India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఆర్వోకు సమర్పించారు. 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. 2022-23లో వార్షిక ఆదాయం రూ.24,04,909గా చూపించారు. ప్రస్తుతం చేతిలో రూ.66 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.4.20 కోట్లు, చరాస్తులు రూ.118 కోట్లుగా చూపించారు.
➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: కిలారి వెంకట రోశయ్య (YCP)
➤ భార్య: లక్ష్మీ సరస్వతి
➤ విద్యార్హతలు: BA
➤ చరాస్తి విలువ: రూ.5.87 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.5.01కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.3.17కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.07 లక్షలు
➤ బంగారం: 623 గ్రాములు, భార్యకు 1000 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.
అరుకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా వచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గీత తప్పకుండా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మసాగరం గ్రామానికి చెందిన జె.చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈమెరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి సీటు కేటాయించిన అధినేత రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నామినేషన్ వేస్తానని తెలిపారు.
24 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికుంట దొడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. కర్నాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టు గుండా వెళ్లొచ్చే రహదారికి ప్రత్యామ్నాయంగా ఉన్న దారులపై ప్రత్యేక నిఘా వేసి అక్రమాలకు కళ్లెం వేయాలన్నారు.
వైవీయూ మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ స్కాలర్ డి.సుధా లావణ్యకు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆ శాఖ సహ ఆచార్యులు డావి లాజర్ పర్యవేక్షణలో “వంధ్యత్వం ఉన్న మహిళల్లో వైవాహిక సర్దుబాటు, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి, జీవన నాణ్యత ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని వైవీయూ పరీక్షలు విభాగానికి సమర్పించారు. డాక్టర్ ప్రొసీడింగ్స్ ను వైవీయూ సీఈ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.
వైసీపీలో యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో యాదవ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులిచ్చి సీఎం జగన్ గౌరవించారన్నారు. అప్సడా వైస్ ఛైర్మన్ రఘురామ్ నాయుడు, సంపత్ కుమార్ పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మూడవరోజు శనివారం 20 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్ల స్వీకరణ లేదన్నారు. ఈనెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.