India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దాచేపల్లి మండల పరిధిలోని నాయుడుపేట సమీపంలో శుక్రవారం గుర్తు వ్యక్తి తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లా నూతన అసిస్టెంట్ కలెక్టర్గా బొల్లిపల్లి వినూత్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కలెక్టర్ ఛాంబర్లో వినూత్న బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వినూత్న కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇదే రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్న ఆయనకు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో రేపు చంద్రబాబు పర్యటన సాగనుంది.
కనిగిరి మండలంలోని సుల్తానపురానికి చెందిన లక్కిరెడ్డి పెద్ద అంజయ్య (56) శుక్రవారం మృతి చెందారు. మాచవరం వద్ద బైకుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల నిమిత్తం అటుపై వెళ్తున్న సీఐ రామనాయక్ స్పందించి పెద్ద అంజయ్యను తన వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్ కి వచ్చిన కొద్దిసేపు తర్వాత పెద్ద అంజయ్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 16 నుంచి నేటి వరకు 92 లక్షల నగదు, 42 లక్షల విలువైన లిక్కర్, 29 లక్షల విలువైన డ్రగ్స్, 1 కోటి 81 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు 74 లక్షల విలువైన ఇతర సామాగ్రిని కలిపి 4.2 కోట్లను సీజ్ చేశామన్నారు. ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా వ్యయ కమిటి , సి విజిల్ , మీడియా మానటరింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరదేవితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. హిందూపురం కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అభిషేక్ కుమార్కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన మాట్లాడుతూ..
హిందూపురంలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రం వరకు ఊరేగింపుగా వచ్చారు.
కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ.. ఆనారోగ్యంతో మహమ్మద్ బాషా (44) శుక్రవారం మృతి చెందాడు. హోంగార్డ్ పట్ల జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సంతాపం వ్యక్తపరిచారు. బాషా కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అధైర్య పడవద్దని తెలిపారు. ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా వచ్చి అడగవచ్చని అన్నారు.డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఆర్ఐ రవికుమార్, తదితరులు నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు MP అభ్యర్థిగా ఏఐసీసీ నేత కొప్పుల రాజు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్గా వ్యవహరించారు. అప్పుడు ఆయన పని చేసిన కార్యాలయంలో.. అదే సీటులో ఉన్న ప్రస్తుత కలెక్టర్కు రాజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పేపర్లు ఇవ్వడం విశేషం.
తూ.గో. జిల్లాలోని TDP సీనియర్ నేత గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్నుంచి నామినేషన్ వేశారు. కాగా గోరంట్లకు నామినేషన్ వేయడం ఆయన రాజకీయ జీవితంలో 10వ సారి కావడం విశేషం. రాజమండ్రి నియోజకవర్గంలో TDP నుంచి 1983లో తొలిసారిగా MLAగా గెలిచారు. ఆ తర్వాత 1985లో గెలుపొందగా 1989లో ఓడిపోయారు. 1994, 1999లో గెలిచి, 2004, 2009లో పరాజయం పొందారు. మళ్లీ రాజమండ్రి రూరల్ ఏర్పడిన తర్వాత 2014, 2019లో గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.