Andhra Pradesh

News April 20, 2024

శ్రీ సత్యసాయి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

ధర్మవరం పట్టణం డీఎల్ఆర్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సంఘటనా ప్రదేశానికి వెళ్లి పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

News April 20, 2024

తిరుపతి గంగమ్మ జాతర తేదీల మార్పు

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణ తేదీలు మారాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 7వ తేదీ నుంచి 15 వరకు జరగాల్సి ఉంది. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంది. అదే సమయంలో జాతర నిర్వహిస్తే బందోబస్తు సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంతో 14వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు జాతర చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

News April 20, 2024

రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

image

సీఎం జగన్ బస్సు యాత్ర ఆదివారం విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో సాగనుంది. ఆదివారం ఉ.9 గంటలకు చిన్నయ్య పాలెం రాత్రి బస నుంచి బయలుదేరి పినగాడి , లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడ చేరుకుని రాత్రి బస చేస్తారు.

News April 20, 2024

మార్కాపురం: మరో జంట ఆత్మహత్య

image

మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో మరో ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతులు నారు వెంకట నాగేశ్వరి, జక్కుల గోపిగా స్థానికులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం యువతికి మరొకరితో వివాహం జరుగనుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గోపి అదే గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

News April 20, 2024

గరివిడి: వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య 

image

గరివిడి మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన అప్పన్న(30) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేని భార్య దేవి, మామ సన్యాసిరావుతో కలిసి భర్తను ఉరి వేసి చంపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 20, 2024

పాలకొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పాలకొండ మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అంపిలి గ్రామానికి చెందిన అప్పలనాయుడు (58) తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి, కరెంట్ షాక్‌తో  మృతి చెందాడని ఏఎస్ఐ రాజారావు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2024

అనకాపల్లి: పార్లమెంటుకు ఒకటి, అసెంబ్లీకి 5 నామినేషన్లు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం పార్లమెంటుకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఆడారి శరత్ చంద్ర నామినేషన్ వేశారు. చోడవరం నుంచి సూర్య నాగ సన్యాసి రాజు (టిడిపి), మాడుగుల నవ భారత్ నిర్మాణ సేవ పార్టీ నుంచి తాళ్ల రవి, నామినేషన్లు వేశారు. అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా ఆళ్ల సత్తిరాజు, ఎలమంచిలి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున బి.అమాజమ్మ, కాంగ్రెస్ నుంచి సుందరపు ఈశ్వరరావు నామినేషన్లు వేశారు

News April 20, 2024

చిత్తూరు: కారు- బైక్ ఢీ

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద రాయచోటి నుంచి పీలేరు వైపు కారు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షౌకత్ ఆలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పీలేరు తరలించారు.

News April 20, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై తాయప్ప(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్లో శనివారం జరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షపు నీటిని తాయప్ప తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలాడని స్థానికులు తెలిపారు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 20, 2024

మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.