India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆన్లైన్లో ట్రేడింగ్ చేసి రూ.35 లక్షలు మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. పోరంకికి చెందిన శ్రీకాంత్ ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టారు. తనకు డబ్బు అవసరమై విత్ డ్రా చేద్దామని అడగ్గా.. రెండు రోజుల పడుతుందని వారు తెలిపి అతని ఖాతాను బ్లాక్లో పెట్టారన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి అఫిడవిట్లోని వివరాల మేరకు చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లు ఉన్నాయి. భార్య పేరిట చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లు ఉంది. గత ఎన్నికలప్పుడు పెద్దిరెడ్డి ఆస్తి 91.74 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 124.84 కోట్లకు పెరిగింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. పెద్దిరెడ్డిపై ఒక్క కేసు కూడా లేకపోగా ..కారు కూడా లేదు.
➤ నియోజకవర్గం: గుంటూరు ఈస్ట్
➤ అభ్యర్థి: నూరి ఫాతిమా (YCP)
➤ భర్త పేరు: అబ్దుల్ హుస్సేన్
➤ విద్యార్హతలు: బీటెక్
➤ చరాస్తి విలువ: రూ.22,29,708.31 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.20.11,417.83 (షేర్లు, డిపాజిట్లు)
➤ బంగారం: 300 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి
☞ అభ్యర్థి: లోకం నాగమాధవి
☞పార్టీ: జనసేన
☞ విద్యార్హతలు: ఇంజినీరింగ్
☞ కేసులు: లేవు
☞ కుటుంబ ఆస్తి: 894.92 కోట్లు
☞ అప్పులు: లేవు
➠ మాధవి కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది.
➠ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన మధవి అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు.
తాడిపత్రిలో నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తి, విద్యార్హత, కేసుల వివరాల ఆఫిడవిట్ దాఖలు చేశారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..
అభ్యర్థి : జెసి అస్మిత్ రెడ్డి
పార్టీ : టీడీపీ
నియోజకవర్గం: తాడిపత్రి
విద్యార్హత: ఎంబీఏ, స్కాట్లాండ్
కేసులు: 30
చరాస్తులు : రూ. 27.75కోట్లు
స్థిరాస్తులు:రూ.147 కోట్లు
అప్పులు: 26.87 కోట్లు
బంగారం: 604 గ్రాములు, వజ్రాలు
టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ క్రిమినల్ కేసులు, తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. ఒడిశా ప్రభుత్వానికి వ్యాట్, జీఎస్టీ, మైనింగ్ ఛార్జీల కింద రూ.19.03 కోట్ల అప్పులున్నాయి. శ్రీనివాస్ పేరిట రూ.4.41 కోట్లు, భార్య మీద రూ.49 లక్షల చరాస్తులున్నాయి. వీరి స్థిరాస్తుల విలువ రూ.5.50 కోట్లు, రుణం రూ.1.36 కోట్లు. బంగారం 4.6 కిలోలు, వెండి 7.9 కిలోల ఉంది. చేతిలో నగదు రూ.15లక్షలు. *NOTE:ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.
2018లో ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నరసింహమూర్తి ప్రిన్సిపల్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఆమె జవాబు పత్రాలు మార్చేసి పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి కారణమయ్యారు. దీనిపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదైంది. విచారణ అనంతరం విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ప్రిన్సిపల్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.
➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: మురుగుడు లావణ్య (YCP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.42.54 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.85.01 లక్షలు
➤ బంగారం: 450 గ్రాములు, భర్త పేరుతో 100 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి
ప్రముఖ కన్నడ సినిమా ఇండస్ట్రీ హీరో, దర్శకుడు రాజా రవివీర అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అద్దంకి గడ్డపై హనిమిరెడ్డి ప్రభంజనాన్ని చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి ప.గో.లో ‘ఉండి’ హాట్ టాపిక్గా మారింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇక్కడ టీడీపీ టికెట్పై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఉండిలో ఎంపీ రఘురామ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు కాగా.. రామరాజు 22న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. నిన్న కేడర్ రామరాజు సమావేశం కాగా.. అంతలోనే చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిందని, శనివారం ఆయనను కలిసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రామరాజు నేతలకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.