India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సుమారు 70 సంవత్సరాలు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు సంగడిగుంట లాంచర్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీసులకు తెలియజేయాలని అన్నారు.
కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో ఆదివారం లారీ బోల్తాపి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపేటకు చెందిన పెద్దరెడ్డి రాజు చొప్పెల్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద మట్టితో ఉన్న లారీ అన్లోడింగ్ చేయడానికి వాహనాన్ని వెనుక వైపు కదిలించగా ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. దీంతో రాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు.
వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, మట్టి కలర్ చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. యువకుడి వివరాలు తెలిస్తే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.
జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథిపై ఆదివారం కేసు నమోదైందని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఆ సమయంలో ఐదుగురికి బదులు 8 మంది వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, సూరం భాస్కర్ రెడ్డి, మరో నలుగురిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు ఉన్నారు. హెలిప్యాడ్, రోడ్ షో నిర్వహించే ప్రాంతాన్ని సిబ్బందితో పరిశీలించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను ఆదివారం ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హీరో సుమన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్ అసిఫ్, ఎంఎస్ మొహమ్మద్, ఎంఎస్ దస్తగిరి, రహీద్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.