India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి గూడూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా అతని భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని 108లో మచిలీపట్నం తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గోపాలపురం మండలం బీమోలు గ్రామంలో పండగ నాడు విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో బిల్డింగ్ పైన పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. హుటాహుటిన క్షతగాత్రుణ్ణి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు యాసిన్ (40)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేశారు.
ఆల్ ఇండియా అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్లో ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఆంధ్ర ప్రదేశ్) విజేతగా నిలిచింది. ఒడిశా రాష్ట్రం కుర్దాలో జరిగిన టోర్నమెంట్లో ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, బీహార్, తమిళనాడు తరఫున జట్లు పాల్గొన్నాయి. ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఐసీసీ) ఫైనల్లో ఝార్ఖండ్ పై గెలిచి విజేతగా నిలిచినట్లు కోచ్ గోపి తెలిపారు.
లేపాక్షి ఆలయాన్నికి రామాయణంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని తీసుకెళుతుండగా కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తాడు. రావణుడు అడ్డొచ్చిన ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయింది. సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు విషయం తెలుసుకుని ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షీ అని పలికాడు. ఆ పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థలపురాణం.
రాజంపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజంపేట మైనార్టీ నేత గండికోట గుల్జార్ భాష రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. నందలూరుకు చెందిన భువనబోయిన లక్ష్మీనరసయ్య రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మైనార్టీ నాయకుడు సయ్యద్ అమీర్ వక్ఫ్ బోర్డ్ సెక్రటరీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.
విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేగా రేపు(గురువారం) నామినేషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ.పాల్ తెలిపారు. బుధవారం రైల్వే న్యూకాలనీలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీ, తెలంగాణలో మోదీని వ్యతిరేకించే సత్తా ఉన్న ఏకైక పార్టీ వారిదే అన్నారు. పార్టీ గుర్తు హెలికాప్టర్కు బదులు కుండ ఇచ్చారని చెప్పారు.
పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటి వద్దకు వారు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ, టీడీపీ నాయకులను వెళ్లగొట్టారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గతేడాది జనవరి 5వ తేదీ నాటికి 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదనంగా పాణ్యంలో 17, ఎమ్మిగనూరులో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో మరో 18 కేంద్రాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య2,204కు చేరింది. కర్నూలులో 258, పాణ్యంలో 357, పత్తికొండలో 255, కోడుమూరులో 275, ఎమ్మిగనూరులో 272, మంత్రాలయంలో 237, ఆదోనిలో 256, ఆలూరులో 294 పోలింగ్ కేంద్రాలున్నాయి.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో సవుదాల వెర్రెమ్మ (55) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదే రామకృష్ణ (38) అనే వ్యక్తి తన భార్యకు అమ్మమ్మ అయిన వెర్రెమ్మను బుధవారం గొంతు కోసి హత్యచేశాడు. కుటుంబ కలహాలే కారణమని కొత్తపేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.