యాదులు అందగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రూ 4,47,000/- విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News September 6, 2024

జమ్మలమడుగు: బైకు అదుపు తప్పి.. విద్యార్థిని మృతి

image

కడప జిల్లా ముద్దనూరుకి చెందిన సుంకన్న అనే వ్యక్తి రేపు పండగ కావడంతో హాస్టల్‌ నుంచి పిల్లలను తీసుకురావడానికి మైలవరం వచ్చాడు. అనంతరం ఇద్దరు కూతుర్లతో ముద్దనూరు వెళ్తుండగా.. మార్గమధ్య సుంకన్నకు BP డౌన్ అయి బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడ్డాడు. దీంతో 5వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు సుమ (10) అక్కడికక్కడే మృతి చెందగా.. 2వ కూతురు సుప్రియకి తీవ్ర గాయాలు కాగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.

News September 6, 2024

ఇక నుంచి రాజాంలో అందుబాటులో తిరుమల లడ్డూ

image

తిరుపతి లడ్డూ ప్రసాదం మారుమూల గ్రామాలకు కూడా అందించాలనే దృక్పథంతో, లడ్డూను రాజాంలోని టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అంతకాపల్లి బాలాజీ టెంపుల్‌లో విక్రయించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైజాగ్ రుషికొండ ఏఈవో జగన్మోహనాచార్యులు నెలలో రెండు పర్యాయాలు విక్రయించేందుకు.. రేపు వినాయక చవితి సందర్భంగా ఉదయం 10గం. తిరుపతిలో విక్రయించే ధరకే కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.

News September 6, 2024

భోగాపురం పనులు వేగవంతం: కేంద్రమంత్రి

image

ఉత్తరాంధ్రకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానాశ్రయ టర్మినల్ భవనం, అప్రోచ్ రహదారుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష చేశారు. ప్రపంచంలో అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని, 2026 జూలై కల్లా విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.

News September 6, 2024

తాగుడుకు బానిసైన భర్త.. భార్య తిట్టిందని సూసైడ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మెర్ల సత్తయ్య(53) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సత్తయ్య రోజూ తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. కోపంతో గురువారం పురుగు మందు తాగిన సత్తయ్య.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలుపారు.

News September 6, 2024

ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు

image

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇటీవల ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల ధ్వంసంపై విచారణ చేయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆ గేట్లు శుక్రవారం మరమ్మతులు చేశారు.

News September 6, 2024

అనంతపురంలో రుతురాజ్ గైక్వాడ్‌ కాళ్లు మొక్కిన అభిమాని

image

అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. సీ, డీ జట్ల మధ్య రెండో రోజు ఆట సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమాని.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్‌, ఇండియా-సీ టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పాదాభివంద‌నం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

News September 6, 2024

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో SCV నాయుడు

image

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి రావడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన ట్రబుల్ షూటర్ ఎస్‌సీవీ నాయుడు వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

News September 6, 2024

భోగాపురం పనులు వేగవంతం: కేంద్రమంత్రి

image

ఉత్తరాంధ్రకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శుక్రవారం కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
విమానాశ్రయ టర్మినల్ భవనం, అప్రోచ్ రహదారుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష చేశారు.
ప్రపంచంలో అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని, 2026 జూలై కల్లా విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొనివస్తామని మంత్రి తెలిపారు.

News September 6, 2024

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన MLA ఉగ్ర

image

గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం గుంటూరు ఐజీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA ఉగ్ర మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని ఐజీని కోరినట్లు తెలిపారు. పోలీసు అధికారులకు తమ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.