Andhra Pradesh

News April 19, 2024

తెనాలి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

image

లంచం తీసుకుంటూ జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తెనాలి పట్టణంలో జరిగింది. తెనాలి పట్టణంలోని అమరావతి కాలనీలో ఉన్న ఉడా ఆఫీసులో సిఆర్‌డిఏ ప్లాన్ అమలు చేయడానికి జూనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 19, 2024

ప.గో.: పెరిగిన వర్జీనియా పొగాకు ధర

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు ధరలు గురువారం పుంజుకున్నాయి. A-గ్రేడ్‌ ధరలు గురువారం కిలో రూ.250 మార్క్‌ను క్రాస్‌ చేసింది. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో గరిష్ఠ ధర రూ.255, జంగారెడ్డిగూడెం కేంద్రం-1లో రూ.257, జంగారెడ్డిగూడెం కేంద్రం-2లో రూ.251, కొయ్యలగూడెంలో రూ.255, గోపాలపురంలో రూ.254 ధర పలికింది.

News April 19, 2024

కనిగిరి: దద్దాలపై 420 కేసు

image

ప్రకాశం జిల్లాలో నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. గురువారం బూచేపల్లి శివ ప్రసాద్, దద్దాల నారాయణ యాదవ్, మాగుంట శ్రీని వాసుల రెడ్డి నామినేషన్లు వేశారు. ఇందులో కనిగిరి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నామినేషన్ అఫిడవిట్లో తనపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన పేరిట రూ.70.33 లక్షలు, తన భార్య మంజు భార్గవి పేరిట రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.

News April 19, 2024

కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ..!

image

తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 2020లో జేసీ ప్రభాకర్ ఇంట్లోకి చొరబడిన ఘటనలో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు కాగా ఒక ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 5 కేసులు ఉన్నాయి. కాగా ఇతని పేరిట రూ.76 లక్షల చరాస్తులు, రూ.35 లక్షల స్థిరాస్తులు, రూ. 2.46 కోట్ల అప్పులు ఉన్నాయని సమాచారం. అయితే పెద్దారెడ్డి భార్య పేరిట రూ. 1.49 కోట్ల చరాస్తులు, రూ.13 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

News April 19, 2024

చిత్తూరు: సొంత గూటికి చేరిన రమాదేవి

image

చిత్తూరు జిల్లా తవణంపల్లె(M) ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు రమాదేవి సొంత గూటికి చేరారు. పూతలపట్టు టికెట్టు ఆశించి భంగపడ్డ ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు. శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ ఛైర్‌పర్సన్ శైలజ చరణ్ రెడ్డి, వైసీపీ ఐరాల మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి, ZPTC సుచిత్ర రమాదేవితో చర్చలు జరిపారు. దీంతో ఆమె తిరిగి వైసీపీకి మద్దతు పలికారు.

News April 19, 2024

మిథున్ రెడ్డి ఆస్తులు రూ.147 కోట్లు

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లుగా చూపించారు. అప్పులు రూ.54 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి వాహనాలు లేవని స్పష్టం చేశారు. తనకు 100 గ్రాములు, భార్య వద్ద 1.286 కేజీల బంగారం ఉన్నట్లు ప్రకటించారు..

News April 19, 2024

వెంకటగిరిపై టీడీపీలో తర్జనభర్జన

image

వెంకటగిరి టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలో ఆపార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సీటును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆశించారు. అధిష్ఠానం మాత్రం ఆయన కుమార్తె లక్ష్మీసాయి ప్రియ వైపు మొగ్గుచూపింది. కానీ రామకృష్ణకు అనుకూలంగా సర్వే రిపోర్టులు ఉండటంతో తిరిగి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలనే యోచనతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 19, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖలోని ద్వారం వారి వీధికి చెందిన బర్రే మధవ్ (20), అనకాపల్లికి చెందిన లాలం సతీశ్ (20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. గండేపల్లి మ. రామేశంపేటలో గది అద్దెకి తీసుకొని ఉంటున్నారు. ముగ్గురు గురువారం రాత్రి పెద్దాపురానికి బైక్‌పై వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

News April 19, 2024

ప.గో.: నామినేషన్లు START.. ఖరారవ్వని కూటమి అభ్యర్థి

image

నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైనప్పటికీ ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకుండా ఉంది. ఓ వైపు నియోజకవర్గంలోని ఆకివీడులో మంతెన రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ RRR ఈ నెల 22న నామినేషన్ వేస్తానని.. ఏస్థానం నుంచి అనేది తర్వాతనే చెబుతానని ఇటీవల ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు తమ నాయకుడికి టికెట్ వస్తుందో లేదోనన్న సంశయంలో ఉన్నారు.
– మీ కామెంట్..?

News April 19, 2024

పెందుర్తి: ఏసీబీకి చిక్కిన పంచాయతీ అధికారులు

image

విశాఖపట్నం పెందుర్తిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెందుర్తి పంచాయతీ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ వి. సత్యనారాయణ, అసిస్టెంట్ పవన్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఇంటి ప్లాన్ అనుమతి కొరకు నిందితులు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.