India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు పండితులు, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహుర్తాలు చూడాలని కోరుతున్నారు. పంచాంగం ప్రకారం ఈనెల 18, 19, 22, 23, 24 తేదీలు బాగున్నాయని పండితులు అంటున్నారు. కొందరు సెంటిమెంట్తో పాటు వారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా శుభఘడియలు నిర్ణయించుకుంటున్నారు.
ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసే సాధారణ(ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చొప్పున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఉమ్మడి ప.గో.జిల్లాలో బీసీవై తరఫున పోటీ చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల రెండో విడత జాబితా..ఎంపీ అభ్యర్థుల తొలి విడత జాబితాను గురువారం పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిగంట వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపీగా బైరబోయిన మాల్యాద్రి నియమితులయ్యారు. సామాజిక న్యాయానికి, అన్ని వర్గాల సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ.. అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థులను బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. ఏలేశ్వరంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నైనాలశెట్టి మూర్తి ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ ఎంపీగా బుగతా బంగార్రావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఏగుపాటి అర్జునరావు, తుని ఎమ్మెల్యే స్థానానికి శివ పోటీ చేస్తారని ఆయన చెప్పారు.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 పార్లమెంటు, 21 అసెంబ్లీ నియోజకవర్గల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికలు సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. లోక్సభ అభ్యర్థి రూ.25,000 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10,000 వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 % ధరవత్తు ఉంటుంది.
మడకశిరలో వైఎస్ షర్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి కే. సుధాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్వాగతం పలికారు. మడకశిర పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొంటున్నారు. ఈ సభలో పాల్గొనడానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారని అన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్, నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాడు బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థిగా స్తోత్రరాణి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
MPగా పోటీ చేసే అభ్యర్థులు ఫారం-2ఎ, MLAగా పోటీ చేసే వాళ్లు ఫారం-2బీ ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులందరూ నవీకరించిన ఫారం-26 అఫిడవిట్ను ఖాళీలు లేకుండా పూర్తి చేసి నామినేషన్ పత్రంతో జతచేయాలి . పోటీ చేసే అభ్యర్థి లేక ప్రతిపాదకుడు నామినేషన్ దాఖలు చేయవచ్చని కలెక్టర్ బాలాజీ తెలిపారు. MPఅభ్యర్థి రూ.25వేలు, MLAఅభ్యర్థి రూ.10వేలు, SC, STలు రూ.12,500, రూ.5వేల డిపాజిట్ చేయాలని చెప్పారు.
ఎన్నికల అధికారులమంటూ నమ్మించి వాహన తనిఖీల పేరుతో మంగళాపురం మాజీ సర్పంచ్ అల్లంకి వెంకటప్పారావు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దోచుకున్నారు. అల్లంకి బుధవారం స్కూటీపై వెళుతుండగా, విజయరామరాజుపేట దాటాక ఇద్దరు బైకుపై వచ్చి అడ్డగించి బ్యాగు తీసుకుని తనిఖీ చేశారు. ఆయన ధరించిన బంగారు చైన్, ఉంగరాలు, బ్రాస్లైట్ తీసి బ్యాగులో వేస్తున్నట్లు వేసి వారి జేబులో వేసుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆర్డీవో, శ్రీకాకుళం, ఆమదాలవలస తహశీల్దారు కార్యాలయం, పాతపట్నం తహశీల్దారు కార్యాలయం, ఇచ్ఛాపురం తహశీల్దారు కార్యాలయం, పలాస తహశీల్దార్ కార్యాలయం, టెక్కలి తహశీల్దారు, నరసన్నపేట, ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యాలయాలో నామపత్రాలు స్వీకరిస్తారు. నామపత్రాలు నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు. 26న అధికారులు నామపత్రాలను పరిశీలిస్తారు.
Sorry, no posts matched your criteria.