Andhra Pradesh

News June 11, 2024

రాజాం: ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య

image

జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. రాజాం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి(17) చదువు కోసం తల్లిదండ్రులు విశాఖపట్నం నివాసం మార్చారు. బాలుడు అక్కడున్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివాడు.అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు సాధించాడు. అడ్వాన్స్డ్ రాసినా ఐఐటీలో సీటు రాకపోవడంతో ఎంవీపీ కాలనీలో ఉన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

VZM: ఈ రోడ్లపై జర జాగ్రత్త!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జాతీయ రాహదారులపై ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 5 నెలల్లో 370 ప్రమాదాలు జరగాయి. వీటిలో 120 మంది మృతిచెందగా, 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. NH-16 భోగాపురం, పూసపాటిరేగ మీదుగా వెళ్లే రహదారి, NH-26 సాలూరు మీదుగా రాయ్‌పూర్ వెళ్లే మార్గాలలో యాక్సిడెంట్‌లు ఎక్కువుగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకోవడం, భారీ వాహనాలు రోడ్లపై నిలపడమే ప్రధానకారణాలు.

News June 11, 2024

కర్నూలు: పదవులపై తీవ్ర ఉత్కంఠ.. మంత్రి యోగం ఎవరికో..?

image

కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కోట్ల జయప్రకాశ్‌ రెడ్డి సీనియర్‌ నేతగా గుర్తింపు పొందగా.. బీసీ జనార్దన్‌రెడ్డి అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆర్యవైశ్య కోటాలో టీజీ భరత్‌ పేరు వినిపిస్తోంది. ఎమ్మెల్సీల కోటాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు పేరూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.

News June 11, 2024

పెనుగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. పోడూరు మండలం జిన్నూరుకు చెందిన వెంకటపతి(75) కత్తి పీటల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం వ్యాపారం నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. పెరవలి నుంచి రావుపాలెం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్‌లో తణుకు ఆసుపత్రికి తరలించగా వెంకటపతి అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

నెల్లూరు: టపాసుల గోడౌన్లో అగ్ని ప్రమాదం.. బాలుడు మృతి

image

బోగోలు మండలం బిట్రగుంటలో టపాసుల గోడౌన్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులో ఉన్న బాలుడు సురేశ్ రైనా(13) ప్రాణాలు కోల్పోగా.. గౌడౌన్ యజమాని సుమంత్‌‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. బాలుడు కప్పరాళ్ల తిప్ప గ్రామానికి చెందినవాడు. గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బాలుడికి, గోదాము యజమానికి గాయాలు కాగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి.

News June 11, 2024

దారుణం.. బాలికపై 46ఏళ్ల వ్యక్తి అత్యాచారం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం 12ఏళ్ల బాలికపై 46ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బాలికకు తండ్రి లేడని, తల్లి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లగా అమ్మమ్మ వద్ద ఉంటుందన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ ప్రశాంత్, ఎస్సై రాజేష్ గ్రామానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

విశాఖ: సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

image

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా <<13417280>>ప్రమాణ స్వీకారం<<>> చేసే కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీన ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ జిల్లా ప్రజలు వీక్షించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుర్తించిన ఏడు కేంద్రాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News June 11, 2024

ప్రకాశం: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

image

అదుపుతప్పి కారు ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడింది. ఈ సంఘటన జాతీయరహదారిపై ఉలవపాడు దక్షిణ బైపాస్ సమీపంలో సోమవారం జరిగింది. ఒంగోలు సుజాతనగర్ చెందిన కామేష్ తన భార్యతో కలసి ఒంగోలు నుంచి కావలి వెళుతున్నారు. ఉలవపాడు వద్దకు వచ్చేసరికి మలుపు వద్ద ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడిపోయింది. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 11, 2024

కడప: టీటీడీ బోర్డు పదవికి మా సీమ బాబు రాజీనామా

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఆర్ వెంకట సుబ్బారెడ్డి (మాసీమ బాబు) ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే రాజీనామా చేసిన నేపథ్యంలో పాలకమండలి సభ్యులైన మాసీమ బాబు కూడా రాజీనామా చేశారు.

News June 11, 2024

బండారు శ్రావణి శ్రీకి మంత్రి పదవి ఇవ్వాలి: ఫక్రుద్దీన్ వలి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జనచైతన్య నగర్ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అప్పుడే శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు