Andhra Pradesh

News March 27, 2024

కొల్లిపర: పురుగుమందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

కొల్లిపర మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తూములూరుకు  చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు ఆర్థిక సమస్యలతో మంగళవారం పురుగుమందు తాగారు. చంద్రశేఖర్ మృతి చెందగా, నాగలక్ష్మి చికిత్స పొందుతోంది. వీరిది దుగ్గిరాల మండలం ఈమని. డ్రైవరుగా పనిచేసే చంద్రశేఖర్‌ గతేడాది ప్రమాదం బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

 శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థులకు గాయాలు

image

బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామ సమీపన జరిగిన ఆటో ప్రమాదంలో సిద్దరాంపురం గ్రామానికి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం బుక్కపట్నంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తిరిగి సిద్దరాంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

News March 27, 2024

కర్నూలు: 3 నుంచి ఏప్రిల్ నెల పింఛన్లు

image

ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.

News March 27, 2024

తిరుపతి: TTDలో 78 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ/ ఓరియంటల్, జూనియర్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికగా లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగుస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ -49, జూనియర్ లెక్చరర్స్-29 మొత్తం …78 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 27.

News March 27, 2024

విజయవాడ: స్పా ముసుగులో వ్యభిచారం

image

స్పా ముసుగులో విజయవాడలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగాయి. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ సెలూన్‌పై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కలిగించారు. స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రత్నరాజ్ అన్నారు.

News March 27, 2024

నూతన ఓటర్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్

image

గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు, మార్పులు చేర్పులు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్తగా వచ్చిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సత్యసాయి జిల్లాకు కొత్తగా 1,34,364 ఎపిక్ కార్డులు వచ్చాయని, వీటిని ఆయా నియోజకవర్గాల వారీగా విభజన చేసి తపాలా శాఖ ద్వారా చిరునామాలకు పంపుతున్నామన్నారు.

News March 27, 2024

పాలకొండలో ఈసారి ఆమెకు పోటీ ఎవరు..?

image

పాలకొండ నియోజకవర్గంTDP-JSP టికెట్ ఎవరికీ కేటాయించకపోవడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా ఈ నియోజకవర్గం నుంచి విశ్వసరాయ కళావతి YCP తరఫున బరిలో ఉన్నారు. ఈమె వరుసగా 2014, 2019 ఎన్నికల్లో YCP నుంచి పోటీ చేసి రెండు సార్లూ కూడా TDP అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై విజయం సాధించారు. మరి ఈసారి కళావతికి పోటీగా కూటమి ఎవరిని బరిలో దింపనుంది..కామెంట్ చేయండి.

News March 27, 2024

ప.గో.: మాజీ మంత్రికి జనసేన రిక్వస్ట్

image

ప.గో. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు మంగళవారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో జనసేన విజయానికి ముందుండి పార్టీ శ్రేణులను నడిపించాలని ఆయనను పవన్ కోరారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కూలంకుశంగా చర్చించారు. 

News March 27, 2024

రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

image

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.

News March 27, 2024

రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

image

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.

error: Content is protected !!