Andhra Pradesh

News April 17, 2024

సింహాచలంలో మే 4 వరకు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఈనెల 18 నుంచి మే 4వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు అన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 18 నుంచి ఈనెల 25 వరకు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని తెలిపారు. 24న పుష్పయాగం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

VZM: బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ

image

బీజేపీ యువమోర్చా నాయకులు, మాజీ MLA నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో జయరాజు వ్యతిరేక గళం విప్పారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అదిష్ఠానం జయరాజును పార్టీ నుంచి సస్పెండ్‌తో పాటు ప్రాథమిక సభ్యుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ పాకా సత్యన్నారాయణ రాజు తెలిపారు.

News April 17, 2024

ప.గో: సివిల్స్‌లో సత్తా చాటిన నవ్యశ్రీ

image

తాడెపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ పూర్వ విద్యార్థి గోవాడ నవ్యశ్రీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 995వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. నాలుగో సారి రాసిన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడంతో పాటు ఐఆర్ఎస్ ర్యాంకు అధికారిగా ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నట్టు నిట్ వర్గాలు తెలిపాయి. ఆమెను నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ మూర్తి, అధ్యాపకులు అభినందించారు.

News April 17, 2024

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

నరసరావుపేట కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులతో ఎన్నికల సన్నద్ధపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ కమిట్మెంట్‌, డెడికేషన్‌తో విధులు నిర్వహించాలన్నారు. సీ విజిల్ యాప్ అమలులో జిల్లా ముందు వరుసలో పల్నాడు జిల్లా ఉందని అన్నారు.

News April 17, 2024

శ్రీకాకుళం: అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య

image

నియోజకవర్గ పరిధి రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి శ్రీధర్ (38) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మునసబుపేట సమీపంలోగల ఓ లేఅవుట్ వద్ద మృతి చెందిన విషయాన్ని స్థానికులు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై ఎం.వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2024

తూ.గో: వైసీపీకి ఇద్దరు ప్రముఖుల రాజీనామా

image

కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.

News April 17, 2024

VIDEO: సమస్యలను పరిష్కరించాలని విరుపాక్షిని  గ్రామస్థుల నీలదీత

image

ఆస్పరిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షిని గ్రామస్థులు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని, సమస్యలను ఎందుకు పరిష్కరించలేదంటూ ఎన్నికల ప్రచారానికి
వచ్చిన విరుపాక్షిని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ సముదాయించటానికి ప్రయత్నించినప్పటికీ
వినకపోవడంతో విరుపాక్షి అక్కడి నుంచి వెనుదిరిగారు.

News April 17, 2024

ఆనం చరిత్రహీనుడు: విజయసాయి రెడ్డి

image

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డే టార్గెట్‌గా YCP నెల్లూరు MP అభ్యర్థి విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శులు చేశారు. ‘TDP నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆనంకి రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చి పెద్దోడిని చేసింది YSR. జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్‌ అధిష్ఠానం కుట్రలో భాగస్వామి అయ్యాడు. మళ్లీ జగన్ పంచన చేరి MLA అయినా వెన్నుపోటు గుణాన్ని పోనిచ్చుకోలేదు. ఈ వయసులో పార్టీ మారి చరిత్రహీనుడయ్యాడు’ అని ట్వీట్ చేశారు.

News April 17, 2024

నర్సీపట్నంలో టాలీవుడ్ హీరో ప్రచారం

image

మాకవరపాలెం మండలంలోని కొండల అగ్రహారంలో సినీ హీరో, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సోదరుడు సాయిరాం శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి ఆయన ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గణేష్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీ సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News April 17, 2024

పిడుగురాళ్లలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం పోలేరమ్మ గుడి వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుదని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలన్నారు.