Andhra Pradesh

News April 21, 2024

చేవెళ్ల పుష్కరిణిలో ప్రకాశం జిల్లా వాసి గల్లంతు

image

జిల్లాకు చెందిన రవి(38), శ్రీనివాస్, రాజులు తెలంగాణ రాష్ట్రంలో బేల్దారి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చేవెళ్లలో ఉన్న లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పుష్కరిణిలో ఈతకు దిగారు. రవి పుష్కరిణి లోపలికి వెళ్లగా, శ్రీనివాస్ ఒడ్డున మునిగి బయటకు రాగా, రాజు నీటిలోకి దిగలేదు. ఎంతసేపటికీ రవి బయటకు రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా రవి ఆచూకీ తెలియలేదు.

News April 21, 2024

ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

image

ఆదోని మండలంలోని మధిర క్రాస్ నుంచి ఎల్ఎల్‌సీ కెనాల్ మధ్య ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News April 21, 2024

ఒంటిమిట్ట: కళ్యాణం రోజున 15 చోట్ల వాహనాల పార్కింగ్

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని వాహనాల పార్కింగ్‌కు 15 ప్రదేశాలను గుర్తించినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కళ్యాణ వేదిక సమీపం నుంచి కడప మార్గంలో పది చోట్ల, సాలాబాద్ సమీపంలో 5 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

News April 21, 2024

ఎమ్మెస్ రాజుకు మడకశిర టీడీపీ బీఫామ్

image

సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఈ మేరకు బీఫామ్ ఆయన చేతికి ఆదివారం అందించినట్లు మడకశిర టీడీపీ నాయకులు తెలిపారు. ఇంతకు ముందు డాక్టర్ సునీల్ కుమార్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. మార్పులు చేర్పుల్లో భాగంగా మడకశిర టికెట్‌ను ఎమ్మెస్ రాజుకు కేటాయించారు.

News April 21, 2024

రేపు నామినేషన్ వేయనున్న రఘురామకృష్ణరాజు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరు రఘురామకృష్ణరాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెదమిరం గ్రామంలోని ఆయన స్వగృహం నుంచి ఉండి ఎమ్మార్వో ఆఫీస్, ఎన్నికల అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

రాజోలు జనసేన అభ్యర్థికి సెకండ్ హ్యాండ్ కారు

image

☞ విద్యార్హతలు: MSC(బోటనీ), రిటైర్ట్ IAS
☞ కేసులు: లేవు
☞ చరాస్తులు: నగదు రూ.10,50,000. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.2,21,04,207. సెకండ్ హ్యాండ్ క్రీటా కారు (రూ.15 లక్షలు).
☞ బంగారం: భార్య పేరున 550గ్రా గోల్డ్ (రూ.2,49,64,207).
☞ స్థిరాస్తి: దిండిలో 50 సెంట్ల వ్యవసాయ భూమి, అమరావతి సమీప ఐనవోలులో 4,500చ. అడుగుల వ్యవసాయేతర భూమి. HYDలో 275చ. గజాల స్థలంలో 4000చ. అడుగుల్లో భవనం.
☞ అప్పులు: రూ.10,65,943.

News April 21, 2024

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: మాచర్ల
➤ అభ్యర్థి: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(YCP)
➤ భార్య: రమాదేవి
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.2.87 కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.4.36కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 100 గ్రాములు, భార్యకు 300 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

ఒంటిమిట్ట: 22న ట్రాఫిక్ ఆంక్షలు

image

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న జరగనున్న కళ్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కడప పట్టణం, ఒంటిమిట్ట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు ఇర్కాన్ సర్కిల్, ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లాలని, తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు రావాలన్నారు.  

News April 21, 2024

విజయవాడలో నవ వరుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో నవ వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబర్ 24లో మేరీ గ్రేసీ, వెంకట్ నివాసం ఉంటున్నారు. నెల రోజుల కిందటే గ్రేసీ, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 21, 2024

SKLM: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

మెలియాపుట్టికి చెందిన ఆర్ జగదీశ్వరరావు అనే యువకుడు ఆదివారం ఉదయం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న అతని ఉదయం మెడ భాగంలో కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో శ్రీకాకుళం తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.