India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీలు సీబీఐ కేసులకు భయపడి ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేయలేకపోతున్నారని విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు, ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.
కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడుతూ నీటి ఎద్దడి కల ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పలువులు పాల్గొన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.
ఉమ్మడి విజయనగరంలోని మొత్తం 9 నియోజకవర్గాల్లోని సాలూరు, బొబ్బిలి, నెల్లిమర్లలో ఇప్పటి వరకూ మహిళలు ఎమ్మెల్యేగా గెలవలేదు. బొబ్బిలిలో ఇప్పటి వరకూ మహిళా అభ్యర్థి పోటీచేయలేదు. నెల్లిమర్లలో కూడా ఇదే పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర్లలో లోకం మాధవి పోటీచేస్తుంటే, సాలూరు నుంచి సంధ్యారాణి మూడోసారి పోటీచేస్తున్నారు. మరి వీరి గెలుపుపై మీ కామెంట్
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ‘సి విజిల్’ యాప్ ద్వారా ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంగించిన ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. శుక్రవారం జరిగిన మ్యాథ్స్ పరీక్షలో పెనుకొండ సబ్ డివిజన్ నుంచి 791 మంది విద్యార్థులు, ధర్మవరం సబ్ డివిజన్ నుంచి 594 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతోందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. సీ-విజిల్, 1950 హెల్ప్లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ), కలెక్టరేట్ కంట్రోల్ రూం నెంబర్ (0866-2570051) తదితరాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నాణ్యతతో, సత్వర పరిష్కారంపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.
ప.గో. జిల్లాలోని పాలకొల్లులో 1955 నుంచి 2019 వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడూ హ్యాట్రిక్ విజయం నమోదుచేయలేదు. అయితే 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధించారు. తాజాగా మరోసారి ఆయన అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి గెలిస్తే పాలకొల్లు చరిత్రలో హ్యాట్రిక్ రికార్డు ఆయన సొంతమవుతుంది. మరి విజయం సాధించేనా..?
గుండెపోటుకు గురై మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షకు హాజరైన విషాద సంఘటన శుక్రవారం పార్వతీపురం మండలంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి తండ్రి ఎన్. సీతారాం(45) శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందాడు. కుమారుడు వినయ్ పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.
Sorry, no posts matched your criteria.