India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☞ అభ్యర్థి: ఉప్పల పాటి రమణమూర్తిరాజు (కన్నబాబు రాజు)☞ కేసులు: క్రిమినల్ కేసులు లేవు☞ చరాస్తులు: రూ.16.05 కోట్లు☞ స్థిరాస్తి: రూ.20.67☞ అప్పులు: రూ.12.21 కోట్లు☞ భార్య పేరిట చరాస్తులు: రూ.6.39 కోట్లు☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.8.17 కోట్లు☞ భార్య పేరిట అప్పులు: రూ.3.22 కోట్లు➠ ఈయన పేరిట సొంత కారు లేదని అఫిడవిట్లో తెలిపారు.
పత్తికొండ వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను వెల్లడించారు. 2019లో రూ.3.06 కోట్ల స్థిర, చరాస్తులను చూపిన ఆమె ఈసారి రూ.2.55 కోట్ల సాగుభూమి, రూ.66 లక్షల విలువైన ఇళ్ల స్థలాలు చూపారు. ఆమెకు హైదరాబాద్లో ఇల్లు, కర్నూలు, వెల్దుర్తిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. రూ.3.94 కోట్ల అప్పు చూపారు. తనకు వ్యవసాయం ద్వారా తప్ప వేరే వనరుల ద్వారా ఆదాయం లేదని పేర్కొన్నారు.
ఉషశ్రీ చరణ్కు రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.27 కేజీల బంగారం, 78 కిలోల వెండి ఉంది. 2 క్రిమినల్ కేసులున్నాయి. భర్త శ్రీచరణ్ స్థిర,చరాస్తులు రూ.44.93, 1.607 కేజీల బంగారం, 48 కిలోల వెండి, ఓ బస్సు, ఇతర వాహనాలు ఉన్నాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఉష స్థిర,చరాస్తులు రూ.1.52కోట్లు, 4.150 కేజీల బంగారం ఉంది. ఆమె భర్త స్థిర, చరాస్తులు రూ.7.61కోట్లు. 1.5కేజీల బంగారం ఉంది.
యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన త్రిపురాంతకం మండలం నీళ్ళ గంగవరం గ్రామానికి చెందిన కందుల బాషయ్య (30) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మృతున్ని సందర్శించి.. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కొవ్వూరు రోడ్డు, రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్ సిటీ ఏరియాకు చెందిన భార్గవి(26) ఓ బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన భార్గవి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహం లభ్యమైంది.
ఉమ్మడి తూ.గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, నిడదవోలు నియోజవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ మాతృమూర్తి మేడా పద్మావతి(78) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని రాజమండ్రిలోని జెండా పంజారోడ్డులో ఉన్న స్వగృహానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, తదితరులు దుర్గేష్, ఆయన సోదరుడు గురుదత్త ప్రసాద్ను పరామర్శించి సానుభూతి తెలిపారు.
➤ నియోజకవర్గం: వినుకొండ
➤ అభ్యర్థి: జీవీ ఆంజనేయులు (TDP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.50,99 లక్షలు
➤ స్థిరాస్తి విలువ: రూ.119.07 కోట్లు
➤అప్పులు: రూ.29.98 కోట్లు
➤ కేసులు: 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
➤ బంగారం: 5,909 గ్రాములు ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి
నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. మహానంది పుణ్యక్షేత్రం పరిధిలో చిరుజల్లులు పడ్డాయి. కొలిమిగుండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే ఆళ్లగడ్డ, రుద్రవరం, శ్రీశైలంలో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన జిల్లా ప్రజలు సాయంత్రం చినుకులు, చలిగాలులు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
నందిగం మండలం పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజిని(48) కుమారుడు రమేష్కు ఈనెల 24న వివాహం నిశ్చయమైంది. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు కుమారుడుతో కలిసి శుక్రవారం బైక్ పై పలాస వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.