India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఐడీపీ 2024-29 పాలసీకి సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కనిగిరి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ.8,50,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు, ఎస్పీతో తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

నంద్యాలలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 150 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు అర్జీల రూపంలో విన్నవించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు.

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్ను అభినందించారు.

ఈనెల 25న ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాష, జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు వీరకళ్యాణ్ రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 బాలబాలికలకు ఏ, బీ, సీ విభాగాల్లో పరుగు, లాంగ్ జంప్, హై జంప్, బ్యాక్ త్రో, కిడ్స్ జావలిన్ త్రో, షాట్ పుట్ పోటీలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్ను అభినందించారు.

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

గత కొన్ని రోజులుగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఆందోళన చేస్తున్న విషయం విధితమే. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా హైందవి సోదరుడు రూపాంక్ ఆందోళన చేస్తున్న తన సోదరి హైందవి వద్దకు వచ్చి రాఖీ కట్టించుకొని ఆశీస్సులు తీసుకున్నాడు. తన తండ్రితో విభేదాల మధ్య రాఖీ వేడుకలు నిర్వహించుకున్నారు.
.

విశాఖ పోర్టు స్టేడియంలో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 05వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ ర్యాలీ విజయవంతం అయ్యేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దస్త్రాలను ధగ్ధం చేసినా, పాడుచేసినా సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.