Andhra Pradesh

News March 26, 2024

VZM: మద్యం అక్రమరవాణా కేసుల నమోదు

image

జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమరవాణాపై పోలీసులు సోమ వారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులపై 16 కేసులు నమోదుచేసి 60.3 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై 32 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు, కోడిపందాలు, పేకాట ఆడుతున్న వారిపై మూడుకేసులు నమోదుచేసి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

News March 26, 2024

తిరుపతి: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అలసిపోయిన తల్లి గుడిసెలో నిద్రిస్తుండగా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు అనే యువకుడు చిన్నారిని పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతలో తల్లి నిద్ర లేచి గుడిసెలోకి వెళ్లి చూడగా నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 26, 2024

శ్రీకాకుళం: నేడు రాజశ్యామల హోమం

image

సీఎం జగన్ చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సురిబాబు తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యాగంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News March 26, 2024

పార్వతీపురం ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు

image

పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. ఈనెల 21న ఎలాంటి అనుమతులు లేకుండా పార్వతీపురం పట్టణం కొత్తవలసలో ఉ.8గంటలకు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అనంతరం పార్వతీపురం పట్టణ పోలీసులు జోగారావుపై కేసు నమోదు చేశారు. కాగా.. బొబ్బిలి ఎమ్మెల్యేపై కూడా ఇటీవల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది.

News March 26, 2024

అప్పన్నకు పెళ్లి కుదిరింది.. వచ్చే నెల 9న పెళ్లిరాట

image

సింహాచలంలో అప్పన్న స్వామి డోలోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్వామివారికి పిల్లని ఇవ్వాలంటూ సోదరి పైడితల్లమ్మ అమ్మవారిని అర్ధించే తంతు పూర్తిచేశారు. ఈ విధానాన్ని స్వామివారి పెళ్లిచూపులు(డోలోత్సవం) అంటారు. అనంతరం వారికి పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉగాది రోజు పెండ్లిరాట, 19వ తేదీన చైత్ర ఏకాదశిన పురస్కరించుకొని వార్షిక కల్యాణోత్సవానికి స్వామివారు సిద్ధమవుతున్నారు.

News March 26, 2024

కోటబొమ్మాళి: చేపల వ్యాను బోల్తా

image

జాతీయ రహదారిపై కొత్తపేట కూడలి వద్ద ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంవైపు చేపలలోడుతో వెళ్తున్న వ్యాను టైరుపంక్చర్ కావడంతో సోమవారం బోల్తా పడింది. ఆక్సిజన్ సిలెండర్లు, నీటి ట్యాంకులు చెల్లాచెదురుకావడంతో చేపలు రహదారి పక్కన పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. వాహనంలో డ్రైవర్‌, మరోవ్యక్తి గాయాలు కాలేదు.

News March 26, 2024

ఆస్పరి: చేతి గుర్తు రక్తపు మరకలు

image

ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌‌తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.

News March 26, 2024

చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 26, 2024

నేటి నుంచి నావికా దళ విన్యాసాలు

image

నేటి నుంచి కాకినాడ సాగరతీరంలో భారత్‌- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలో నిర్వహించనున్న టైగర్‌ ట్రంప్‌ విన్యాసాల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ పరిధిలో ఆరు రోజుల పాటు నేవీ, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తాయన్నారు.

News March 26, 2024

‘కోడ్’.. ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌-మోనిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. పెయిడ్‌ న్యూస్‌, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు.

error: Content is protected !!