Andhra Pradesh

News June 9, 2024

వెంకటగిరిలో పినాకిని బార్ వద్ద వ్యక్తి హత్య

image

వెంకటగిరిలోని పినాకిని బార్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేశారు. పినాకిని బార్ సమీపంలో కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న నరసింహ అనే వ్యక్తి వెంకటగిరి ప్రాంతానికి చెందిన బొక్కిసం విజయ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య అనంతరం నరసింహ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, విచారణ చేపట్టారు.

News June 9, 2024

గుంటూరు MP పెమ్మసాని చంద్రశేఖర్ నేపథ్యమిదే..

image

* తెనాలి మం. బుర్రిపాలెంలో 1976 మార్చి 7న జననం
* తల్లిదండ్రులు: సాంబశివరావు, సువర్ణ
* భార్య: శ్రీరత్న, సంతానం: అభినవ్, సహస్త్ర
* 1993-94లో MBBS ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు
* HYD ఉస్మానియా To 2000లో PG కోసం అమెరికా
* USలో మెడికల్ స్టూడెంట్స్ కోసం శిక్షణ సంస్థ ప్రారంభం
* అనతి కాలంలోనే రూ.వేల కోట్లు ఆర్జన
* 2019లో నరసరావుపేట MP టికెట్ కోసం ప్రయత్నం
* 2024లో గుంటూరు MPగా 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపు

News June 9, 2024

ప్రకాశం: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెంలో బిహార్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ తాను అద్దెకు నివాసముంటున్న ఇంట్లో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అద్దంకి రూరల్ సీఐ శివరామ కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తిమ్మన్నపాలెంలోని గ్రానైట్‌లో పనిచేస్తుంటాడని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

ప్రశాంతంగా ముగిసిన లాసెట్ ఎగ్జామ్

image

రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి గానూ నిర్వహించే లాసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 250 మందికి గానూ 205 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు తెలిపారు. పరీక్షా కేంద్రం కో-ఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ సురేష్ పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు.

News June 9, 2024

రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

image

కర్నూలులోని యునైటెడ్ క్లబ్ ఆవరణలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ శమంతకమణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమను తాము రక్షించడంతో పాటు ఇతరులను రక్షించేందుకు కరాటే సాధన ఉపకరిస్తుందన్నారు. పోటీల నిర్వాహక కార్యదర్శి ఆర్.హుస్సేన్ మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు.

News June 9, 2024

వీరబల్లి: ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి

image

ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన వీరబల్లిలో జరిగింది. రాయపాటి పట్టణంలోని నయాసాబ్ వీధికి చెందిన టైలర్ షకిల్ కుమారుడు అద్నాన్(14) పదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. పుల్లగూర గండిలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అద్నాన్ మృతి చెందాడు. ఇంట్లోని పెద్ద కొడుకుని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

News June 9, 2024

రేపే Kalki 2898 AD ట్రైలర్.. విశాఖలోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విశాఖ జిల్లాలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. విశాఖలో శరత్, శ్రీ కన్య, మెలోడీలో స్క్రీనింగ్ ఉండగా.. గాజువాకలో లక్ష్మీ కాంత్, శ్రీ కన్యా స్క్రీన్-2 థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT

News June 9, 2024

రేపే Kalki 2898 AD ట్రైలర్.. విజయనగరంలోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విజయనగరం జిల్లాలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. విజయనగరంలో ఎన్‌సీఎస్, ఎస్‌వీఎస్ రంజనీ థియోటర్‌లో స్క్రీనింగ్ ఉండగా.. చీపురుపల్లిలో వంశీ, ఎస్.కోటలో శ్రీ వెంకటేశ్వర, సాలూరులో శ్రీ రామ, పార్వతీపురంలో SVC TBR థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT

News June 9, 2024

కళ్యాణదుర్గం వాసి ఆత్మహత్య

image

కళ్యాణదుర్గం మండలం మంగళకుంటకు చెందిన కురుబ నాగరాజు(34) తన వ్యవసాయ పొలంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు నాగరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.

News June 9, 2024

నంద్యాలలో ప్రశాంతంగా ముగిసిన లా సెట్ పరీక్షలు

image

నంద్యాలలో ఆదివారం నిర్వహించిన లా సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని సెట్ కన్వీనర్ తెలిపారు. 90 శాతం మేర అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. అభ్యర్థులు మాట్లాడుతూ.. గతంలో కంటే ఈసారి ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని తెలిపారు. నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారన్నారు. దీనివల్ల శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన ఒక అభ్యర్థిని పరీక్ష రాయకుండానే వెను తిరిగారని పేర్కొన్నారు.