Andhra Pradesh

News April 17, 2024

గుంటూరు: నేడు టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.?

image

మాజీ MLA నంబూరు సుభాని నేడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన తన తనయుడు, డిప్యూటీ మాజీ మేయర్ గౌస్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2004లో గుంటూరు తూర్పు నుంచి సుభాని గెలిచారు. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు పని చేశారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సుభాని, ఉండవల్లికి కార్లతో ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం.

News April 17, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. కణితి గవర వీధికి చెందిన ఎం.మణి (63) మంగళవారం మధ్యాహ్నం కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సైకిల్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా వడ్లపూడి వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

News April 17, 2024

ఏలూరు: యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు సాక శివకు పదేళ్ల జైలు శిక్ష, రు.2500/- జరిమానా విధించినట్లు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. 2021 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు.

News April 17, 2024

కడప: ఎన్నికల బరిలో రాజకీయ కురువృద్ధులు

image

కడప జిల్లా ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజులరెడ్డి TDP తరఫున పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో 5 సార్లు MLAగా గెలిచారు. అటు మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి 4 సార్లు MLAగా గెలిచారు. మరోసారి YCP నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిద్దరూ స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. రాష్ట్రంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు వీరే కావడం విశేషం.

News April 17, 2024

ప్రకాశం: మాజీ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 780వ ర్యాంక్

image

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో 780 ర్యాంక్ సాధించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఒంగోలులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఐఏఎస్ అవ్వాలన్నా దృఢ సంకల్పంతో చదివి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా పలువురు ఉదయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News April 17, 2024

కర్నూలు : ఎవరెవరు ఎక్కడ నామినేషన్ వేస్తారో తెలుసా?

image

జిల్లాలో 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్లు వేసుకోవచ్చు.
కర్నూలు- కర్నూలు నగర పాలక సంస్థ
పాణ్యం- కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబరు
పత్తికొండ- పత్తికొండ ఆర్డీవో ఆఫీస్
కోడుమూరు – కర్నూలు ఆర్డీవో ఆఫీస్
ఎమ్మిగనూరు- ఎమ్మిగనూరు తహశీల్దార్ ఆఫీస్
మంత్రాలయం- మంత్రాలయం తహశీల్దార్ ఆఫీస్
ఆదోని- ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్
ఆలూరు- ఆలూరు తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ వేయవచ్చు.

News April 17, 2024

యల్లనూరు: మహిళా టీచర్ సస్పెండ్

image

యల్లనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయకుమారిని సస్పెండ్ చేసినట్లు ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు వాట్సాప్ గ్రూపులలో నిబంధనలకు విరుద్ధంగా పంపడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News April 17, 2024

తూ.గో.: సీతారాముల కళ్యాణానికి 24 ఏళ్లుగా..

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.

News April 17, 2024

మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

image

మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలప్ప(67), సారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు మొగిలప్పను తీసుకొచ్చి మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మొగిలప్ప బుధవారం ఉదయం తను ఉంటున్న బ్యారక్ లోనే కుప్పకూలిపోవడం గుర్తించిన జైలర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు

News April 17, 2024

సివిల్స్‌లో సిక్కోలు కుర్రోడు సత్తా

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో సత్తా చాటాడు. NITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకుని 467 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు, తల్లి రోహిణి వ్యవసాయం చేస్తూ.. గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు వంశీ శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా చేస్తున్నాడు.