Andhra Pradesh

News August 28, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ కనిగిరిలో నవ వధువు ఆత్మహత్య
➤ మాగుంటను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు: సుప్రీం
➤ ముండ్లమూరులో ఆరు నెలలగా యువతిపై అత్యాచారం
➤ మార్కాపురం: కుర్చీలోనే కుప్పకూలి బ్యాంక్ మేనేజర్ మృతి
➤ చినగంజాంలో సందడి చేసిన సినీ తారలు
➤ రాచర్ల: గుండెపోటుతో విద్యార్థిని మృతి
➤ చీరాల: వైసీసీకి పోతుల సునీత రాజీనామా
➤ ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షం
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు కందుకూరు విద్యార్థి ఎంపిక

News August 28, 2024

శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ తర్వాతే సచివాలయ ఉద్యోగుల బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తరువాతే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి రిలీవింగ్ పత్రాలు ఇవ్వాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్‌లకు బుధవారం ఆశాఖ స్టేట్ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కీలకంగా ఉన్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ తరువాత బదిలీ అయిన వారిని ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ చేయాలని సూచించారు.

News August 28, 2024

నెల్లిమర్లలో బైక్ దొంగ ఇతనే..!

image

నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో బైక్ చోరీకి గురైంది. కళాశాలకు చెందిన వైద్య విద్యార్థి తన బైకును పార్కింగ్ చేసి క్లాస్ రూముకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ మాయమైంది. దీంతో సీసీ కెమెరా పరిశీలించగా.. పార్కింగ్ చేసిన కొద్ది సమయానికే గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని దొంగిలించినట్లు రికార్డైంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News August 28, 2024

జగన్ చీకటి పాలన నడిపారు: మాజీ మంత్రి ఉమా

image

కృష్ణా: గత ప్రభుత్వంలో రహస్య జీవోలతో జగన్ చీకటి పాలన నడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. అవినీతి, దోపిడీ, అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు మార్గాలు ఎంచుకున్న గత సర్కారు జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు. ప్రతి జీవో ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జీవోలకు చీకటి చెర వీడిందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News August 28, 2024

శ్రీకాకుళం: ఈ నెల 30న వన మహోత్సవం

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.

News August 28, 2024

VZM: ఈవీఎం రీవెరిఫికేషన్‌కు ఎంత కట్టారంటే?

image

ఈవీఎంల చెకింగ్, రీవెరిఫికేషన్‌కు నిబంధనల ప్రకారం నగదు చెల్లించారని విజయనగరం కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. గజపతినగరం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నెం.20లో రీవెరిఫికేషన్‌కు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నెం.9పోలింగ్ కేంద్రంలో EVM చెకింగ్‌, రీవెరిఫికేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ దరఖాస్తు చేశారు. ఈకమ్రంలో ఇద్దరూ కలిపి రూ.47,200 చెల్లించారని కలెక్టర్ చెప్పారు. 

News August 28, 2024

కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ క్యాంపస్‌ కళాశాలలోని ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను సెప్టెంబర్ 23 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలంది. వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 28, 2024

గుంటూరు: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ క్యాబినెట్

image

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ భర్తీకి క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖలో 2,771 కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

News August 28, 2024

పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి: కలెక్టర్

image

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి క్రైసెస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు పూర్తి భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఏవైనా ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కలిగించాలన్నారు.

News August 28, 2024

పల్నాడు: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

image

ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. హేలీప్యాడ్, ప్రధాన సభా స్థలాన్ని పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేలాగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.