Andhra Pradesh

News March 26, 2024

పాలకొల్లులో బీజేపీ నేత కారు ధ్వంసం

image

ఇంటి ఆవరణలో పార్కింగ్‌ చేసిన తన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పాలకొల్లుకు చెందిన బీజేపీ నాయకుడు రావూరి సుధ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కారు పార్కింగ్‌ చేశామన్నారు. మరుసటిరోజు ఉదయం చూసేసరికి వెనుక భాగంలో అద్దం పూర్తిగా ధ్వంసమై ఉందన్నారు. పార్కింగ్‌ స్థలంలో వరుసగా కార్లు ఉన్నా తన కారునే టార్గెట్‌ చేసి ధ్వంసం చేశారన్నారు.

News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

News March 26, 2024

విశాఖ: వన్యప్రాణుల వరుస మరణాలతో గుబులు

image

విశాఖ జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణుల మృత్యువాత ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చనిపోతుండడం జూలో కలకలం రేపుతోంది. కార్డియో పల్మనరీ వ్యవస్థ విఫలమవ్వడంతో తాజాగా జిరాఫీ మృతి చెందింది. గత నెలలో ఆడ చింపాంజీతో కలుపుకొని కొద్ది నెలల్లోనే ఎనిమిది వరకు చనిపోయాయి. వరుసగా చోటుచేసుకుంటున్న వీటిని చూస్తుంటే జంతువుల సంరక్షణపై అనుమానం కలుగుతోంది. నిజంగా వాటి మృతికి వయసు మీరడమే కారణమా అన్నది సందేహంగా మారింది.

News March 26, 2024

గుంటూరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

సరుకు రవాణాలో గుంటూరు రైల్వే డివిజన్ రికార్డు సృష్టించింది. 2013-14లో ఉన్న అత్యధిక లోడింగ్ 3.127 మిలియన్ టన్నులను సోమవారం అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. 2003లో డివిజన్ ప్రారంభించిన తర్వాత తొలిసారి గరిష్ఠ స్థాయి రికార్డ్ నమోదు చేసుకుంది. దీంతో అధికారులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే అధికారి రామకృష్ణ ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నారు.

News March 26, 2024

వైసీపీకి 10 సీట్లకు మించి రావు: బైరెడ్డి

image

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 10 అసెంబ్లీ సీట్లకు మించి రావని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని తెదేపా కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, మన రాష్ట్రంలో అంతకంటే ఎన్నో రెట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు.

News March 26, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ పై కేసు నమోదు

image

కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో సోమవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామానికి చెందిన వాలంటీరు పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా భావిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఎంపీడీవో రామాంజనేయులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2024

వీరపనేనిగూడెం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

image

గన్నవరం మండలంలో వీరపనేని గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిగా, 18 మందికి గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి కూలీలు తీసుకొస్తున్న ఆటో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

News March 26, 2024

రూ.150 కోసం వెంటపడితే.. ప్రాణాలు పోయాయి!

image

ఏలూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెదవేగి మండలం వేగివాడ సెంటర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన హోటల్‌కు సోమవారం కొందరు వచ్చి టిఫిన్ చేశారు. బిల్ మొత్తం రూ.150 కాగా.. వారు రూ.15 ఫోన్ పేలో చెల్లించి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ బైక్‌పై సోదరి, కుమార్తెతో వారివెంటే వెళ్లారు. తిరిగి వస్తుండగా చక్రాయగూడెం సమీపంలో కారు ఢీకొని సత్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు.

News March 26, 2024

చీరాల : వివాహిత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

చీరాల మండలం కీర్తి వారిపాలెంలో స్థల వివాదం కారణంగా చోటు చేసుకున్న ఎలికా జ్యోతి అనే వివాహిత హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. మృతురాలి మరణ వాంగ్మూలం, బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసేమన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను చీరాల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News March 26, 2024

మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్: ముద్రగడ

image

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

error: Content is protected !!