India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 10 అసెంబ్లీ సీట్లకు మించి రావని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని తెదేపా కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, మన రాష్ట్రంలో అంతకంటే ఎన్నో రెట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు.
కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో సోమవారం జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామానికి చెందిన వాలంటీరు పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా భావిస్తూ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నివేదిక మేరకు ఎంపీడీవో రామాంజనేయులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గన్నవరం మండలంలో వీరపనేని గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిగా, 18 మందికి గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి కూలీలు తీసుకొస్తున్న ఆటో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఏలూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెదవేగి మండలం వేగివాడ సెంటర్లో సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన హోటల్కు సోమవారం కొందరు వచ్చి టిఫిన్ చేశారు. బిల్ మొత్తం రూ.150 కాగా.. వారు రూ.15 ఫోన్ పేలో చెల్లించి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ బైక్పై సోదరి, కుమార్తెతో వారివెంటే వెళ్లారు. తిరిగి వస్తుండగా చక్రాయగూడెం సమీపంలో కారు ఢీకొని సత్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు.
చీరాల మండలం కీర్తి వారిపాలెంలో స్థల వివాదం కారణంగా చోటు చేసుకున్న ఎలికా జ్యోతి అనే వివాహిత హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. మృతురాలి మరణ వాంగ్మూలం, బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసేమన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను చీరాల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమరవాణాపై పోలీసులు సోమ వారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులపై 16 కేసులు నమోదుచేసి 60.3 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై 32 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు, కోడిపందాలు, పేకాట ఆడుతున్న వారిపై మూడుకేసులు నమోదుచేసి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అలసిపోయిన తల్లి గుడిసెలో నిద్రిస్తుండగా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు అనే యువకుడు చిన్నారిని పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతలో తల్లి నిద్ర లేచి గుడిసెలోకి వెళ్లి చూడగా నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీఎం జగన్ చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సురిబాబు తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ యాగంలో వైసీపీ ఇన్ఛార్జ్లు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. ఈనెల 21న ఎలాంటి అనుమతులు లేకుండా పార్వతీపురం పట్టణం కొత్తవలసలో ఉ.8గంటలకు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అనంతరం పార్వతీపురం పట్టణ పోలీసులు జోగారావుపై కేసు నమోదు చేశారు. కాగా.. బొబ్బిలి ఎమ్మెల్యేపై కూడా ఇటీవల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది.
Sorry, no posts matched your criteria.