India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ఉన్నారు.
DSCలో ఎంపికైన అభ్యర్థులకు 25న విజయవాడలో సీఎం నియామక పత్రాలను అందజేయమన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డీఈవో రవిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 6 గంటలకు, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కు అభ్యర్థులు చేరుకోవాలని, 37 ప్రత్యేక బస్సుల్లో విజయవాడు చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారానికి హెలికాప్టర్ రైడ్ చేసేందుకు 92 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా 158 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నేటి నుంచి 25 వరకు వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రైడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
భీమవరం డివిజన్కు సంబంధించిన ఇ-డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవచ్చునని కలెక్టర్ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తును అందుబాటులో ఉంచామన్నారు. వాటిని పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధృవీకరించబడిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి సిసికి అందజేయాలన్నారు. అక్టోబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు అందరూ APSADA Act – 2020 ప్రకారం తమ చేపల చెరువులను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు లైసెన్సులు పొందాలని ఆమె స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశించారు.
కడప జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు గౌరవ హోదా లభించింది. ప్రొద్దుటూరు, బద్వేల్ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు అందుబాటులో లేనప్పుడు వీళ్లు స్పీకర్ స్థానంలో ఉండి అసెంబ్లీని నడిపిస్తారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారిగా ఏవి సూరిబాబు ఇటీవల నియమితులయ్యారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణిను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అన్ని వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు.
ప్రకాశం జిల్లాకు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఈ కార్యక్రమ ప్రారంభానికి పవన్ వస్తారని సమాచారం. అమరావతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు చర్చించారు.
నెల్లూరు విజయ డెయిరీలో రెండు మహిళా డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఆ రెండు పదవులకు ఇద్దరు మహిళలు మాత్రమే నామినేషన్ దాఖాలు చేశారు. దీంతో ఆ రెండు పదవులు ఏకగ్రీవమాయ్యాయి. వీటిల్లో కొడవలూరు మండలం రేగడిచెలికకు చెందిన గుర్రం నాగేశ్వరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాబాపురం పాల సొసైటీకి చెందిన సాయి నిరోషా ఏకగ్రీవమయ్యారు. అయితే ఎన్నికల అధికారి వీరి పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్లాట్ ఫాంపై ఉన్న ఫుడ్ కోర్టులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. రిజర్వేషన్ కేంద్రాలను, టికెట్ బుకింగ్ కౌంటర్ లను,క్యాప్సిల్ హోటల్ను సందర్శించి పలు సూచనలు చేశారు. రానున్న దసరా సెలవు దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యాలు అందించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.