India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ నియోజకవర్గం: గుంటూరు వెస్ట్
➤ అభ్యర్థి: విడదల రజిని(YCP)
➤ భర్త: కుమారస్వామి
➤ విద్యార్హతలు: B.SC
➤ చరాస్తి విలువ: రూ.1.25కోట్లు
➤ భర్త చరాస్తి విలువ: రూ.53.03కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: లేవు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 600గ్రాములు, భర్తకు 300గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.
బైకును లారీ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ ఉద్యోగి మునికుమారి(45), భర్త హరితో కలిసి బైక్పై వెళ్తుండగా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త హరికి గాయాలయ్యాయి.
అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.
సినిమా నటులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని అణచివేసిన చంద్రబాబుకు పవన్కళ్యాణ్ మద్దతు పలకటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీకి ఘన విజయం అందించాలని పిలుపునిచ్చారు.
మండలంలోని నెహ్రూ నగర్లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా విజయభాస్కర్ రెడ్డిపోగు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి విజయభాస్కర్ రెడ్డిపోగు చేత జిల్లా ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు.
రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేస్తానని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కాలనే ఉద్దేశంతో నామినేషన్ వేస్తున్నానని తెలిపారు.
వచ్చే నెల 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్ట్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని.. తమ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో పీడబ్ల్యూడీ, సీనియర్ సిటిజన్ ఓటర్లు క్యూలో వేచి ఉండకుండా ఓటు వేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి.సృజన రిటర్నింగ్ అధికారులను అదేశించారు. శనివారం పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఫార్మ్ డిస్పోజల్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మ్-6, 8ను 22వ తేదిలోపు పరిష్కరించాలన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సూరంపాలెం ఆదిత్య కాలేజ్కు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగ్గా, అందడం లేదని వారు సమాధానమివ్వడమే నేరమైందని అన్నారు. తక్షణమే కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.