Andhra Pradesh

News March 27, 2024

కడప: భూపేశ్ రెడ్డికి షాక్

image

జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణ రెడ్డికి టికెట్ లభించింది. ఈయన 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలోకి చేరారు. 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూపేశ్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.

News March 27, 2024

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: కలెక్టర్

image

ఎన్నికల నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించుట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం చేయరాదన్నారు.

News March 27, 2024

ఆనం వివాదాస్పద ట్వీట్

image

సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈక్రమంలో విజయమ్మ సీఎం జగన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వివాదాస్పదంగా స్పందించారు. ‘చెల్లిని ఏమీ చేయవద్దు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు.

News March 27, 2024

ANU: ‘డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి’

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగవలసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. రాజశేఖర్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. లక్ష్మణరావుతోపాటు అధ్యాపక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలబస్ పూర్తికాని దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 27, 2024

సీ.విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి: జేసీ

image

సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ప్రవేటు భవనాలపై వాల్ పేయింటింగ్‌కు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచే స్వీప్ కార్యక్రమాల నివేదిక తయారు చేయాలన్నారు.

News March 27, 2024

సింహాచలం: యజ్ఞంలో పాల్గొన్న పీఠాధిపతులు

image

సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.

News March 27, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో 100శాతం ప్రసవాలకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసూతి మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. 6ప్రసూతి మరణాలకు సంబంధించి విచారణ చేపట్టారు. 

News March 27, 2024

VZM: ‘ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు తొలగించాలి’

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈఓ ముఖేశ్ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

News March 27, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

image

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.

News March 27, 2024

కడప: ప్రేమ పెళ్లి ..విషాదంతో ముగిసింది

image

పెద్దల నెదిరించారు, పోలీసు కేసులు, ఛేజింగ్ చివరికి ఐదు నెలల క్రితం పుల్లంపేట మండలం దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన హరికృష్ణ, చిట్వేలి కేకే వడ్డిపల్లికి చెందిన శ్రీలేఖ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా గడుపుతున్న ఆ జంటపై విధి కన్నెర్ర చేసింది. రాజంపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్సు హరికృష్ణ (21) మృతి చెందగా, శ్రీలేఖ గాయపడి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

error: Content is protected !!