India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు
ముంబై నటీ జెత్వానీ కేసులో గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయవాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు.
విజయవాడ దసరా ఉత్సవాలలో VIP దర్శనాలకు ప్రత్యక యాప్ అందుబాటులోకి తెచ్చి 21 కేటగిరిల్లో పాస్లు ఇచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ పాస్లు కేవలం దర్శనం కోసమేనని, వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదన్నారు. ఈ పాస్లు ఉన్నవారు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్లలో ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుస్తామని కలెక్టర్ చెప్పారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
పుంగనూరులో అస్పియా అంజుమ్(7) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉబేదుల్లా కాంపౌండ్ వద్ద బాలిక మిస్ అయినట్లు గుర్తించి చెంగ్లాపురం రోడ్డు పరిసరాల్లో పోలీసు జాగీలాలతో సోమవారం గాలించారు. డీఐజీ షేముషఇ భాజ్పాయి మంగళవారం పుంగనూరు వచ్చి బాధితులతో మాట్లాడారు. బుధవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో బాలిక శవమై కనిపించింది.
ఈ రోజు నుంచి జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రావడం నిషేధం.
ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు(సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.