India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు ఇడుపులపాయలో YS జగన్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం పులివెందుల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తుకు పెంచారు. జల వనరుల శాఖ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి స్విచ్ ఆన్ చేసి హైట్ను పెంచారు. 2, 3 గేట్లకు సంబంధించి ప్యానల్ బోర్డులో సాంకేతిక లోపం అనే దానిని అధికారులు ఖండించారు. వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్ల ఆపరేషన్ చేపడతామని, ప్రస్తుతానికి అన్ని గేట్లు ఆపరేషన్ సక్రమంగా సాగుతుందన్నారు. ఈఈ మోహన్ దాస్ ఉన్నారు.

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.

జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వరద బాధితుడికి 25 కేజీల బియ్యం, కేజీ చక్కర, కేజీ నూనె, ఉల్లి, బంగాళదుంపలు అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూల్స్కు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046

కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు. సంబంధిత యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు RIO సైమన్ విక్టర్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల వద్దకు విద్యార్థులు వెళ్లరాదన్నారు. అలాగే ఎవరైనా కళాశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.