India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన << 13079053>>రోడ్డుప్రమాదంలో <<>>ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓకళాశాలలో విశాఖపట్నంకు చెందిన మాధవ్(20), అనకాపల్లికి చెందిన సతీష్(20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. రామేశంపేటలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పనినిమిత్తం పెద్దాపురం వెళ్లి తిరిగొస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. మాధవ్, సతీష్ అక్కడికక్కడే మృతిచెందారు.
అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుపార్టీల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వర్ల కుమార్ రాజాపై 10 కేసులు, అప్పులు రూ.29 లక్షలు. నల్లగట్ల స్వామిదాసుపై కేసులు లేవు, అప్పులు రూ.17.50 లక్షలు. యార్లగడ్డ వెంకట్రావుకు వివిధ అభియోగాల కింద 9 కేసులు, స్థిర, చరాస్తులు రూ.157.850 కోట్లు ఉన్నాయి.
అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలికాఫ్టర్లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్ సెంటర్ కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
➤నియోజకవర్గం పేరు: పాణ్యం
➤పోలింగ్ బూత్ల సంఖ్య: 340
➤మొత్తం ఓటర్లు: 322494
➤పురుషులు: 1571130
➤మహిళలు : 165306
➤ఇతరులు: 75
➤రిటర్నింగ్ అధికారి: జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024
ఎల్.కోటలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రాజు అనే వ్యక్తి పై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజు పోలీసులు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు రాజు సోంపురం సమీపంలో గల ఓ పొలంలో గురువారం శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి రాజుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.
టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు. ఈక్రమంలో తమ ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. ఇందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లని చెప్పారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రశాంతిపై ఎలాంటి కేసులు లేవు.
ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?
నిత్యం అనుమానంతో వాలంటీరును వేధిస్తూ.. గృహ హింస పెడుతున్న భర్తపై ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, వెంకటరావు భార్యాభర్తలు. సునీత వాలంటీరుగా పనిచేస్తుండగా.. వెంకటరావు మందుల దుకాణంలో పని చేస్తున్నారు. బుధవారం ఇంటికి వచ్చి భార్యపై భౌతిక దాడికి దిగాడు. గాయపడిన సునీత ఫిర్యాదు మేరకు వెంకటరావుపై గృహహింస కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 24తో గడువు ముగిస్తుందని శ్రీకాకుళం ఆర్ఐఓ పి. దుర్గారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా ఈనెల 24లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మే 1 నుంచి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని.. నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ కార్పొరేషన్ 5వ వార్డు సాయిరాం కాలనీలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావే తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నారని.. అనకాపల్లి నుంచి తాను ఎంపీగా పోటీ చేయడమనేది అవాస్తవమని చెప్పారు.
Sorry, no posts matched your criteria.