India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగరాజు గుండెపోటుతో అదివారం మృతిచెందారు. చిలమత్తూరులో గుండెపోటుకు గురి కావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. విషయం తెలుసుకున్న సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.
కడప నగర పరిధిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆటవిడుపు కార్యక్రమంలో భాగంగా వైభవంగా నృత్య ప్రదర్శనను నిర్వహించినట్లు పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నగర పరిధిలోని ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆసక్తిగా తిలకించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా జానపద, కూచిపూడి, నాటక ప్రదర్శనలు యువత ప్రదర్శించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పార్లమెంటు స్థానాలను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులతో కమిషనర్ సూచనలతో APSSTF వారు సోషల్ స్టడీస్ సమ్మర్ యాక్టివిటీస్ పుస్తకాన్ని ప్రచురించారు. ఆదివారం విజయనగరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్, ఇతర సిబ్బందితో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అత్యంత ఆకర్షనీయంగా పుస్తకాన్ని రూపొందించారని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పీఓ, ఏపీఓలు ఏప్రిల్ 22వ తేదిలోపు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.
మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. చెక్పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా ఆయన ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు.
ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో మహిళ మేకలను మేతకు తోలుకు వెళుతుండగా, ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వాసు తెలిపారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ వాసు స్పష్టం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.