Andhra Pradesh

News April 21, 2024

రేపు జగ్గంపేటలో పర్యటించనున్న చంద్రబాబు

image

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా శనివారం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోకవరం రోడ్డులో కోడూరి రంగారావుకు చెందిన స్థలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News April 21, 2024

ఏలూరు ఆశ్రంకు ఐఎస్ఓ గుర్తింపు

image

ఏలూరులోని అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఆశ్రం)కు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్డాండర్డ్‌రైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు దక్కినట్లు డైరెక్టర్‌ జి.రతీదేవి తెలిపారు. ఆశ్రంలో అందుబాటులోకి తెచ్చిన ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య సేవలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలు, శక్తి, పర్యావరణ అనుకూల వ్యవస్థకు ఐఎస్‌ఓ 5 సర్టిఫికెట్లు అందించిందన్నారు.

News April 21, 2024

విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్: కలెక్టర్

image

ఎన్నికల రోజున విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారని తూ.గో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలతా తెలియజేశారు. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారు 12D ద్వారా పోస్టల్‌ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.

News April 21, 2024

కడప: వివాహేతర సంబంధం.. నలుగురి ప్రాణాలు తీసింది

image

గాలివీడులో ముగ్గురు పిల్లలతో వివాహిత నాగమణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై ఏడాదికి పైగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త విక్రమ్‌కు వేరే మహిళతో ఓ బిడ్డ పుట్టిందని తెలియడంతో.. తీవ్ర మనస్తాపంతో నాగమణి వెలుగల్లి జలాశయం వద్దనున్న గండిమడుగు వద్దకు వెళ్లి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది.

News April 21, 2024

నేడు ప.గో.లో పవన్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప.గో జిల్లాలో
పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో  ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ముత్యాలపల్లి, లోసరి, బర్రెవానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం పట్టణానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్‌లో జరిగే బహిరంగ సభలో వారాహి పైనుంచి మాట్లాడుతారు. రాత్రి స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్‌హాల్‌లో బస చేస్తారు.

News April 21, 2024

డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ రాజీనామా

image

నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవికి ఖలీల్ అహ్మద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మేయర్ స్రవంతికి అందజేశారు. ఆయన వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా విషయాన్ని మేయర్ రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.

News April 21, 2024

బొండపల్లి: ఆరుగురిపై బైండోవర్

image

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తహశీల్దార్ హనుమంతురావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎస్ఈబీ ఎస్సై ఆర్.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన ఆరుగురిపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశారు. వీరంతా గతంలో పలుమార్లు మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరిపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News April 21, 2024

రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆస్తుల వివరాలు

image

➤ అసెంబ్లీ: రాప్తాడు
➤ భర్త: పరిటాల రవీంద్ర
➤ విద్యార్హతలు: 8వ తరగతి పాస్
➤ చరాస్తి విలువ: రూ. 2.50 లక్షలు
➤ స్థిరాస్తులు రూ.28.53 కోట్లు
➤ కేసులు: 8
➤ అప్పులు: రూ.31.68
➤ బంగారం: 750 గ్రాముల
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

విజయవాడ తూర్పులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

image

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం 13వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్‌ సాధించేందుకు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్‌ బరిలో నిలవగా.. వైసీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అవినాశ్ అంటున్నారు. మరి మీ కామెంట్.

News April 21, 2024

పలాస: ఈ నెల 28న షర్మిల రాక

image

పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల ఈనెల 28వ తేదీన జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా టెక్కలి, పలాసలో పర్యటించనున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు టెక్కలి, రాత్రి 7.30 గంటలకు పలాసలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దువ్వాడ తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, ఇండియా ఫోరం పార్టీల శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.