India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.
కడప జిల్లాలో ప్రమాదవశాత్తు షేక్షావలి (38) అనే డ్రైవర్ మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన షేక్షావలి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ మరమ్మతులు చేసుకుంటుండగా ఆదివారం లారీపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆదోని నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిచారు. 1952లో మెుదటిసారి జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థి హెచ్.రామలింగారెడ్డి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మల్లయ్యపై 5561 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1962లో సీతారామరెడ్డి(ఇండిపెండెంట్).. తిమ్మారెడ్డి(కాంగ్రెస్)పై 4770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.
బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలు కాగా కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స మార్కాపురం తరలించారు. గిద్దలూరు మండలంలో పెళ్లికి హాజరై తిరిగి మార్కాపురానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
కంకిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి విషయమై ముగ్గురు యువకులు ఘర్షణ పడినట్లు తెలిపారు. వణుకూరు, ఉయ్యూరు గ్రామాలకు చెందిన యువకులు బీరు బాటిళ్లతో జాతీయ రహదారి సమీపంలో దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
పదవ తరగతి పరీక్ష ఫలితాలను విజయవాడ వేదికగా సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 34 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను results.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని చెప్పారు.
ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఎస్.కోటలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఎస్.కోట చేరుకుని దేవీగుడి కూడలి వద్ద జరిగే సభలో పాల్గొంటారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా అటుగా వచ్చే వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు. ఇద్దరు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 500 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మంగళవారం సాయంత్రం తెనాలి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 7గంటలకు మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ప్రతి ఏటా సింహాచలం ఆలయంలో నిర్వహించే చందనోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి అన్నారు. వచ్చే నెల 10న నిర్వహించే చందనోత్సవం కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.