India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నుంచి మూలె సుధీర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే నియోజకవర్గంలో 2,41,642 ఓట్లు ఉన్నాయి. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 79,462 మంది ఉంటే బీసీ – 42,370, రెడ్డి – 40,590, ముస్లిం ఓటర్లు 38,223 మంది ఉన్నారు. జమ్మలమడుగులో కీలకంగా ఉన్న ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశిస్తాయి.
నరసాపురంతో తనకు చాలా మంచి జ్ణాపకాలు ఉన్నాయని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్తుండగా నరసాపురం బస్టాండ్లో ఆగినప్పుడు తప్పిపోయాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను దుకాణంలో కూర్చొబెట్టి నాన్న వచ్చాక వెయిట్ చేసి అప్పజెప్పారంటూ గుర్తుచేసుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
అద్దంకి పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అద్దంకి పట్టణంలో సత్యనారాయణ కళామందిరం దగ్గరికి వచ్చేసరికి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సందర్భంలో ట్రావెల్స్ బస్సు ఆగకుండా వెళ్లి గోపాలపురం దగ్గర మరొక ట్యాలీ వ్యాన్ను ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ-విజిల్ ద్వారా 634 ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఓటర్ హెల్ప్లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ తదితర మార్గాల ద్వారా మొత్తం 1, 635 ఫిర్యాదులు రాగా 1, 609 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
మాడుగుల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు బీ-ఫారమ్ అందజేసిన సంగతి తెలిసిందే. ఏడుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. నాలుగు సార్లు గెలిచారు. 1989, 1994 ,1999, 2004లో పరవాడ నుంచి పోటీ చేసి.. మూడుసార్లు గెలుపొందగా 2004లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009, 2014, 2019లో పెందుర్తి నుంచి పోటీచేయగా.. 2014లో గెలిచారు. 1997-98లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వడ్డెర సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలో మాట్లాడుతూ.. ఎన్నికలలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాయమాటలు చెప్పి చివరిలో మోసం చేశారని అన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర్ల సత్తా చూపిస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.
శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సున్నిపెంటకు చెందిన ఇద్దరు ముస్లిం మైనార్టీ నాయకులను ఆయా పార్టీలు ఎంపిక చేశాయి. ఇప్పటికే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎస్ఎం సికిందర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఎస్ ఇస్మాయిల్ త్వరలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇరువురూ నియోజకవర్గ పరిధిలో గుర్తింపు గల వ్యక్తులు కావడం, స్థానికంగా అందరితో పరిచయాలు ఉండటం విశేషం.
విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.