India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ విధానంలో 8 కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ANU- ICET-2024 నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎంబీఏలో పలు రకాల కోర్సులు, ఎంసీఏ కోర్సులలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆ విభాగ సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మే 9లోగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరారు.
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాగా ఆయన ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పి.గన్నవరం అసెంబ్లీకి పోటీ చేశారు. 2014లో అమలాపురం అసెంబ్లీ, 2019లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో 1970 ఆగస్టులో జన్మించారు.
శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృంధాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హిరమండలంలోని దాసుపురం గ్రామానికి చెందిన సిద్ధమడుగుల శంకర్రావు (26) చవితి సీది వెళ్తుండగా కోడూరు దగ్గరలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయినట్లు హిరమండలం పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో అతని ముఖం రోడ్డును బలంగా తాకి తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హిరమండలం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.4,60,880ల విలువ గల 6584 గ్రాముల వెండి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 21 వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,31,26,840ల నగదు, మద్యం జప్తు చేశామన్నారు.
ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా TDP తొలుత సిట్టింగ్ MLA మంతెన రామరాజు పేరును ఖరారు చేసి, తర్వాత ఆ స్థానం నుంచి రఘురామకృష్ణను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..ఈ రోజు కాళ్ళ మండలం జక్కరంలో కూటమి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారిద్దరూ ఒకేవేదికను పంచుకొన్నారు. ఈ సందర్భంగా నవ్వులు చిందిస్తూ ముచ్చటించిన ఓ ఫొటో వైరల్గా మారింది. సమన్వయంతో పనిచేసి గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియమితులయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికే చెందిన పుట్టం బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.
అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.