Andhra Pradesh

News April 20, 2024

కర్నూలు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

image

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీనడంతో మహిళ మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కర్నూలు బృందావన్ కాలనీకి చెందిన తల్లీకూతురు మాలతి, మౌలిక ఓ ఎలక్ట్రికల్ కారు అద్దెకి తీసుకొని HYDకి వచ్చారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై హమీదుల్లానగర్ శివారులో ప్రమాదం జరిగింది. మాలతి మృతి చెందగా.. మౌలిక, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2024

మార్కాపురం: అక్రమ సంబంధం.. ఇద్దరూ సూసైడ్

image

మార్కాపురం మండలం చింతకుంట గ్రామ శివారులో ఓ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతులు పెద్దారవీడు మండలం పుచ్చకాయ పల్లి గ్రామానికి చెందిన వివాహిత విజయలక్ష్మి(40), సత్యనారాయణ రెడ్డి (30)గా స్థానికులు గుర్తించారు. ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో ఇరు కుటుంబాలు వారు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

News April 20, 2024

పేరాడ తిలక్‌ ఆస్తుల వివరాలు ఇవే..

image

*నియోజకవర్గం: శ్రీకాకుళం పార్లమెంట్
*పార్టీ: వైసీపీ
*విద్యార్హత:డిగ్రీ
*కేసులు: ఏమీలేవు
*చరాస్తులు: రూ.51.47లక్షలు
*స్థిరాస్తులు: రూ.65.87లక్షలు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.9.30కోట్లు
*రుణాలు: రూ.34.51 లక్షలు
*NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 20, 2024

నందిగం సురేశ్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ పార్లమెంట్: బాపట్ల
➤ అభ్యర్థి: నందిగం సురేశ్ (YCP)
 ➤ భార్య: బేబీలత
 ➤ విద్యార్హతలు: 9వ తరగతి
 ➤ చరాస్తి విలువ: రూ.68.48 లక్షలు
 ➤ స్థిరాస్తి విలువ: రూ.2 లక్షలు
 ➤ కేసులు: 4
 ➤ అప్పులు: రూ.77.05 లక్షలు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.6 లక్షలు
 ➤ బంగారం: 150 గ్రాములు, భార్యకు 450 గ్రాములు
 NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 20, 2024

అనుమానం.. భార్య, పిల్లలను లోపల వేసి ఇంటికి నిప్పు

image

అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 20, 2024

విశాఖ- బెంగళూరు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-బెంగళూరు-విశాఖ మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ-ఎస్ఎంవీ బెంగళూరు సమ్మర్ స్పెషల్ ట్రైన్ ప్రతి శనివారం విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు బెంగళూరు చేరుకుంటుంది. జూన్ 29 వరకు ఇది నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూరు నుంచి విశాఖకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. జూన్ 30 వరకు నడుస్తుంది.

News April 20, 2024

కొడుకుపై కేసు పెడతారనే భయంతో తల్లి ఆత్మహత్య

image

కొడుకుపై కేసు పెడతారని తల్లి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ-సూర్యకుమారి HYDలో పనులు చేసుకుంటున్నారు. వీరి కొడుకు(14) బుధవారం బైక్‌తో BMW కారును ఢీకొట్టాడు. కారు రిపేరుకు రూ.20 వేలు ఇవ్వాలని, లేదా కేసు పెడతామని డ్రైవర్ చంద్రశేఖర్, ఫ్రెండ్ మహేశ్ బెదిరించారు. దీంతో సూర్యకుమారి సూసైడ్ చేసుకుంది. పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.

News April 20, 2024

ఉమ్మడి తూ.గో.లో రెండో రోజు 26 నామినేషన్లు

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ప్రధాన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామపత్రాలు సమర్పించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా మొత్తంగా 26 నామినేషన్ల రాగా.. తూ.గో జిల్లాలో 12 (MP-1, MLA-11), అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10, కాకినాడ జిల్లాలో 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

News April 20, 2024

ఆత్మకూరు : 22న ఆనం నామినేషన్

image

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూరు సత్రం సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, మీదుగా మున్సిపల్ ఆఫీసుకు చేరుకుంటారని ఆనం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News April 20, 2024

శ్రీకాకుళం: రూ.1.37 లక్షల సొమ్ము సీజ్

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం అటుగా వచ్చిన వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.37 లక్షలు సొమ్మును సీజ్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొమ్మును వజ్రపుకొత్తూరు పోలీసులకు అందజేశామని ఫ్లైయింగ్ స్క్యాడ్ సిబ్బంది తెలిపారు.