Andhra Pradesh

News April 19, 2024

ప.గో.: 22న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా సమన్వయాధికారి భారతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు పెదవేగిలోని గురుకుల పాఠశాలకు ఈ నెల 22న ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు.

News April 19, 2024

నేడు అనకాపల్లి జిల్లాలోకి జగన్

image

ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు జాతీయ రహదారి మీదుగా జిల్లాకి చేరుకుంటారు. ఆయన జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 19, 2024

చిత్తూరు: భర్తను చంపిన భార్య

image

భార్యే భర్తను చంపిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

తూ.గో.: వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

చాగలమర్రి : రైతులకు రూ.2.34 కోట్ల టోకరా

image

చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన ఓ విత్తనాల వ్యాపారి రైతులకు కుచ్చుటోపి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మినుములు, మొక్కజొన్న తదితర విత్తనాలను, రూ.2.34 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు వాపోతున్నారు. రైతులకు ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

News April 19, 2024

చింతూరులో ఎంపీటీసీ దారుణ హత్య

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కన్నయ్య గూడెంలో ఎంపీటీసీ సభ్యుడు వర్ష బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

విజయనగరం జిల్లాలో తుపాకులు స్వాధీనం

image

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం పోలీసులు అప్రమత్తమయ్యారు. తుపాకీ లైసెన్స్‌లు కలిగిని వారందరూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ తమ ఆయుధాలను అందజేయాలంటూ పోలీసులు వారికి లేఖలు రాశారు. ఈమేరకు సంబంధిత వ్యక్తులు తుపాకులను పోలీసులకు అప్పగించారు. జిల్లాలో ఎస్బీఎల్, డీబీబీఎల్, ఫిస్టల్, రైఫిల్స్ మొత్తం 445 ఉన్నాయి. 68 మినహా మిగతా అన్ని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది.

News April 19, 2024

నెల్లూరు: ఇంటిని ఢీకొట్టిన కారు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరుకు వెళ్తున్న కారు వెంగమాంబపురం సమీపంలోని పచ్చారుచేను వద్ద అదుపు తప్పింది. ఒక ఇంటి ప్రహరీ ఢీకొట్టింది. గోడ అవతలకు వెళ్లడంతో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.

News April 19, 2024

అనంతపురం: ఈనెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

image

అనంతపురం జిల్లాలో శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈనెల 23 నుంచి డిగ్రీ పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగ అధిపతి ఆచార్య జీవి రమణ తెలిపారు. 2,4,6 సెమిస్టర్లు జరగనున్నట్లు తెలిపారు. కళాశాలల్లో పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు అందరు పరీక్షలు ప్రశాంతంగా రాసుకోవచ్చని తెలిపారు.

News April 19, 2024

ఆళ్ల నాని ఆస్తులు, అప్పులు ఎంతో తెలుసా..?

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్‌లో చరాస్తులు రూ.1,39,96,885, స్థిరాస్తులు రూ.55,60,650 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట చరాస్తులు రూ.72,69,897, స్థిరాస్తులు రూ.5,92,29,200గా పొందుపరిచారు. అప్పులు ఆయన పేరిట రూ.27,51,846, భార్య పేరున రూ.9,45,100 ఉన్నాయన్నారు.