India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
YCP బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, పుత్తూరు మాజీ MPP ఏలుమలై అలియాస్ అమ్ములు TDPలో చేరారు. ఆయనతో పాటు DCCB మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి, బిల్డర్ వెంకటమునికి నగరి MLA అభ్యర్థి గాలి భానుప్రకాశ్ సమక్షంలో చంద్రబాబు పసుపు కండువా కప్పారు. నగరి నియోజకవర్గంలో మొదలియార్ సామాజికవర్గ ఓటర్లు 32 వేల మంది ఉన్నారు. అదే సామాజికవర్గానికి చెందిన ఏలుమలై YCPని వీడటం ఆ పార్టీకి నష్టమేనని పలువురు భావిస్తున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ కోదండ రామస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడసేవ జరుగుతుంది.
అనంతపురం జిల్లాలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. యాడికిలో అత్యధికంగా 40.4 డిగ్రీలు, శింగనమలలో 39.5, నంబులపూలకుంట 39.4, ధర్మ వరం 38.7, కదిరి 38.5, తాడిపత్రి 38.4, అనంతపురం 38, యల్ల నూరు 37.9, తనకల్లు 37.7, కనగానపల్లి, గాండ్లపెంట 37.5, రాప్తాడు 37. 4, పుట్లూరు 37. 3 డిగ్రీలుగా నమోదైందన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి ధవళేశ్వరంలోని బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ ఎ.వాణి తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో 351 ఖాళీలు ఉన్నాయన్నారు. SC-220, BC-31, BC-67, ST-23, OC-10 సీట్లు ఉన్నాయని, ఆయా కేటగిరీలకు చెందినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
➤ నియోజకవర్గం: నరసరావుపేట
➤ అభ్యర్థి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (YCP)
➤ భార్య: సుస్మిత రెడ్డి
➤ విద్యార్హతలు: MS(Ortho)
➤ చరాస్తి విలువ: రూ.1.14 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.1.44కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.3.24కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.15 లక్షలు
➤ బంగారం: రూ.19లక్షలు విలువైన, భార్యకు రూ.58లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, లోయర్, హయ్యర్ గ్రేడ్ టైపింగ్ తదితర టెక్నికల్ కోర్సుల పరీక్షలను సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు నెల్లూరు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. హాల్ టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి హాల్టికెట్తో పాటు ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆర్ధో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న రాజేష్పై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒక స్థలానికి సంబంధించి చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో అతడు శ్రీకాకుళం వెళ్తున్న నేపథ్యంలో కారు ఆపి అద్దం ధ్వంసం చేశారు. కారులో ఉన్న వైద్యుడిని కిందకి దింపి గొడవ చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కబేళాకు సెలవని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊర్వశి జంక్షన్ జాతీయ రహదారి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. సీఐ భాస్కరరావు నేతృత్వంలో ఏఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లికి చెందిన ఆకుల వీరప్ప పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో వీరప్ప మర్రిచెట్టు కిందకి వెళ్ళాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో వీరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.