India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తడ తహశీల్దార్ కార్యాలయం మరియు స్ట్రాంగ్ రూంను తిరుపతి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అలాగే సూళ్లూరు పేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఏ గ్రామంలో అయినా తాగునీటి సమస్య ఉంటే అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రకటించారు. ఏ గ్రామంలోనైనా తాగునీటితో ఇబ్బందులు పడుతుంటే ప్రజలు 91001 21605 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
బి.ఫాం తీసుకోవడానికి మదనపల్లెకి వచ్చిన చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మొక్కి బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమం మదనపల్లెలో ఆదివారం ఎన్నికల ప్రచారసభ మిషన్ కాంపౌండ్లో జరిగింది. అందరూ కష్టపడి గెలవాలని పెద్ది రెడ్డి సూచించారు.
ఈ ఏడాది గుంటూరు జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రతి మంగళ, గురు వారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు శనివారం తెలిపారు. ఈ యాత్రకు వెళ్లేందుకు 13 నుంచి 75 ఏళ్లలోపు వయస్సు వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటివరకు 25 మంది CEOలుగా పనిచేశారు. అందులో ఇప్పటివరకు ఒక్క మహిళకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. ఆమె ఎవరో కాదు.. మన ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన వీఎస్. రమాదేవి. HYDలో చదువుకున్న ఆమె సివిల్ సర్వీసెస్కు ఎంపికైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లోనూ పనిచేశారు.1990 నవంబర్ 26న CEOగా బాధ్యతలు చేపట్టిన ఆమె అదే ఏడాది డిసెంబర్ 11 వరకు 16 రోజుల పాటు పదవిలో ఉన్నారు.
రాష్ట్రంలో మోడీకి అనుకూలంగా ఉన్న టీడీపీ, వైసీపీలను ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలులోని చౌక్ వద్ద ఏపీ న్యాయ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చేది కాంగ్రెస్సే అని అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీఫాంలు అందజేశారు. మదనపల్లెలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో భరత్(కుప్పం), వెంకటే గౌడ(పలమనేరు), డాక్టర్ సునీల్(పూతలపట్టు), రెడ్డెప్ప(చిత్తూరు ఎంపీ) వీటిని అందుకున్నారు. అందరూ కష్టపడి పనిచేసి గెలవాలని పెద్దిరెడ్డి సూచించారు.
బీజేపీ – జనసేన జిల్లా సమన్వయకర్త శ్రీకాంత్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు వైసీపీలో చేరారు. నెల్లూరు రామ్మూర్తినగర్ లోని వీఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పోస్టల్ బ్యాలట్ హెల్ప్ డెస్క్
1.నరసరావుపేట-14 సామ్రాజ్యం, శ్రావ్య 6281073020, 9490309630
2 పెదకూరపాడు-85 నహ్మతుల్లా, టైపిస్ట్ 6300909696
3 చిలకలూరిపేట-96 వరప్రసాద్, MRO 9949096532
4 నరసరావుపేట-97 వి శ్రీనివాసరావు, ఏఓ 9985744342
5 సత్తెనపల్లి-98 లక్ష్మీ నర్సింహ, MRO 9949098622
6 వినుకొండ-99 నాగరాజు, DT 6300823885
7 గురజాల-100 రామాంజనేయులు, SA 8247055270
8 మాచర్ల-101 K చంద్రశేఖర్, MRO 7032929348
రొళ్ల మండల రంగాపురం క్రాస్ అలుపునపల్లి సమీపంలో బైక్లో ఇద్దరు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక ప్రాంతం మధుగిరి తాలూకాకు చెందిన వారికిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.