Andhra Pradesh

News April 19, 2024

గన్నవరం గడ్డపై పాగా వేసేదెవరో..

image

గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.

News April 19, 2024

జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి మార్పు..?

image

చిత్తూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు జరిగేటట్లు తెలుస్తోంది. ప్రముఖ డాక్టర్ వీఎం థామస్‌కు చంద్రబాబు జీడీనెల్లూరు టికెట్ కేటాయించారు. ఆయన మత మార్పిడి కారణంగా ఎస్సీ సామాజికవర్గంలోకి రారని.. నామినేషన్ చెల్లదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ గురువారం జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన 1994లో వేపంజేరి MLAగా గెలిచారు.

News April 19, 2024

కడప: భూపేశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

కడప పార్లమెంట్‌కు TDP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేశ్ రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు PCలో నమోదైన SC, ST కేసులో పోలీసులు ఛార్జ్ సీటు వేయలేదని, జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. శిక్ష పడిన కేసులు లేవని వెల్లడించారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రెండు లక్షల బ్యాంకు డిపాజిట్లు చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

24 గంటలు అందుబాటులో ఉండేలా పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్

image

24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఎన్నికలకు పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్- 9440796385, 9392903413, 0861-2328400 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ
K.ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు .

News April 19, 2024

ఏలూరు జిల్లాలో రూ.6,52,000 నగదు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 145.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా.. దాని విలువ ₹.4,340 ఉంటుందన్నారు. అలాగే FST వారు స్వాధీనం చేసిన నగదు ₹.6,52,000 ఉన్నట్లు తెలిపారు.

News April 19, 2024

సీఎం కాన్వాయ్‌లో మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం

image

సీఎం జగన్ బస్సు యాత్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో లేని విధంగా సీఎం కాన్వాయ్ లో డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ సిస్టం ఏర్పాటు చేశారు. గురువారం తణుకు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్రలో ఈ విధానం ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే కాన్వాయ్ కు ముందుగా రెండు కిలోమీటర్ల మేర ఫొటోలు, వీడియోలః ద్వారా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఈ సిస్టం ద్వారా కలుగుతుంది.

News April 19, 2024

విజయవాడ: ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీసు విడుద‌ల‌

image

విజ‌య‌వాడలో సాధార‌ణ ఎన్నిక‌లు 2024లో భాగంగా పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీస్‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి ఎస్‌. డిల్లీరావు గురువారం ఉద‌యం విడుద‌ల చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నామినేష‌న్లు స్వీక‌రిస్తున్నామని తెలిపారు.

News April 19, 2024

2024 ఎలక్షన్.. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం రౌండప్

image

➤నియోజకవర్గం పేరు: కోడుమూరు
➤పోలింగ్ బూత్ల సంఖ్య: 275
➤మొత్తం ఓటర్లు: 219639
➤పురుషులు: 109673
➤మహిళలు : 109943
➤ఇతరులు: 23
➤రిటర్నింగ్ అధికారి :
➤కర్నూలు రెవిన్యూ డివిజనల్ అధికారి శేషి రెడ్డి
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024

News April 19, 2024

నర్సీపట్నం: నేడు నామినేషన్ వేయనున్న అయ్యన్నపాత్రుడు

image

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పదో సారి ఎమ్మెల్యే బరిలో ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అయ్యన్న తన ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్ల జంక్షన్, కృష్ణా బజారు, అబీద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం చేరుకొని అక్కడ నామినేషన్ వేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయాలని వారు కోరారు.

News April 19, 2024

అనంత: చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ఠ ధర రూ.37 వేలు పలికింది. కనిష్ఠ ధర రూ.19 వేలు, సరాసరి ధర రూ.26 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ కు మొత్తం 991 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. .