Andhra Pradesh

News March 13, 2025

15న కొండబిట్రగుంటకు రానున్న సింగర్ సత్యయామిని

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్యయామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

News March 13, 2025

కృష్ణా జిల్లాలో నేడు వడగాల్పులు

image

కృష్ణా జిల్లాలో గురువారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలో పలు మండలాలకు హైఅలర్ట్ ప్రకటించింది. బాపులపాడు 40.7°, గన్నవరం 41.7, కంకిపాడు 40.6°, నందివాడ 40°, పెదపారుపూడి 40.4, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 41.4°, ఉయ్యూరు 40.6° ఉష్ణోగ్రతలు ఉండనున్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 13, 2025

విశాఖ: సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 

image

విదేశాలలో చైనాకు సంబంధించిన ఫేక్ కంపెనీలలో పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు దోచుకున్న వ్యక్తి విశాఖ పోలీసులకు చిక్కాడు. అనకాపల్లికి చెందిన నిందితుడు చొప్పా ఉమా మహేశ్‌ను సైబర్ పోలీసులు బుధవారం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అనకాపల్లి వచ్చి తిరిగి వెళ్తుండగా చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

News March 13, 2025

శ్రీకాకుళం: నేడు ఈ మండలాలకు ఆరంజ్ అలర్ట్ 

image

శ్రీకాకుళం జిల్లాలో గురువారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.*పోలాకి 37.6*నరసన్నపేట 37.8 *జి.సిగడం 40.6*ఎచ్చెర్ల 37.6* శ్రీకాకుళం 38*లావేరు 38.4 *పోలాకి 37.6*పొందూరు 39.6

News March 13, 2025

జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో..?: స్వామి

image

జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.

News March 13, 2025

నరసాపురం: బాలికపై లైంగికదాడి.. జీవితఖైదు

image

నరసాపురంలో ఒకరి జైలుశిక్ష పడింది. సీఐ బి.యాదగిరి వివరాల ప్రకారం.. నరసాపురం అరుంధతిపేటకు చెందిన పెడరి నర్సింహరాజు పార్కు రోడ్డులో టాయిలెట్లు శుభ్రం చేసేవాడు. ఈక్రమంలో 2017లో ఓ మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. భీమవరం ఫొక్సో కోర్టు జడ్జి B.లక్ష్మీనారాయణ 18మంది సాక్షులను విచారించారు. నర్సింహరాజుకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధితురాలకి రూ.50వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు. 

News March 13, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. అలాగే రేపటి నుంచి రీవాల్యుయేషన్ కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

News March 13, 2025

2025లో చంద్రగ్రహణం లేదు: కడప అర్చకులు

image

ఈ నెల 14వ తేదీ చాలామంది చంద్రగ్రహణం ఉందని భావిస్తున్నారు. కానీ 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అర్చక పురోహితులు విజయ భట్టర్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. పండితులు సిద్ధాంతాలు పంచాంగ కర్తలు ప్రకారం ఈ సంవత్సరంలో ఎటువంటి సూర్య, చంద్ర గ్రహణాలు మన దేశానికి వర్తించవని స్పష్టం చేశారు.

News March 13, 2025

భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

image

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

News March 13, 2025

VZM: కేంద్ర మంత్రితో ఎంపీ కలిశెట్టి భేటీ

image

ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.