India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్మోహన్ రెడ్డి బస చేసిన తణుకు మండలం తేతలి గ్రామంలోని శిబిరం వద్ద సందడి నెలకొంది. మరికొద్ది కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్నికల సంఘం కోరడంతో 3వ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం మూడో పట్టణ పోలీస్ స్టేషన్కి చెందిన ఒక అధికారి న్యాయ కళాశాలకు వెళ్లి అధికారులను విచారించినట్లు తెలిపారు.
గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవంతి(13) అనే బాలిక పాముకాటుతో మృత్యువాత పడింది. ఆసుపత్రికి తరలించేలోపు బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ అమరనాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 690 గ్రామాలు ఉండగా ఇప్పటికే.. 662గ్రామాల్లో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో వారం వ్యవధిలో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 1,53,500 మందికి పనులు కల్పించాలనేది లక్ష్యం కాగా.. 98,058 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కొమ్మమూరు కాలువలో మునిగి విద్యార్థి మృతిచెందాడు. నర్సరావుపేటకు చెందిన వంశీకృష్ణ వడ్లమూడిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తాను మరో ముగ్గురితో కలసి సంగం జాగర్లమూడి సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద కాల్వకు బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతుండగా.. వంశీకృష్ణ మునిగిపోగా.. రాత్రికి మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఓపిఓ , మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు రాజమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసామని టర్నింగ్ అధికారి, జెసి తేజ్ భరత్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పోస్టల్ బ్యాలెట్ సేకరణ కేంద్రంలో ఫారం-12, ఎన్నికల విధుల ఉత్తర్వు పత్రం, ఆధార్, గుర్తింపు కార్డు అందించాలన్నారు.
సరైన పేపర్లు లేకుండా తరలిస్తున్న డబ్బును అలిపిరి పోలీసులు సీజ్ చేశారు. సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ వాహనాలు తనిఖీ చేశారు. కాటన్ మిల్లు వద్ద బైకుపై తీసుకెళ్తున్న రూ.12.98 లక్షలు పట్టుకున్నారు. మంగళం రోడ్డు డీమార్ట్ వద్ద రూ.1.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో మరో రూ.2 లక్షలు పట్టుబడింది. మొత్తంగా రూ.16.97 లక్షలు సీజ్ చేసి ఇన్కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.
నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.
రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.
ఇవాల్టి నుంచి నెల్లూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కలెక్టర్ హరినారాయణన్ కీలక సూచనలు చేశారు. ‘అన్ని రాజకీయ పార్టీల నేతలకు కొత్త నామినేషన్ పేపర్లు ఇచ్చాం. ఎటువంటి తప్పులు లేకుండా, ఖాళీలు పెట్టకుండా అన్ని వివరాలు పొందుపరచాలి. ఫాం-ఏ, బీ పత్రాలపై ఇంకుతోనే సంతకం పెట్టాలి. తాజా అఫిడవిట్ పత్రాలను అందజేయాలి. నామినేషన్ వేసే ఆఫీసులోకి నలుగురినే అనుమతిస్తాం’ అని ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.