Andhra Pradesh

News April 18, 2024

శ్రీకాకుళం: నామినేషన్.. ఇవి తప్పక గుర్తించుకోండి

image

* అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ అభ్యర్థి జిల్లా కేంద్రంలో నామపత్రాలు పత్రాలు సమర్పించాలి. *నిబంధనల ప్రకారం అధికారిక సెలవు రోజుల్లో మిగిలిన అన్ని రోజుల్లోనూ నామపత్రాలను స్వీకరిస్తారు. * ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటారు *రిటర్నింగ్ అధికారి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వీడియోగ్రఫీ చేస్తారు. * కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

News April 18, 2024

అనంత: వందేభారత్‌పై రాళ్ల దాడి

image

కాచిగూడ- యశ్వంతపుర మధ్య నడిచే వందేభారత్ పై దాడి జరిగింది. పామిడి-కల్లూరు మధ్య బుధవారం ఉదయం వందేభారత్ రాగానే కొందరు ఆకతాయిలు సీ4 బోగీపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. గతంలో ధర్మవరం- బత్తలపల్లి సమీపంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడగా, ఆ తర్వాత అనంతపురం సమీపంలో మరోసారి అదే రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

News April 18, 2024

స్వతంత్ర అభ్యర్థి‌గా నామినేషన్ వేస్తా: జయరాజు

image

బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నేడు (గురువారం) నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కురుపాంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అరకు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు జయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు హాజరవ్వాలని కోరారు. 

News April 18, 2024

తెనాలి: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌నని బెదిరిస్తున్న వ్యక్తి.. కేసు నమోదు

image

పట్టణంలోని హోటల్ వ్యాపారస్థులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హోటల్ యాజమానులకు ఫోన్ చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నాడు. తెనాలి హోటల్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెనాలి 2టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశామన్నారు.  

News April 18, 2024

తూ.గో జిల్లాలోకి సీఎం జగన్ బస్సుయాత్ర

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ప.గో జిల్లా తణుకులో గురువారం ప్రారంభమయ్యే యాత్ర పెరవలిలో తూ.గో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, జొన్నాడ మీదుగా కడియం చేరుతుంది. మధ్యాహ్నం కడియపులంకలో భోజనం అనంతరం మోరంపూడి కూడలి మీదుగా రాజమండ్రి నగరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే రాజానగరం నియోజకవర్గంలోకి వెళ్లనుంది.

News April 18, 2024

నేను దైవ దర్శనానికి వెళ్లా: దస్తగిరి

image

వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ MLA అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తనపై కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను దైవదర్శనం నిమిత్తం వేరే ఊరు వెళ్తే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు రాయడం సరికాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

News April 18, 2024

నెల్లూరు: ఇష్టదైవాలకు పూజలు

image

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాబోతోంది. ఈక్రమంలో అభ్యర్థులు ముందుగా ఇష్టదైవాలకు పూజలు చేశాక నామినేషన్ కేంద్రాలకు వెళ్లనున్నారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి తిరుమలలో, వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇంట్లో పూజలు చేసి ఆర్వో కార్యాలయానికి రానున్నారు. కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామదేవత కళుగోళ శాంభవిని దర్శించాక బయలుదేరుతారు.

News April 18, 2024

ప్రచారం పేరిట కబ్జాలు చేస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి

image

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం పేరిట భూకబ్జాలు, సహజవనరులు దోచుకుంటున్నాడని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానిక BJP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్యకేసు CM జగన్ దంపతులకు తెలియకుండా జరిగుండదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తానని ఆది హామీ ఇచ్చారు.

News April 18, 2024

నలుగురికే అనుమతి: చిత్తూరు SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని చిత్తూరు ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

News April 18, 2024

కృష్ణా: మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తి అరెస్ట్

image

కంకిపాడులో ఓ మైనర్ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశామని కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కంకిపాడుకి చెందిన వంగా ప్రవీణ్ అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్సై సందీప్ చెప్పారు.