India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు డిగ్రీ 5వ సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని యూనివర్సిటీ ఉపకులపతి విజయ భాస్కర్ రావు తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పరీక్షలకు హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. అర్ధగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు వెళ్లాలని తెలిపారు.

విశాఖ జడ్పీ భవనంలో ఈనెల 24వ తేదీన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఈవో ఎం.పోలినాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

కొందరు తన పేరిట సందేశాలు పంపిస్తున్నారని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులతో పాటు ఇతరులకు సందేశాలు పంపిస్తున్నారని వివరించారు. ఆ ఫోన్ నంబర్ (94785566071) తనది కాదని, వారు పంపే సందేశాలకు రెస్పాండ్ కావద్దని సూచించారు. కాల్స్ కూడా స్వీకరించొద్దంటూ కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని MLA వరదరాజుల రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. లంచగొండి అధికారులు సెలవుపై వెళ్లాలన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రిజిస్ట్రేషన్కు వచ్చిన వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాల ద్వారా వచ్చిన సొమ్మును రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ద్వారకాతిరుమలలో నాయీ బ్రాహ్మణులకు కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించడంలో జాప్యంపై MRO సుబ్బరావును ఏలూరు ఎంపీ ఆరా తీశారు. స్థలం కేటాయించమని ఆదేశించి 20 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. త్వరగా స్థలం కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

వైఎస్ జగన్ కేసీఆర్తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత జగన్కు లేదు, వెలిగొండపై గెజిట్ నోటిఫికేషన్ రాకుండా జగనే ఆపారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో కేంద్రమంత్రిని కలిశామన్నారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అధోగతి చేశారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు.

అల్లవరం మండలం రెల్లుగడ్డ శివారులోని ఎలువుల్లంకకు చెందిన నాగేశ్వరరావు తన భార్య లక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల కింద వీరికి నాగేశ్వరరావుతో లక్ష్మికి వివాహమైంది. 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా కొడుకు, కూతురుతో అమలాపురంలో ఉంటుంది. ఇటీవలే కొడుకు పెళ్లి జరిగింది. ఆదివారం స్వగ్రామంలో రిసెప్షన్ జరిగింది. అక్కడి నుంచి వెళ్తుండగా దాడి చేశాడు.

వైఎస్ జగన్ కేసీఆర్తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత జగన్కు లేదు, వెలిగొండపై గెజిట్ నోటిఫికేషన్ రాకుండా జగనే ఆపారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో కేంద్రమంత్రిని కలిశామన్నారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అధోగతి చేశారని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని పేర్కొన్నారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై మాజీ MLA ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ MLA కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. కక్షసాధింపు చర్యలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు<<13894976>> ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. SI రఘునాథరావు వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన నానాజీ (25), సాయిప్రసన్న(22) ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. నానాజీ తల్లిదండ్రులతో కలిసి స్థానిక టవర్ కాలనీలో ఉంటూనే, జగనన్న కాలనీలో సాయిప్రసన్నతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉరేసుకొని చనిపోయారు. కేసు నమోదుచేసి, విచారణ చేస్తున్నామని SI తెలిపారు.
Sorry, no posts matched your criteria.