India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు ఆది, సోమవారాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలని కోరారు.
కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుందని శనివారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 11225 (పబ్లిక్), 3938 ప్రయివేటు అంశాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.17.94 లక్షల నగదు, రూ.23.31 లక్షలు విలువైన లిక్కర్, ఇతర సామగ్రి 52.65 లక్షలు, మొత్తం రూ.1.1 కోట్ల వరకు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
విద్యుత్ బిల్లులను ఆది, సోమవారాల్లో యథావిధిగా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు జిల్లా ఎస్ఈ విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ సందర్భంగా సోమవారం సెలవైనప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పని చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్టింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
డోన్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కలిశారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తదుపరి పరిణామాల వల్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీటు కేటాయించారు. నియోజవర్గం పరిస్థితులపై బాబు ఇరువురి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 28న జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 27న జోన్ 4లో మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకొని, అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కదిరిలో ప్రజాగళం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉద్దానం ప్రాంతంలో నిన్న ఎలుగుబంటి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. జీడితోటకు వెళ్లిన రైతులపై దాడి చేయగా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లికి చెందిన చిడిపల్లి లోకనాథం(46), అప్పికొండ కూర్మారావు(48) చనిపోయారు. మహిళా రైతు చిడిపల్లి సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మరణానికి కారణమైన ఎలుగుబంటి సమీప తోటల్లో చనిపోయినట్లు సమాచారం.
టీడీపీలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈయన పార్టీలో చేరితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదో చూడాలి.
Sorry, no posts matched your criteria.