India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఏప్రిల్ 2 నుంచి శ్రీ ముత్యాలమ్మ జాతర జరగనుంది. మొదటి రోజు శ్రీపోలేరమ్మ నిలుపు అనంతరం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రోజు రాత్రి సింహవాహన సేవ జరుగుతుంది. 3న యార, గొల్లల ఉత్సవం 4న గురునాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5 పోలేరమ్మను సాగనంపుతారు. లక్షల మంది భక్తుల రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్కుమార్కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.
నరసన్నపేట నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అత్యధికంగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ , TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో కూడా YCP, TDP నుంచి వీరే ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఈసారైనా TDPని విజయం వరిస్తుందా..లేదా..2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా? కామెంట్ చేయండి.
చోరీ కేసులో సినీ నటి సౌమ్యశెట్టి అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రైల్వే న్యూకాలనీలోని స్నేహితురాలు మౌనిక పుట్టింట్లో సౌమ్యశెట్టి 75 తులాల బంగారం అపహరించేదనే అభియోగంపై ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన ఆమె తనను అన్యాయంగా చోరీ కేసులో ఇరికించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోపాటు పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆరోపించారు.
వేటపాలెం మండల పరిధిలోని రోశయ్య కాలనీకి చెందిన దేవర లక్ష్మీ(35)ని హత్యచేసిన కేసులో భర్త లక్ష్మీనారాయణను చీరాల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గత బుధవారం గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లోకి భార్యను తీసుకెళ్లి హతమార్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో పెద్దముడియం మండలం బలపనగూడూరుకి చెందని ఇద్దరు వ్యక్తులు శనివారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఏసోబు, బండెన్న బేల్దారి పని నిమిత్తం 2 రోజుల క్రితం బైకులో అనంతపురం జిల్లాకు వెళ్లారు. పనులు ముగించుకుని శనివారం స్వగ్రామానికి వస్తుండగా రోటరీపురం వద్ద ఓ కళాశాల బస్సు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లా సదుం మండలం ఊటుపల్లె సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. B.గురుమూర్తి, ఎం.ఈశ్వ రయ్య, కె.బాలాజీ ఈనెల 19న వైసీపీ నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీసీవై పార్టీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో వివరించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ‘కూటమి’ టికెట్పై సందిగ్ధత తొలగింది. ముందు TDP నుంచి రాజేశ్కు టికెట్ దక్కగా.. అసమ్మతి నేపథ్యంలో ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. విప్పర్తి ఇరిగేషన్ శాఖలో.. గిడ్డి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.
శెట్టూరు మండలం కంబాలపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లికి చెందిన గొల్ల తిమ్మయ్య (30) మృతి చెందగా, ప్రసాద్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారు బైక్పై కుందుర్పికి వెళ్లి వస్తుండగా ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల తిమ్మయ్య తల, పొట్ట భాగంలో బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
Sorry, no posts matched your criteria.