India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బైక్ అదుపు తప్పి వంతెన డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. బొబ్బిలిలోని స్వామివారి వీధికి చెందిన జగదీశ్వరరావు (30) ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా ఫ్లైఓవర్పై బైక్ అదుపుతప్పి వంతెన డివైడర్ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగదీశ్కు ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో మే 13, 14వ తేదీల్లో జరిగిన అల్లర్లపై సిట్ ఎన్నికల సంఘానికి ఈనెల 1న తుది నివేదిక అందజేసింది. అల్లర్లపై మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్, జూనియర్ కళాశాల మైదానం, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద జరిగిన దాడులు, ఏయే కేసుల్లో ఎంత మందిని నిందితులుగా గుర్తించారు? లాంటి వివరాలతో మొత్తం 370 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం సిల్వర్ సెట్-2024 నిర్వహిస్తున్నట్లు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీవీఆర్ సాయి గోపాల్ తెలిపారు. పరీక్ష గడువు జూన్ 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. పరీక్ష జులై 7వ తేదీ ఆన్లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు.

ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కూటమి తరఫున 31 ఆర్టిసీ ఎక్స్ప్రెస్, 9 ఆల్ట్రా డీలక్స్ కలిపి మొత్తం 40 బస్సులు జిల్లా నుంచి గన్నవరంకి వెళ్లనున్నాయి. ఈ బస్సులు మంగళవారం రాత్రి బయలుదేరి బుధవారం ఉదయానికి చేరుకుంటాయి.

ప్రస్తుతం జిల్లాలోని కీలక స్థానాలో ఉన్న అధికారుల్లో ఎక్కువ మంది మూడేళ్లకు పైగా కొనసాగుతున్నారు. వీరిలో పాటు, వైసీపీ మంత్రులు, MLAల సిఫార్సులతో వచ్చినవారు ఉన్నారు. TDP అధికారంలోకి రావడంతో రాష్ట్రస్థాయిలో కీలక స్థానాల్లో అధికారుల మార్పు మొదలైంది. తొలుత కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డీఆర్వో ఉంటనున్నట్లు తెలుస్తోంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి, జిల్లా మత్య్సశాఖ అధికారి పేర్లు వినిపిస్తున్నాయి.

మద్యం మత్తులో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న <<13412715>>వివాదమే<<>> దారుణ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. ఊర్వశి జంక్షన్ నలంద నగర్లో స్నేహితుడి పుట్టినరోజు అని హేమంత్ కుమార్, సాయికిరణ్, అభిషేక్, హరీశ్, ఉదయ్ కలిసి బయటికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో హేమంత్ ఉదయ్ మెడపై కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

ఈనెల 12న విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు చొప్పున 32 బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు 17 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అనంతపురంలోని స్థానిక ఏరా ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 16న ఉదయం 9 గంటలకు జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ తెలిపారు. అండర్-10, 13, 15 విభాగాల్లో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న జిల్లా క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికైన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.