India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి ఐజర్(IISER)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2 ఖాళీలు ఉన్నాయి. పీజీ ఇన్ లైఫ్ సైన్స్ చదివి రెండేళ్ల అనుభవం కలిగిన వాళ్లు అర్హులు. మరిన్ని వివరాలకు www.iisertirupati.ac.in వెబ్సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 03.
విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.
అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలోని ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, వాతావరణ విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి సోమవారం తెలిపారు. శింగనమల 40.8, యాడికి 40.2, గుంతకల్ 40.1, బొమ్మనహల్ 40, శెట్టూరు 39.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వారు తెలిపారు.
నందికొట్కూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య 29న చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
సోమవారం ఆయన నందికొట్కూరులో మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడి పార్టీ కోసం సేవ చేసే వారికి గుర్తింపు లేకపోవడం వల్ల రాజీనామా చేశానన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామ చేశారు.
.
సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) సోమవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్.శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున సింహాద్రినాదుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్ణాభరణాలతో అందంగా అలంకరించారు.
YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్గానే ఉంది.
YCP చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానంద రెడ్డిని ప్రకటించడంతో MLA శ్రీనివాసులు జనసేన గూటికి చేరారు. ఆయనకు తిరుపతి MLA టికెట్ ఇచ్చారు. గూడూరు MLA వరప్రసాద్కు మరోసారి టికెట్ ఇవ్వడానికి YCP నిరాకరించగా BJPలో చేరారు. తిరుపతి MP టికెట్ దక్కించుకున్నారు. ఈ రెండు సీట్ల కోసం టీడీపీ, బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడినా వీరికే దక్కడం విశేషం. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఓటర్లకు సైకిల్ గుర్తు కనపడదు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు సచివాలయ సమీపం వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వలస కూలీ సురేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
గుడ్లూరు మండలం చిన్నలాటిరఫీలో మల్యాద్రి అనే రైతుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు వరి గడ్డి వాముపై నిప్పు రవ్వలు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా వరిగడ్డి వాము మొత్తం కాలిపోయింది. సుమారు రూ.25 వేలు విలువైన వరిగడ్డివాము దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కావలికి చెందిన పనబాక లక్ష్మి నెల్లూరులో మూడు సార్లు, బాపట్లలో ఒకసారి MPగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత TDPలో చేరారు. 2019, 2021లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె తిరుపతి, బాపట్లలో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. ఆ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు.
Sorry, no posts matched your criteria.