India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. ‘నేను ఎక్కడి నుంచో రాలేదు. నేను నెల్లూరు బిడ్డనే. ఇక్కడే పుట్టి ఇక్కడే చదివా. విజయవాడ, విశాఖ, ఢిల్లీ వెళ్లినా నెల్లూరు సమస్యల పరిష్కారానికి కృషి చేశా. ప్రత్యర్థి లాగా ఇండోనేషియా, దుబాయ్లో నాకు వ్యాపారాలు లేవు. మాట ప్రకారం నెల్లూరు 47వ డివిజన్ స్వర్ణకారులకు 500 షాపులు నిర్మిస్తా’ అని ఆయన హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐదుగురు పోలీసులకు ఉగాది పురస్కారాలు దక్కాయి. అందులో గార మండలం కళింగపట్నం పోస్టల్ సెక్యూరిటీ విభాగం ఏఎస్ఐ జైమోహన్ రావు ఉత్తమ సేవా పతకం వరించింది. హెచ్ సీ ఏఆర్ ఎచ్చెర్ల నుంచి సద్గుణ మూర్తి, జి.రాజశేఖర్ ( అగ్నిమాపక శాఖ సిబ్బంది, విశాఖ), పీవీ రమణ ( ఏఎస్ఐ ఎచ్చెర్ల పీఎస్), సీహెచ్ పాపారావు ( కానిస్టేబుల్ కొత్తూరు పీఎస్) సేవా పతకాలు పొందారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 22 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫొటోలు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకి పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసును రెవెన్యూ అధికారులు ఆమెకు అందజేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 చోట్ల 2019లో తలపడిన వారు ఇప్పుడు పోటీలో లేరు. నగరిలో గాలి భాను ప్రకాశ్, రోజా.. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, బొజ్జల సుధీర్, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కిశోర్ రెడ్డి, పలమనేరులో వెంకటే గౌడ, అమర్నాథ్ రెడ్డి మాత్రమే మరోసారి పరస్పరం పోటీ పడనున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని పోటీలో ఉన్నా.. అక్కడి YCP అభ్యర్థి మారారు.
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని శిక్షించాలని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు.
గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయ తలుపులు పగుల గొట్టి, కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అబ్బాయి కోసం బాబాయ్ తగ్గినట్లు కనిపిస్తోంది. జమ్మలమడుగు టికెట్ కోసం BJP నుంచి ఆదినారాయణ రెడ్డి, TDP నుంచి భూపేశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరిదీ ఒకే కుటుంబం కావడంతో జమ్మలమడుగు టికెట్ కాకుండా కడప ఎంపీ టికెట్ అడిగినట్లు టాక్. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందో చూడాలి.
ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరు రాజకీయాలపై ఉండే ఆసక్తే వేరు. ఐదేళ్లకోసారొచ్చే ఎన్నికల పండక్కి ఎలాగైనా వచ్చి ఓటేస్తుంటారు NRI ఓటర్లు. ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,006 మంది NRI ఓటర్లు ఉంటే.. పురుషులు-790, స్త్రీలు- 215, థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. తూ.గో జిల్లాలో 442, కాకినాడ-292, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 272 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి నుంచి అధికంగా 173 మంది ఉంటే.. తుని నుంచి ముగ్గురు ఉన్నారు.
చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్ను డౌనూరు పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.