Andhra Pradesh

News April 18, 2024

పెదగోగాడ గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి

image

గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి చెందినట్లు చీడికాడ ఎస్సై జి.నారాయణరావు బుధవారం తెలిపారు. బుచ్చెయ్యపేట మం. పి.భీమవరంకి చెందిన పడాల వరహాలు ఆర్మీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి సెలవుపై స్వగ్రామం వచ్చిన వరహాలు దేవరాపల్లి మం. వాకపల్లిలో అత్తవారింటికి బయలుదేరాడు. పెదగోగాడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో పడిపోయాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.

News April 18, 2024

అనంత: ఇద్దరు ఉద్యోగులపై వేటు

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్  అయిన వారిలో యల్లనూరు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇ.విజయకుమారి, కూడేరు మండలం గొటుకూరు గ్రామ సీనియర్ మేట్ ఎన్. జయప్ప ఉన్నారు. అలాగే పలు చోట్ల ఎస్ఎస్ఈ బృందాలు రూ.2.80 కోట్ల నగదును సీజ్ చేశారన్నారు.

News April 18, 2024

గార: వత్సవలసలో పిడుగుపాటుకు మహిళ మృతి

image

పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వత్సవలస పంచాయతీ మొగదాల పాడు గ్రామానికి చెందిన కుందు భాగ్యలక్ష్మి (39) బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆరేసిన దుస్తులు తీసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. భాగ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని గార ఎస్సై కె. కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

News April 18, 2024

నేటి నుంచి నామినేషన్లు మొదలు: ముకేశ్ కుమార్‌ మీనా

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

News April 18, 2024

గుంటూరు కలెక్టరేట్‌లో భద్రతా చర్యల పరిశీలన 

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి కలెక్టరేట్లో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో అభ్యర్థులకు ఏర్పాట్లు, ఇతరులు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి రాకుండా చేసిన భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. పరిశీలనలో డీఆర్‌ఓ పెద్ది. రోజా, తదితరులు పాల్గొన్నారు. 

News April 18, 2024

బందోబస్తు పర్యవేక్షణకు పోలీసు అధికారులు

image

నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఆర్వో ఆఫీసు వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను DSPలకు అప్పగించారు. నెల్లూరు ఎంపీ నామినేషన్ కేంద్రం వద్ద ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు సిటీలో శ్రీనివాసులు రెడ్డి, రూరల్‌లో రామకృష్ణాచారి , కోవూరులో శ్రీనివాసులు, సర్వేపల్లిలో వీరాంజనేయరెడ్డి, ఆత్మకూరులో కోటారెడ్డి, కావలిలో వెంకటరమణ, ఉదయగిరిలో సాయినాథ్ పర్యవేక్షిస్తారు.

News April 18, 2024

ఎర్నాకుళం-పాట్నా మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకులం-పట్నా -ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 19 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం దీనిని నడపనున్నట్లు తెలిపారు. ఇది దువ్వాడ మీదుగా పట్నా వెళుతుందన్నారు. అలాగే ఈనెల 22 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం పట్నాలో బయలుదేరి దువ్వాడ మీదగా ఎర్నాకుళం వెళుతుందన్నారు.

News April 18, 2024

తూ.గో: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుల అరెస్టు

image

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు గుత్తుల శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమార్ గతేడాది డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడి జైలుకు పంపారు. అయినా అతనిలో మార్పు రాలేదు.

News April 18, 2024

ప్రకాశం జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!

image

☞ ఒంగోలు MP: ఒంగోలు కలెక్టర్ ఆఫీసు
☞ ఒంగోలు MLA: ఒంగోలు RDO ఆఫీసు
☞ కనిగిరి MLA: కనిగిరి RDO ఆఫీసు
☞ మార్కాపురం MLA: ఉప కలెక్టర్ ఆఫీసు
☞ సంతనూతలపాడు MLA: చీమకుర్తి తహశీల్దార్ ఆఫీసు
☞ యర్రగొండపాలెం MLA: స్త్రీ శక్తి భవన్
☞ గిద్దలూరు MLA: గిద్దలూరు MRO ఆఫీసు
☞ కొండపి MLA: కొండపి MRO ఆఫీసు
☞ చీరాల MLA: చీరాల MRO ఆఫీసు
☞ పర్చూరు MLA: పర్చూరు RDO ఆఫీసు
☞ కందుకూరు MLA: సబ్ కలెక్టర్ ఆఫీసు

News April 18, 2024

ప.గో: ఈనెల 19న నామినేషన్లు వేసేది వీరే…

image

ప.గో.జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనుంది.. ఈ క్రమంలో ఈ నెల 19న ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ముదునూరి ప్రసాద్ రాజు, నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ నుంచి కొలుకులూరి అర్జునరావు, నరసింహారాజు, ఆచంటలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.