Andhra Pradesh

News April 20, 2024

పులివెందుల: అన్నపై తమ్ముడు కత్తితో దాడి

image

పులివెందులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం గట్టు విషయంలో అన్నదమ్ముల ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అన్న రఘనాథరెడ్డిపై తమ్ముడు రాజశేర్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రఘునాథరెడ్డి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

ఆక్రమ రవాణాపై ఉక్కు పాదం జిల్లా ఎస్పీ ఆరీఫ్

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లాలో సైదాపురం పరిధిలో-20, KP పోర్ట్-9, కొండాపురం-15, సంగం-11, దుత్తలూరు-7, జలదంకి-25, చేజెర్ల-10 మరియు SEB-217 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 20, 2024

కమలాపురం హైవేపై ట్రాక్టర్ బోల్తా

image

తప్పెట్ల గ్రామ సమీపాన ఉన్న కడప-తాడిపత్రి జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద కడ్డీల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఈమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

News April 20, 2024

గుంటూరు: విధుల్లో పాల్గొనే విలేకర్లకు పోస్టల్ బ్యాలెట్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధుల్లో పాల్గొనే విలేకర్లకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ అథారిటీ లేఖలు పొందిన విలేకర్లు మాత్రమే, కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్లో ఫార్మ్-12డి పొంది పూర్తిచేసి, వాటితో పాటు ఓటర్ ఐడి, అక్రిడిటేషన్ నకలు జతచేసి ఈ నెల 21సాయంత్రం 6గంటలలోగా అందజేయాలన్నారు.

News April 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు నామినేషన్లు వేసింది వీరే

image

➤ శ్రీకాకుళం: JBNP అభ్యర్థిగా రాగోలు నాగశివ ➤ ఇచ్ఛాపురం: స్వతంత్ర అభ్యర్థిగా సుగ్గు చక్రవర్తి ➤ ఆమదాలవలస: BCYP అభ్యర్థిగా సిపాన శ్రీనివాసరావు ➤ JBNP అభ్యర్థిగా బురిడీ గౌరి శంకర్ ➤నరసన్నపేట: TDP అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి నామినేషన్లు వేశారు.
NOTE: జిల్లా మొత్తంగా శనివారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేశారు.

News April 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు 14 నామినేషన్ల స్వీకరణ

image

జిల్లా వ్యాప్తంగా శనివారం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి, మిగిలిన నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటుకు 4 నామినేషన్లు, యర్రగొండపాలెంలో 1, దర్శికి 2, ఒంగోలుకు 1, కొండపికి 4, గిద్దలూరుకు 2 చొప్పున నామినేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

News April 20, 2024

కృష్ణా: జిల్లాలో 3వ రోజు 13 నామినేషన్‌‌లు

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా మూడవ రోజైన శనివారం జిల్లాలో మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలవ్వగా .. గన్నవరం అసెంబ్లీ స్థానానికి 04, మచిలీపట్నంకు 03, పెడనకు 02, పెనమలూరుకు 1, పామర్రుకు 1, గుడివాడకు1 నామినేషన్ దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 

News April 20, 2024

జనసేనలో చేరిన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్

image

మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, దక్షిణ నియోజకవర్గ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే తమ ధ్యేయమని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, వార్డు అధ్యక్షుడు అర్జున్, నాయకులు పాల్గొన్నారు.

News April 20, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

image

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్‌పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. మృతురాలి భర్తకు కాలు విరగడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2024

సంజామలకు పిడుగుల హెచ్చరిక: APSDMA

image

సంజామల మండల వ్యాప్తంగా మరి కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని APSDMA స్పష్టం చేసింది.