India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్లలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందుకు సంబంధించిన పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, డా.కె. శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. నంద్యాల పార్లమెంట్, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరు వేయలేదని తెలిపారు.
రాజాం పట్టణంలో వైసీపీ ప్రచారరథం ఢీకొని భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం నడిపి.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు -2024 శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల (ఎక్స్పెండిచర్) పరిశీలకలు కె.కె.శరవణ కుమార్ జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికను శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆయనను స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎస్పి ఎన్నికల పరిశీలకలు చర్చించారు.
కడప ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ప్రొద్దుటూరుకు చెందిన షణ్ముఖ రెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రకియ జోరుగా కొనసాగుతుంది. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే రెండో రోజుల్లో మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగోసారి పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కుమార్తె శ్రీశక్తితో కలిసి నామినేషన్ను ఆర్వోలకు అందజేయడం 20 ఏళ్లుగా సెంటిమెంటుగా కొనసాగుతోంది. ఈసారి కూడా ఆమె చేత హనుమంతరాయనదిన్నెలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం తండ్రి పెద్దిరెడ్డితో కలిసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు.
సింహాచలం ఆలయంలో శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భువిలో జరిగే సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవానికి దివిలో దేవతలను ఆహ్వానిస్తూ ద్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి రథోత్సవం అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల మధ్య అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను అందజేయనున్నారు. దాదాపు 250 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.
కడుపునొప్పి తాళలేక బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన తూముల విజయకుమార్(23) గత మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితం విరక్తిచెంది గ్రామ సమీపంలో అరటితోట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్సకోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జయంతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నరసాపురం పార్లమెంట్ (09) పరిధిలో 2వ రోజు నలుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. YCP తరఫున గూడూరి ఉమా బాల 2 సెట్లు, YCP తరపు గూడూరి జగదీష్ కుమార్ 1 సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మహబూబాబాద్కు చెందిన గోటేటి లక్ష్మీ నరసింహారావు 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా తణుకుకు చెందిన ఉందుర్తి ప్రసన్నకుమార్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.