India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. షేక్ నూరి ఫాతిమా(YCP), గూడవల్లి మణికుమారి (బహుజన్ సమాజ్ పార్టీ), షేక్ రజాక్ (నవతరం పార్టీ), షేక్ దుర్రే షహవర్ (స్వతంత్ర), కాజా రాఘవేంద్ర సంజీవరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా). గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి రోశయ్య (వైసీపీ), షేక్ అస్లాం అక్తర్(స్వతంత్ర), అక్కిశెట్టి శ్రీకృష్ణ (స్వంతత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 535 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామన్నారు సీ.విజిల్ ద్వారా మొత్తం 336 కేసులు నమోదు కాగా, అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవని గుర్తింమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,011 ఎఫ్.ఐ.ఆర్. కేసులు నమోదు చేశామన్నారు.
ఎంసీఎంసీ కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,644 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 563 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, 1000 మంది ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలు 663 వరకు ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. 991 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చిత్రీకరణ చేపడుతున్నామన్నారు.
ఏపీలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకి సేవను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి, ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నెల్లూరు జిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. జిల్లాలో 8 స్థానాలకు 14 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొప్పుల రాజు నామినేషన్ సమర్పించారన్నారు. కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఉదయగిరి నుంచి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఓటర్లు – పురుష ఓటర్లు
1.ఇచ్ఛాపురం 1,37,254 – 1,30,544
2.పలాస 1,11,709 – 1,06,877
3.టెక్కలి 1,18,129 – 1,17,511
4.పాతపట్నం 1,12,696 – 1,12,095
5.శ్రీకాకుళం 1,37,488 – 1,34,866
6.ఆముదాలవలస 97,477 – 95,987
7.నరసన్నపేట 1,07,434 – 1,06,841
8.మొత్తం ఓటర్లు 8,22,187 – 8,04,721
తిరుపతి జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానానికి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు 24 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారన్నారు. నామినేషన్ల పురస్కరించుకొని నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈనెల 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు.
సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించిన సింగరాయకొండకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ శుక్రవారం అభినందించారు. ఇటీవల సివిల్ సర్వీసులో కృష్ణారెడ్డి ఆల్ ఇండియా 780 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉదయ్ కృష్ణారెడ్డిని శాలువతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.