India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్లో ఉంటున్నారు. మరదలి కూతురు(13) ఇతని వద్దే ఉంటోంది. ఆ బాలికకు ఇన్స్టాగ్రామ్లో బెంగళూరులో చదివే విజయ్తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో బాలిక శ్రీనివాసరావు ఇంట్లోని నగలు, నగదు చోరీ చేసి అతనికి పంపేది. ఇటీవల డబ్బులు పోవడం గమనించిన శ్రీనివాసరావు బాలిక ఫోన్లో వాట్సాప్ చూడగా బండారం బయటపడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
కర్నూలులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.108.91 ఉండగా గత పది రోజులుగా 109.22 ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర నేడు రూ.96.80గా ఉండగా..గత పది రోజులుగా రూ.97.09 ఉంది.అలాగే నంద్యాల జిల్లాలో పెట్రోల్ నేడు రూ.109.89 ఉండగా మంగళవారం రూ.109.76 ఉంది. డీజిల్ రూ.97.69 ఉంది.
కడప YVUలో ఆదివారం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. రంజాన్కు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సుల్తానా(23) మరుసటి రోజు కాలేజ్కు వెళ్లి అరగంట ముందే హాస్టల్కు వచ్చి ఉరివేసుకున్నట్లు తోటి విద్యార్థినిలు తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడిందని చెప్పారు. దీంతో ఫోన్కాల్పై అనుమానం వ్యక్తం చేసి సెల్ఫోన్ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుర్రంకొండ దవలత్ ఖాన్ పల్లికి చెందిన ఇద్దరు వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన ఒకరి భార్య మరోక పురుషుడితో ఒకచోట ఉండగా భర్త గమనించి భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి కూడా విషం తాగేశాడు. ఇద్దరిని వేరువేరు వాహనాల్లో మదనపల్లికి తరలించారు.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సమీపంలో గల శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం కొండ దిగువన శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సైకత శిల్పాన్ని మంగళవారం తిలకించిన పలువురు భక్తులు ఆయనను అభినందించారు.
కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ అనుసంధానంలో ఉన్న కే.వీ.ఆర్ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ కాలేజీలలో సెమిస్టర్ 2, 4వ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.రేపటి నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డీవీఆర్ సాయి గోపాల్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్, ఐడి కార్డ్, యూనిఫామ్ తప్పనిసరి అన్నారు.
గుంటూరులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.73, లీటర్ డీజిల్ ధర రూ.97.56గా ఉంది. పది రోజులుగా వీటి ధరలు నిలకడగానే ఉన్నాయి. బాపట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.98 ఉండగా, డీజిల్ ధర రూ.96.85గా ఉంది. పల్నాడులో డీజిల్ ధర రూ.97.42 ఉండగా, పెట్రోల్ను రూ.109.60కి విక్రయిస్తున్నారు.
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం క్రీస్తు పూర్వం 1402లో నరసింహ మొదలియార్ నిర్మించారు. ఇక్కడ సీతమ్మ రాముల వారికి కుడి వైపున, లక్ష్మణుడు ఎడమవైపున దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారిని పోలిన విధంగా రాముడు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలలో కూడా ఇలాగే సీతమ్మ కుడి వైపు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయానికి ఎదురుగా ప్రసన్న ఆంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు.
సీతారాముల కళ్యాణాన్ని నేటి రాత్రి జరిపించేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏర్పాట్లుచేశారు. రాత్రి 9 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకట దివాకర్, ఈవో అశ్విని తెలిపారు. దేశంలో రాత్రిపూట కళ్యాణం జరిగే ఏకైక ఆలయం కావడం విశేషం. పూర్వం పిఠాపురం మహారాజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తిలకించి, చేబ్రోలు వచ్చేసరికి రాత్రి అయ్యేదట. అప్పటినుంచి రాత్రి జరిపించడం ఆనవాయితీగా మారింది.
గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పి భార్గవ్ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 590 ర్యాంక్ సాధించారు. 2016లో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్లో చేరిన అతను IAS లక్ష్యంతో 2018లో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. గతేడాది ఫలితాల్లో 722 ర్యాంక్ సాధించాడు. దీంతో IDASలో శిక్షణ పొందుతున్నాడు. తాజా ర్యాంక్తో IPS, IRS మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున IAS కోసం మళ్లీ ప్రయత్నిస్తానని తెలిపారు.
Sorry, no posts matched your criteria.