Andhra Pradesh

News June 10, 2024

చిత్తూరు: సెలవులపై వెళ్లిన టీటీడీ ఈవో

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ ప్రభుత్వం వారం రోజులు పాటు సెలవు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం దాటి పోరాదని నిబంధన విధించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న ధర్మారెడ్డి సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులు పాటు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్రం దాటి పోకుండా నిబంధన విధించడం సంచలనంగా మారింది.

News June 10, 2024

చంద్రబాబుతో దామచర్ల భేటీ.. మంత్రి పదవి ఖాయమేనా?

image

పార్టీ అఖండ విజయం సాధించడంతో పాటు బుధవారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అమరావతిలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో దామచర్లకు మంత్రి పదవి ఖాయమనే చర్చ మొదలైంది. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటే నడిచిన దామచర్ల కుటుంబానికి.. నిన్న కింజరాపు కుటుంబానికి దక్కిన గౌరవం దక్కుతుందని పార్టీ కేడర్ భావిస్తోంది.

News June 10, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి విశాఖలో LED స్క్రీన్లు

image

➠ పీఎం పాలెం GVMC కమ్యూనిటీ హాల్(వార్డు నం.6)
➠ సిరిపురంలోని VMRDA చిల్డ్రన్ ఎరీనా రెండో అంతస్తు
➠ డాబాగార్డెన్స్‌లోని డ్వాక్రా బజార్ GVMC బిల్డింగ్
➠ అక్కయ్యపాలెం షాధీఖానాహాల్ (వార్డు నం.44)
➠ కంచరపాలెం కాయిత పైడయ్య కళ్యాణ మండపం(వార్డు నం.57)
➠ వేపగుంట కమ్యూనిటీ హాలు(వార్డు నం.94)
➠ గాజువాకలోని చైతన్య నగర్‌(వార్డు నం.77) LED స్క్రీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

News June 10, 2024

సింహగిరిపై అప్పన్నకు దివిటీ సేవ

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారికి దివిటీ సేవ నిర్వహించారు. సోమవారం ఒడిశాకు చెందిన భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో ముందుగా టికెట్ తీసుకున్న వారికి దేవస్థానం రెండు దివిటీలను అందజేస్తుంది. ఈ దివిటీలను పట్టుకుంటూ ఆలయం చుట్టు భజనలు చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ ఆలయంలో ఆధ్యాత్మికతకు నిదర్శనగా నిలుస్తుంది.

News June 10, 2024

రుద్రవరం: వీఆర్‌ఏ ఆకస్మిక మృతి

image

రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పీరు బై(47) సోమవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు వీఆర్వో హుస్సేన్ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందారన్నారు. వీఆర్ఏ మృతదేహానికి తహశీల్దార్ మురళిమోహన్ పూలమాలవేసి నివాళులర్పించారు. 

News June 10, 2024

పెండ్లిమర్రి: గుండెపోటుతో వ్యక్తి హఠాన్మరణం

image

గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపెండ్లిమర్రి మండలం యాదవాపురంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆదిమూలం వెంకట కృష్ణయ్యకు (54) గుండె నొప్పిగా ఉందని కుటుంబీకులు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయామని ఇంక మాకు దిక్కెవరని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

News June 10, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 10, 2024

మాసీ CM జగన్‌ను కలిసిన ప.గో. జిల్లానేతలు

image

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలను ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. 

News June 10, 2024

రామ్మోహన్‌నాయుడుకు పౌరవిమానయాన శాఖ.. భోగాపురానికి మరింత ఊపు..!

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయానశాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆశాఖ కేటాయింపుతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టు పనులు మరింత వేగంగా జరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్వక్తంచేస్తున్నారు. 2014 కూటమి ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు CM హోదాలో చంద్రబాబు, కేంద్రమంత్రి హోదాలో అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేయగా.. మళ్లీ సీఎం జగన్ రెండోసారి శంకుస్థాపన చేశారు.

News June 10, 2024

సిక్కోలు నిరుద్యోగుల కల నెరవేరేనా …!

image

VZM జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఇప్పటికే జరుగుతుండగా .. పక్క జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన ) మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో ఈ ఎయిర్పోర్ట్ పనులు మరింత ఊపు అందుకోనున్నాయని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగం కలనెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.