Andhra Pradesh

News June 10, 2024

కడప: మాజీ MLAలు సపోర్టు చేసినా గెలవని వైసీపీ

image

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీపై టీడీపీ కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి, రాయచోటిలో రమేశ్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉండేవారు. కాగా రెండు చోట్ల వైసీపీకి పరాభవం తప్పలేదు. రాయచోటిలో 2,495, కమలాపురంలో 25,357 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు గెలిచారు.

News June 10, 2024

కంచిలి సహకార సంఘం ఛైర్మన్ రాజీనామా

image

కంచిలి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గుమ్మడి రామదాసు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సహకార సంఘం అధికారులకు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా ఎన్నికైన రామదాసు.. ప్రస్తుతం కూటమి గెలవడం పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో రాజీనామా అందజేసినట్లు ఆయన తెలిపారు.

News June 10, 2024

అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

image

‘అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం తెలుగు విద్యార్థి నేతలు గాజులు, చీరలతో అంబటి రాంబాబు నివాసం వద్దకు వెళ్లారు. కుర్చీపై అంబటి ఫొటో, గాజులు, చీర పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అంబటి రావాలని పిలిచేందుకు వచ్చామని అన్నారు. 

News June 10, 2024

దర్శి ఏఎంసీ ఛైర్మన్ రాజీనామా

image

దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆగస్టు వరకు పదవి కాలం ఉన్నప్పటికీ రాజీనామా లేఖను అధికారులకు అందించారు. ఛైర్మన్‌తో పాటు వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు కూడా రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పదవులకు కొత్త వారు రానున్న తరుణంలో నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

News June 10, 2024

విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేడు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. కాగా నిన్న కేంద్రమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గన్నవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపు ఉదయం విజయవాడలోని A కన్వెన్షన్‌‌లో పార్టీనేతలతో సమావేశం కానున్నారు.

News June 10, 2024

కొమరాడలో ఆటో బొల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

image

కొమరాడ మండలం పెద్ద కెర్జల వద్ద ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం పెద్ద కెర్జల నుంచి కొమరాడ వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 108కి సమాచారం అందించగా ఘటనా స్థలానికి మూడు అంబులెన్స్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆస్పత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

గుంటూరు: సబ్జెక్టులు మిగిలాయని విద్యార్థి ఆత్మహత్య

image

పర్చూరు మండలం రామనాయపాలెంకి చెందిన వంశీకృష్ణ దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు మిగిలాయని ఆదివారం చింతలపూడి కళాశాల సమీపంలోని ఓ పూరి గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News June 10, 2024

నెల్లూరులో వైసీపీకి మేయర్ దంపతుల రాజీనామా

image

నెల్లూరులో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సోమవారం నెల్లూరు మేయర్ శ్రవంతి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం టీడీపీలో చేరిన మేయర్ దంపతులు మూడు రోజులు తిరిగేసరికి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.

News June 10, 2024

కర్నూలు: TDP నేత హత్య.. రాత్రికి రాత్రే.. సీఐ, ఎస్సైల బదిలీ

image

వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో నిన్న రాత్రి టీడీపీ నేత గిరినాథ్ చౌదరి హత్య నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో వెల్దుర్తి సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ రెడ్డిని VRకు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. నూతన సీఐగా కర్నూలు సర్కిల్ పోలీస్ స్టేషన్ నుంచి మధుసూదన రావు, ఎస్సైగా కర్నూలు నాల్గో పట్టణ పోలీస్ ష్టేషన్ నుంచి సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

News June 10, 2024

వాలంటీర్ల కష్టాలు.. కొత్త ప్రభుత్వంపై ఆశలు!

image

ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలనే EC ఆదేశాలతో వివాదం చెలరేగి చాలామంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి పరిస్థితి ఎటూ తేలని చందంగా ఉంది. కోనసీమలో నగరపాలక సంస్థ, 6 మున్సిపాలిటీలు, 21 మండలాల పరిధిలో 11,273 మంది వాలంటీర్లకు 10వేల మంది రాజీనామా చేశారు. 3నెలలుగా పనులు లేక, జీతాలు అందక వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొత్త ప్రభుత్వంలో మంచిరోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.