Andhra Pradesh

News March 19, 2024

జనసేనకు ‘గోదారోళ్ల’ మద్దతు ఉండేనా..?

image

TDP- జనసేన- BJP పొత్తులో భాగంగా APలో జనసేన 21 స్థానాల్లో పోటీచేయనుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో 9మంది ఉభయగోదారి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. మరో 2 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం తూ.గో. జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం సీట్లలో 50 శాతం అభ్యర్థులను మన గోదారి జిల్లాల నుంచే బరిలో నిలిపారు. మరి జనసేనను గోదారోళ్లు ఆదరించేనా..?
– మీ కామెంట్..?

News March 19, 2024

ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. ఐదుగురిపై కేసు

image

కల్లూరుకి చెందిన లింగం కిరణ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న బాలికకు కిరణ్‌తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో తన వెంట రావాలని బాలికను కిరణ్ భయపెట్టేవాడు. ఈ క్రమంలోనే బైక్‌పై తీసుకెళ్లి పలుసార్లు అత్యాచారం చేశాడు. సదరు బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితుడితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

బి.కొత్తకోట: ప్రియుడుతో కలిసి తండ్రిని హత్య చేయించిన కూతురు

image

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి కూతురే తండ్రిని హత్య చేయించిందని ములకలచెరువు ట్రైనీ DSP ప్రశాంత్ తెలిపారు. మండలంలోని మొరవపల్లి వద్ద కోళ్లఫారంలో వారం క్రితం టీడీపీ నేత రాజారెడ్డిని దారుణంగా హత్యగురైన విషయం తెలిసిందే. కాగా సోమవారం హత్యకేసులో నిందితులైన కూతురు బ్రాహ్మణి, ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు.

News March 19, 2024

శ్రీకాకుళం: కోడ్ నేపథ్యంలో లైసెన్సు తుపాకీలు స్వాధీనం

image

ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ సూచించారు. బ్యాంకు భద్రత సిబ్బంది, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సిబ్బంది వద్ద ఉన్న 75 మినహా మిగిలినవి అప్పగించాలన్నారు. జిల్లాలో 254 లైసెన్సులపై 273 తుపాకీలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న మిగతా తుపాకిలు అప్పగించాలన్నారు.

News March 19, 2024

ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా‌ లోడు వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకు మీద ఉన్న ఇద్దరు యువకులు డివైడర్‌ మీద పడి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

విజయవాడ: కామాంధుడికి కఠిన శిక్ష విధించిన పోక్సో కోర్ట్

image

విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధుడికి (36) సోమవారం పోక్సో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. నిందితుడిపై గత ఏడాది జులై 2న కుమార్తెపై(15) అత్యాచారం చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన పోక్సో కోర్టు జడ్జి ఎస్. రజిని నిందితుడికి జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీకి ఆదేశాలిచ్చారు.

News March 19, 2024

గుంటూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

image

గుంటూరులో లాడ్జిలపై సోమవారం కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ అన్వర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్పీ తుషార్, ఏఎస్పీ షెల్కే ఆదేశాలతో రైలుపేట ఆర్టీసీ బస్టాండ్, గుంటూరు తోట తదితర ప్రాంతాల్లోని లాడ్జిలపై తనిఖీలు నిర్వహించామన్నారు. వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

News March 19, 2024

ఏలూరు: ఎన్ని విగ్రహాలకు ముసుగులేశారంటే ..!

image

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. 883 వాల్‌రైటింగ్స్, 5,717 పోస్టర్లు, 5,634 బ్యానర్లు, 2,140 హోర్డింగ్స్ మొత్తం 14,374 తొలగించడం జరిగిందని అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేతలు, పార్టీలకు సంబంధించి.. 2,697 విగ్రహాలకు ముసుగుతో పాటు ప్రైవేట్ ప్రదేశాలలో ఉన్న 558 వాల్ రైటింగ్స్, 3,778 పోస్టర్లు, 2,981 బ్యానర్లు, 1,480 హోర్డింగ్స్ మొత్తం కలిసి 8,797 తొలగించామన్నారు.

News March 19, 2024

జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలి: వర్మ

image

గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

News March 19, 2024

ప.గో: ‘పది’ పరీక్షలకు 1597 మంది గైర్హాజరు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు 23,120 మందికి గాను 21,523 మంది హాజరయ్యారని,  1597 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

error: Content is protected !!