Andhra Pradesh

News April 19, 2024

నేదురుమల్లికి రూ.17.50 కోట్ల విలువైన ఇల్లు

image

➤ నియోజకవర్గం: వెంకటగిరి
➤ అభ్యర్థి: నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (YCP)
➤ ఆస్తుల విలువ: రూ.52.96 కోట్లు
➤ భార్య స్వప్న ఆస్తి: రూ.12.28 కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.18 లక్షలు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.2.40 లక్షలు
➤ బంగారం: లేదు, భార్యకు 1.86 కేజీలు
➤ వాహనాలు: రెండు కార్లు
NOTE: HYD సోమాజిగూడలోని ఓ ఇల్లు విలువే రూ.17.50 కోట్లుగా తన అఫిడవిట్‌లో చూపారు.

News April 19, 2024

నంద్యాల జిల్లాలో షర్మిల పర్యటన

image

నంద్యాల పట్టణంలో ఈనెల 21వ తేదీన వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు.

News April 19, 2024

అనంత: 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న JNTU

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946వ సంవత్సరంలో స్థాపించబడింది. అనంతరం 2008 సంవత్సరంలో యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. కాగా ఈ యూనివర్శిటీ నేటితో 78 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండడంతో శుక్రవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, DRDO మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి వంటి వారు ఇక్కడే చదువుకున్నారు.

News April 19, 2024

గుంటూరు: ఇంజినీరింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

image

గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున, ఈనెల 30వ తేదీన పలు రైళ్లు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. మరమ్మతుల వల్ల గుంటూరు-మాచర్ల, మాచర్ల- నడికుడి సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పగిడిపల్లి, కాజీపేట, కొండపల్లి, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో వెళ్తుందని తెలిపారు.

News April 19, 2024

నాడు ఒంగోలు కలెక్టర్.. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి

image

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కే.ఆర్ గురువారం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తనకు ఓటు వేయమని తిరుపతి ప్రజలను కోరారు. విజయ్ కుమార్ 2013 నుంచి 2015 వరకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా, ప్లానింగ్ సెక్రటరీగా సేవలందించారు.

News April 19, 2024

కాకినాడ: పిఠాపురం మీదుగా CM జగన్ యాత్ర

image

సీఎం జగన్ బస్సుయాత్ర శుక్రవారం ఉదయం 9గంటలకు ఎస్టీ రాజపురం నుంచి బయలుదేరుతుంది. రంగంపేట మీదుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రవేశించి, పెద్దాపురం-సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడినుంచి సాయంత్రం 3:30గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత పిఠాపురం, గొల్లప్రోలు మీదుగా గొడిచర్లక్రాస్ వద్ద రాత్రికి బస చేస్తారు.

News April 19, 2024

VZM: 14,344 మంది బైండోవర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అల్లరిమూకలు, పాత నేరస్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు జిల్లా వ్యాప్తంగా 14,344 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 33 స్టేషన్ల పరిధిలో 14,344 మంది బైండోవర్ నమోదయ్యాయి. పాత నేరస్థులకు సంబంధించి 111 మందిపై రౌడీషీట్లు తెరిచారు.

News April 19, 2024

అన్నమయ్య: భర్తను చంపిన భార్య

image

భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

కవిటి: పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే

image

కవిటి మండలం వరకకు చెందిన బెంతు ఒరియా సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ పురియా తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ MLA, వైసీపీ నేత పిరియా సాయిరాజ్, వైసీపీ కవిటి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాశ్ శ్యాంసుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పాడె మోసి అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్యాంసుందర్ మృతితో వైసీపీ కీలక నేతను కోల్పోయిందని సాయిరాజ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు.

News April 19, 2024

పైరసీలు చేసి రాజ్యసభ సభ్యుడైనంత ఈజీ కాదు: పోతిన మహేశ్

image

ప్రజల మధ్య నిలబడటం అంటే పైరసీలు చేసి రాజ్యసభ సభ్యుడైనంత ఈజీ కాదని, విజయవాడ పశ్చిమ NDA కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని ఉద్దేశించి వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన రూ. వేల కోట్లలో ఎంతో కొంత సుజనా నుంచి తీసుకోవచ్చని.. NDA కూటమి నాయకులు ఆయన చుట్టూ చేరారని పోతిన వ్యాఖ్యానించారు. మాటలు తప్ప మూటలు లేవని కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారని పోతిన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.