India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో విశాఖకి చెందిన వేములపాటి హనిత 887 ర్యాంకుతో మెరిశారు. గతేడాది గ్రూప్-1లో రాణించి వైద్యారోగ్యశాఖలో కొలువు సాధించిన ఈమె ఏడాది తిరక్కుండానే సివిల్స్లో సత్తాచాటారు. మూడు ప్రయత్నాల్లో మెయిన్స్ వరకు వచ్చి ఆగిపోయిన హనిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు.
కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో ఇంటి చిరునామా మార్పు కోసం ఫాం-6, 8ల క్లెయిమ్స్ ఈ నెల 25లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం అనంత కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ నెల 14 దాకా ఆ రెండు రకాల ఫారాలను తీసుకున్నాం. ఇప్పటిదాకా వచ్చిన వాటిని పరిష్కరించే దిశగా కసరత్తు సాగుతోందన్నారు.
అనంతపురం జిల్లాలో టీసీసీ – 2024 డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. www.bse.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
అద్దంకికి చెందిన జగన్నాథం రాహుల్ యూపీఎస్సీ ఫలితాల్లో 873వ ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రులు బాబూరావు, ప్రభావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ముగ్గురు పిల్లలు కాగా వారిలో మొదటి కుమారుడు రాహుల్. 1 నుంచి 5 వరకు అద్దంకిలో, 6, 7 తరగతులు గుంటూరులో, విజయవాడలో ఇంటర్, ఐఐటీ మద్రాస్లో బీటెక్ చదివారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించిన రాహుల్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బూర్జ మండలం నీలంపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్ జై భారత్ నేషనల్ పార్టీ(జేబీఎన్వై) తరఫున MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం విడుదల చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో గౌరీ శంకర్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు ఖరారు చేశారు.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. ఎస్కేయూ లోని కెమిస్ట్రీ గ్యాలరీలో పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే మే 4 నుంచి ఎస్కేయూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతాయని తెలిపారు.
ట్రైనీ నర్సుపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. గంట్యాడ మం.కి చెందిన గోపీ తన తల్లిని వారం క్రితం ఆస్పత్రిలో చేర్చాడు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నర్సు మంచినీరు తాగేందుకు గదిలోకి వెళ్లగా ఆమె వెనకే వెళ్లి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో సిబ్బంది చేరుకున్నారు. మద్యం మత్తులో ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. నెల్లూరు ఎంపీ స్థానానికి కలెక్టరేట్ లో, కందుకూరుకు సబ్ కలెక్టర్ ఆఫీసులో, కావలికి ఆర్డీఓ ఆఫీసులో, ఆత్మకూరుకు మున్సిపల్ ఆఫీసులో, కోవూరుకు కోవూరు తహశీల్దార్ ఆఫీసులో, నెల్లూరు సిటీకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో, నెల్లూరు రూరల్ కు ఆర్డీఓ ఆఫీసులో, సర్వేపల్లికి వెంకటాచలం ఎంపీడీఓ ఆఫీసులో, ఉదయగిరికి ఉదయగిరి తహశీల్దార్ ఆఫీసులో స్వీకరిస్తారు
ప.గో. జిల్లా కాళ్ల మండలం సీసలికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష UPSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 198 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించగా.. డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. కాగా ఈమె తండ్రి రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ఉష గృహిణి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం రూట్ మ్యాప్ విడుదల చేసింది. మధ్యాహ్నం 2: 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పెడన వెళతారు. పెడనలో 3 PM- 4:30 PM మధ్య నిర్వహించే ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. అనంతరం 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటరులో నిర్వహించే వారాహి విజయభేరిలో పాల్గొంటారని తెలిపింది.
Sorry, no posts matched your criteria.