Andhra Pradesh

News April 21, 2024

నీటి ఎద్దడి నివారణకు టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ జలాలు ఈనెల 10న జిల్లాలోకి ప్రవేశించాయని, ఈ సాగర్ జలాలు వృథా కాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైన ప్రజలు తాగునీటి సమస్య ఉందని ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

News April 21, 2024

నరసరావుపేట: పోటీ చేసే అభ్యర్థులు వివరాలు పొందుపరచాలి

image

సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థుల రాజకీయ పార్టీల ఖర్చులు వివరాలను సంబంధిత రిజిస్టర్లలో ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు గౌతమన్ , జోసఫ్ జార్జ్ తెలపారు. శనివారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారులతో ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్‌పై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 

News April 20, 2024

బంటుమిల్లిలో రోడ్డు ప్రమాదం.. వీఆర్ఓ మృతి

image

బంటుమిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఓ వెంకట వరప్రసాద్(62) మృతి చెందారు. చోరంపూడి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ శనివారం ఉదయం మచిలీపట్నం నుంచి తన ద్విచక్ర వాహనంపై చోరంపూడి వస్తుండగా కొర్లపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 20, 2024

22తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు దరఖాస్తులను 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News April 20, 2024

గుంటూరు: సాగర్ కుడి కాలువలో ముగ్గురు పిల్లలు గల్లంతు

image

దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో సాగర్ కుడి కాలువలో శనివారం ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా సాగర్ కాలువ వద్ద ముగ్గురు పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో కాలువలో ముగ్గురు పడి కొట్టుకుపోయారు. ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 20, 2024

గిద్దలూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

గిద్దలూరు మండలం తిమ్మాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

శ్రీకాకుళం: 29 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News April 20, 2024

పిడుగుపాటుకు 3 ఎద్దులు మృతి

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బాషా అనే రైతుకు చెందిన రెండు ఎద్దులను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కలుగొట్ల గ్రామంలో సైతం ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది.

News April 20, 2024

చిత్తూరు: నేటి నామినేషన్ల వివరాలు

image

మూడవరోజు శనివారం జిల్లాలో నామినేషన్ల దాఖలు వివరాలను అధికారులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ వచ్చినట్టు చెప్పారు. నగిరి, పూతలపట్టు కు ఒక్కో నామినేషన్ వచ్చిందన్నారు. జీడి నెల్లూరుకు రెండు, పలమనేరుకు రెండు నామినేషన్లు వచ్చాయన్నారు. కుప్పం, పుంగనూరులో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు.

News April 20, 2024

మూడో రోజు 14 నామినేషన్లు దాఖలు: కలెక్టర్

image

రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 3వ రోజు హిందూపురం పార్లమెంటుకు సంబంధించి 4 సెట్లు నామినేషన్ దాఖలు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు.