Andhra Pradesh

News April 20, 2024

శ్రీవారి మెట్ల మార్గంలో హీరోయిన్ సంయుక్త మీనన్

image

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శనివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సినీ నటి సంయుక్త మీనన్ తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు అధికారులు బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆమె ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు.

News April 20, 2024

అయ్యన్న పాత్రుడిపై 17 క్రిమినల్ కేసులు

image

☞ అభ్యర్థి: అయ్యన్నపాత్రుడు☞ పార్టీ: టీడీపీ☞నియోజకవర్గం: నర్సీపట్నం☞ కేసులు: 17 ( క్రిమినల్ కేసులు)☞ చరాస్తులు: రూ.1.13 కోట్లు☞ స్థిరాస్తి రూ.5,04కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.79 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.10.8కోట్లు☞ భార్య పేరిట బంగారం: కేజీ☞ అప్పులు: రూ.2.86 కోట్లు➠ అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేయగా, అఫిడవిట్‌లో వివరాలను వెల్లడించారు.

News April 20, 2024

సీఎం జగన్ అనంత జిల్లాకు ఏం చేశారు: చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి కనేకల్లులో ప్రజాగళం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. టీడీపీ హాయంలో రూ.4,500కోట్లతో హంద్రీనీవా ప్రారంభించామన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్సీ నీరు తెచ్చామన్నారు. బైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

News April 20, 2024

ప్రకాశం జిల్లాకు రానున్న షర్మిలా రెడ్డి

image

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు ఈనెల 22న వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 22న ఉదయం 10 గంటలకు బూదాల అజిత్ రావు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అదేరోజు చీరాలలో కూడా పర్యటించనున్నట్లు వెల్లడించారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.

News April 20, 2024

తెనాలి శ్రావణ్ కుమార్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: తాడికొండ
➤ అభ్యర్థి: తెనాలి శ్రావణ్ కుమార్ (TDP)
➤ విద్యార్హతలు: MSC, MA, LLB
➤ మొత్తం చరాస్తి విలువ: రూ.1,47 కోట్లు
➤ స్థిరాస్తి విలువ: రూ.3.89 కోట్లు
➤అప్పులు: రూ.22.75 లక్షలు
➤ కేసులు: 08 కేసులు (పెండింగ్‌లో ఉన్నాయి.)
➤ భార్యపేరు: పద్మావతి
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

నంద్యాల: పిడుగుపాటుతో ఒకరి మృతి

image

గడివేముల మండలం చిందుకూరు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న గొర్రెల కాపరి శేఖర్ పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఆయన మండలంలోని డోన్ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. దీంతోపాటు గడిరేవుల గ్రామంలో పిడుగుపాటుకు గురై 25 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 20, 2024

నెల్లూరు MP అభ్యర్థి ఆస్తి రూ.11.55 కోట్లేనంట..!

image

➤నియోజకవర్గం : నెల్లూరు పార్లమెంటు
➤అభ్యర్థి : కొప్పుల రాజు (కాంగ్రెస్ పార్టీ)
➤విద్యార్హత : ఎంఫిల్
➤వృత్తి : విశ్రాంత ఐఏఎస్ అధికారి
➤కుటుంబ ఆస్తి: 11.55 కోట్లు
➤అప్పులు: రూ.1.02 కోట్లు
నోట్ : ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఈ వివరాలు నమోదు అయ్యాయి.

News April 20, 2024

పలాస: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

పలాస రైల్వే స్టేషన్‌లో స్థానిక జీఆర్పీ పోలీసులు శుక్రవారం బిహార్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి విశాఖ వెళుతున్న ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఐదుగురు యువకులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించగా 27 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

News April 20, 2024

బొత్స సత్యనారాయణ ఆస్తుల వివరాలు ఇవే..

image

☞ అభ్యర్థి: బొత్స సత్యనారాయణ
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.3.78 కోట్లు
☞ బంగారం: 31 తులాలు
☞ స్థిరాస్తి: రూ.6.75 కోట్లు
☞ అప్పులు: రూ.4.24 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.4.75 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.46 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 325 తులాలు
➠ బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లండించారు.

News April 20, 2024

కడప జిల్లాలో అమానుష ఘటన

image

ఉమ్మడి జిల్లాలోని గాలివీడు మండలం చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెలిగల్లు సమీపంలోని గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి కేసు నమోదు చేశారు.