Andhra Pradesh

News March 25, 2024

గుంటూరు: రైలు కింద పడి యువకుడి మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతిచెందిన ఘటనపై సోమవారం గుంటూరు GRP పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంబూరు నుంచి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉందని సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ వెళ్లి పరిశీలించారు. యువకుడి పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వాళ్లు GRP పోలీసులను సంప్రదించాలన్నారు.

News March 25, 2024

నేడు విజయవాడ రానున్న “ఓం భీం బుష్” మూవీ టీం

image

“ఓం భీం బుష్” మూవీ టీం నేడు విజయవాడ రానుంది. ఈ మేరకు ఆ సినిమా ప్రొడక్షన్ బృందం తాజాగా ట్వీట్ చేసింది. “ఓం భీం బుష్” చిత్రం విజయవంతమైనందున చిత్రబృందం తలపెట్టిన వీర విజయ యాత్రలో భాగంగా.. ఈ రోజు రాత్రి 11.15 గంటలకు విజయవాడ శైలజ థియేటర్‌కు ఆ చిత్ర తారాగణం వస్తారని “ఓం భీం బుష్” సినిమా ప్రొడక్షన్ విభాగం తెలిపింది.

News March 25, 2024

బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు 

image

బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.

News March 25, 2024

కడప: బీజేపీలో చేరిన టీడీపీ నేత బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు టీడీపీ నేత బొజ్జ రోషన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరఫున బద్వేలు ఎమ్మెల్యే సీటును ఆశించడంతో ఆ సీటును కూటమి కుదుపులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో రోషన్న తన అనుచరులతో చర్చించి ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News March 25, 2024

ఐటీ శిక్షణ ఇప్పిస్తానని.. అఘాయిత్యం

image

కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత హైదరాబాద్ KPHPపరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌‌లో సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ శిక్షణలో చేరింది. శిక్షకుడు నరేంద్రకుమార్ ధ్రువపత్రాల తనిఖీ కోసం ఆమెను పిలిచి శారీరకంగా లోబరచుకున్నాడు. విషయాన్నిఆ మహిళ శిక్షణ తరగతుల సహచరుడు కృష్ణా జిల్లా వాసి సంతోష్‌‌కి తెలపడంతో అతను ఆమెను వేధింపసాగాడు. అది తట్టుకోలేక మహిళ నిద్రమాత్రలు మింగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

News March 25, 2024

కోటవాని చెరువులో యువకుడి డెడ్‌బాడీ

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని కోటవాని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందిన సాయి రమేష్ కొంతకాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

News March 25, 2024

పాలకొండ: కట్టె జనుము సాగుతో రైతులకు అపార నష్టం

image

కట్టె జనము సాగుతో రైతులకు అపారనష్టం వాటిలిందని పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు సోమవారం తెలిపారు. సుమారు 50 శాతం మంది రైతులు అపరాల పంటలకు బదులుగా కట్టె జనుము సాగు చేశారని అన్నారు. గొంగళి పురుగు ఆశించడంతో కాయలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన అనంతరం రైతులకు సలహాలు సూచనలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల నుంచి దూరమయ్యాయని వాపోయారు.

News March 25, 2024

‘సువిధ’ యాప్‌లో అనుమతులు పొందండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రకాల పర్మిషన్ల కోసం సువిధ ఆన్‌లైన్ పోర్టర్ ద్వారా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సువిధ ఆన్ లైన్ పోర్టర్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం రిటర్నింగ్ అధికార్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

News March 25, 2024

బద్వేలు బీజేపీ అభ్యర్థిగా రోషన్న.?

image

బద్వేలు నియోజకవర్గ కూటమి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొజ్జ రోషన్న ఎంపిక కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, కూటమి సర్దుబాటులో భాగంగా బద్వేలు స్థానం బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రోషన్న నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు వెలువడనుందని సమాచారం.

News March 25, 2024

సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

image

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.

error: Content is protected !!