Andhra Pradesh

News April 19, 2024

ఆదోనిలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

image

పీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రెడ్డి ఈనెల19న చేప‌ట్టే బ‌స్సు యాత్ర‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కాంగ్రెస్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య బుధవారం ఆదోనిలో తెలిపారు. ఆలూరు నుంచి ఆదోని మీదుగా ఆలూరు రోడ్డులో కల్లుబావి వ‌ద్ద‌ శ్రీలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో మధ్యాహ్నం బస చేసి సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ రోడ్డు గుండా యాత్ర సాగుతుందన్నారు.

News April 19, 2024

ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కారం

image

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24 లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు.
గురువారం ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని అన్నారు.

News April 19, 2024

తొలి రోజు ప్రకాశం జిల్లాలో 13 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నలుగురు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి అసెంబ్లీకి నలుగురు, ONG, కొండపి, గిద్దలూరు, కనిగిరి, SNపాడు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైపాలెం, MRKP అసెంబ్లీకి నామినేషన్ దాఖలు కాలేదు.

News April 19, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

News April 19, 2024

చిత్తూరు: వైసీపీకి సినీ విలన్ మద్దతు

image

చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.

News April 18, 2024

ప్రకాశం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిస్వాస్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిస్వాస్ నియమిస్తూ ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు దూకే బిస్వాస్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిశారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.

News April 18, 2024

సీఎంగా విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం: బొత్స

image

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.

News April 18, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జనవరి 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షలకు (2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు, ఏప్రిల్ 23వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News April 18, 2024

ముద్రగడ ఓ పెద్ద దరిద్రం: నటుడు పృథ్వీరాజ్

image

పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.

News April 18, 2024

జనసేనాని ఉమ్మడి ప.గో పర్యటన షెడ్యూల్ ఖరారు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీన భీమవరం, నరసాపురం.. 22వ తేదీన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు.. 30వ తేదీన పోలవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.