India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధర్మవరంలో ఈనెల 5న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నదని నియోజకవర్గ బీజేపీ నాయకులు తెలిపారు. త్వరలో పీఎం నరేంద్ర మోదీ, మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో విన్నర్ జట్టుకు రూ.1,00,000, రన్నర్ జట్టుకు రూ.50,000 బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ 3వ తేదీలోగా శ్రీ సత్యసాయి జిల్లా జట్లు మాత్రమే నమోదు చేసుకోవాలని కోరారు.

సుంకేసుల డ్యాం వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. డ్యాం వద్ద కుంగిన మట్టి కరకట్టను పూడ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సుంకేసుల డ్యాం భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల అనుమతి కొరకు https://ganeshutsav.net/ లేదా 7995095800కు వాట్సాప్లో మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చామని https://ganeshutsav.net లింక్లో అనుమతులు పొందాలన్నారు.

జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేసినట్లు వివరించారు.

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్కు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సోమవారం సెలవులు ప్రకటించిన దృష్ట్యా పాఠశాలలు తెరవకుండా చూసే బాధ్యత ఎంఈఓలదేనని డీఈఓ సుభద్ర తెలిపారు. ఈ మేరకు ఆదివారం అన్ని మండలాల ఎంఈఓలకు ఆమె వాయిస్ మెసేజ్ సందేశాన్ని పంపారు. జిల్లాలోని పాఠశాలల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని నేడు గూగుల్ షీట్లో ఎంఈఓలు పంపాలని డీఈఓ సూచించారు.

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.

భీమవరంలో ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి మరణానికి కారణమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. భీమవరంలోని డిమార్ట్ వద్ద మెకానిక్ షెడ్డులో వరప్రసాద్, నాగరాజు మధ్య గొడవ జరిగింది. కోపంలో వరప్రసాద్ నాగరాజును చాక్తో పొడవగా.. నాగరాజు వరప్రసాద్ను రాడ్డుతో కొట్టాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగరాజు మృతి చెందగా.. వరప్రసాద్ను అక్కడి నుంచి ఏలూరు తరలించారు.

*ప్రకాశం: రేపు విద్యా సంస్థలకు సెలవు
*ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
*కంభంలో సముద్రం కప్పలు ప్రత్యక్షం
*దోర్నాల: ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చరియలు
*రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు
*యూరప్ నుంచి ప్రకాశం జిల్లాకు చేరిన మృతదేహం
*‘కనిగిరిలో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలు’
*దర్శి కమిషనర్ పనితీరుపై హర్షం
*కంభంలో బులెట్ బైక్ దొంగతనం

పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాటూరివారిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.