Andhra Pradesh

News June 9, 2024

రికార్డు బ్రేక్ చేసిన దామచర్ల జనార్దన్

image

ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్లపై 32,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎన్నికల్లో అదే అత్యధిక రికార్డు. కానీ 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ బాలినేనిపై 34,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్లదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.

News June 9, 2024

కర్నూలు: ఎస్సార్ బీసీ కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఆదివారం పోలీసుల తెలిపిన వివరాలు.. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన మక్బుల్ బాషా(25) ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకోవడానికి పోలానికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ బీసీ కాలువలో పడింది. ఈ ఘటనలో మక్బుల్ కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News June 9, 2024

విగ్రహాలను తొలగించడం సమంజసం కాదు: ప్రియాంక దండి

image

రేపు అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

News June 9, 2024

నూజివీడులో సర్పంచ్ అనుమానాస్పద మృతి

image

మండలంలోని తూర్పు దిగవల్లి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..‌ సుమారు రూ.30 కోట్ల వరకు ఎన్నికల బెట్టింగ్ కట్టాడని, అనంతరం కనిపించకుండా పోయాడని అన్నారు. నేడు మల్బరీ షెడ్‌లో అనుమానస్పదస్థితిలో శవమై కనిపించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు అనుమానస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 9, 2024

మహిళా కోటాలో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి?

image

నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 8 నియోజకవర్గాలు(గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలిశాయి) ఉన్నాయి. ఇందులో మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒక్కరే. జిల్లాలో పలువురు సీనియర్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా.. మహిళా కోటాలో ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని వేమిరెడ్డి అనుచరులు కోరుతున్నారు. కేంద్రంలో వేమిరెడ్డికి మంత్రి పదవి రాలేదని.. రాష్ట్రంలో ఆయన భార్యకు ఇవ్వాలని పట్టుబడుతున్నారంట.

News June 9, 2024

జీలుగుమిల్లి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మండలంలోని ధర్భగూడెం గ్రామంలో వీర భద్రస్వామి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ మృతుని వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు. 

News June 9, 2024

తిరుపతి: PG కోర్సుల్లో దరఖాస్తులకు రేపు చివరి తేదీ

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ (PG) ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగ థెరపి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. CUET ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://nsktu.ac.in వెబ్ సైట్ చూడగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.

News June 9, 2024

కర్నూలులో ఆర్టీసీ బస్సు ఢీకొని మెడికల్ స్టూడెంట్ దుర్మరణం

image

కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లికి తేజేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఆదివారం ఉదయం మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదువుకొని హాస్టల్‌కి బైక్‌పై వెళుతుండగా బుదవారంపేట పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 9, 2024

పార్వతీపురం: బావిలో పడి వ్యక్తి మృతి

image

బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటు చేసుకుంది. సీబిల్లికి చెందిన వడ్డి నాగేశ్వరరావు (53) ఈనెల7 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం పాతకాముడువలస సమీపంలో బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.

News June 9, 2024

అనంత: ఆర్టీసీ బస్సు ఢీకొని మెడికల్ విద్యార్థి మృతి

image

రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామానికి తేజేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల మధ్యలో మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదువుకొని హాస్టల్‌కి బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు.